Mahbubnagar

News May 2, 2024

MBNR: బ్యాటరీ కంపెనీ బాధితులకు డీకే అరుణ మద్దతు

image

మహబూబ్ నగర్ ఐటీ పార్క్ పరిధిలో నెలకొల్పిన అమర రాజా లిథియం బ్యాటరీ కంపెనీని ఎత్తి వేయాలని ప్రజలు చేపట్టిన నిరసన దీక్షకు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ బుధవారం రాత్రి తన మద్దతు ప్రకటించారు. దివిటిపల్లి, సిద్దయ్యపల్లి, ఎదిర, అంబట్ పల్లి గ్రామల ప్రజలు ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఎదిర గ్రామ కేంద్రంగా గత 49 రోజులుగా శాంతియుత నిరసన దీక్ష చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమ వద్దు అంటున్నారు.

News May 2, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికలు.. పది రోజులే కీలకం.!

image

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పది రోజులే కీలకంగా కానున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ప్రచారాల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ పది రోజులు కీలకం కావడంతో అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచి ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఈ కొన్ని రోజుల ప్రచారాలు మరో ఎత్తుగా సాగనుంది.

News May 2, 2024

NRPT: ‘ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

image

పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష పాల్గొన్నారు. ప్రతి ఓటరుకు ఓటు స్లిప్ అందించాలని, వృద్ధులకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహణకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సంబందిత అధికారులు పాల్గొన్నారు.

News May 2, 2024

NRPT: ‘కార్మికులు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

కార్మికుల సంక్షేమం కొరకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ అన్నారు. బుధవారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం కొరకు 15100 నంబరుకు ఫోన్ చేసి సమస్య వివరిస్తే న్యాయ సహాయం అందిస్తారని చెప్పారు.

News May 1, 2024

BRS విజయం ఖాయం: RS ప్రవీణ్ కుమార్

image

అధికార కాంగ్రెస్, మతతత్వ BJPలు ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని BRS కైవసం చేసుకుంటుందని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం వెల్దండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని విమర్శించారు.

News May 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒మరికల్: సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
✒ఉమ్మడి జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు
✒మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి: దీపాదాస్ మున్సీ
✒ఫారుక్‌నగర్: రైల్వే ట్రాక్‌పై మృతదేహం
✒ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వహించాలి:NGKL ఎస్పీ
✒ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒కాంగ్రెస్ గారడీ మాటలతో ప్రజలు మోసపోయారు:RSP
✒MP ఎన్నికలు.. స్పీడ్ పెంచిన ఎంపీ అభ్యర్థులు, నేతలు

News May 1, 2024

రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన చిన్నారెడ్డి

image

వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల సందర్భంగా జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, కరాటే కిక్ బాక్సింగ్ వంటివి నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News May 1, 2024

మరికల్: సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

image

మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ సెంటర్‌లో సోడా సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యూస్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు సోడా సిలిండర్ పేలింది. దీంతో జ్యూస్ తాగేందుకు నిలిచి ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గోపాల్ కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా గద్వాల జిల్లాలో తొలిసారి 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అటు ఎండల వేడిమికి రోడ్లు సెగలు కక్కుతున్నాయి. ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు తారు రోడ్లపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News May 1, 2024

కొల్లాపూర్: కార్మికులను సన్మానించిన మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మేడే కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల జీవితాలలో నేటికీ పురోగతి లేదన్నారు. దీనికి గత పాలకులే కారణం అన్నారు. కార్మికుల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసి వారిని సన్మానించారు.