India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలకేంద్రం వేసవి సాంస్కృతిక శిక్షణ ముగింపులో భాగంగా పాలమూరు బాలోత్సవ్ పేరిట బుధవారం సాంస్కృతిక సంబరం చేపట్టనున్నట్లు బాలకేంద్రం శిక్షకులు తెల్కపల్లి గజేంద్ర, రాజేశ్ కన్న వెల్లడించారు. మహబూబ్ నగర్ కొత్త బస్టాండ్ సమీపంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక మహోత్సవంప్రారంభమవుతుందన్నారు. చిన్నారులతో సంప్రదాయ, జానపద నృత్యాలు, చిత్రకళ ప్రదర్శన ఉంటుందని అన్నారు.

నాగర్ కర్నూల్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క) పోటీలో లేకుండానే ఓడిపోయారు. అసలు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కంటే నోటాకే వచ్చిన ఓట్లే ఎక్కువ. మొత్తానికి నోటాకు 4580 ఓట్లు రాగా, బర్రెలక్కకు 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆమె కంటే ఎక్కువ ఓట్లు నోటాకే పడ్డాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

సొంత జిల్లాలో ఎన్నికలను పతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 10సార్లు పర్యటించినా ఫలితం దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతోపాటు MBNR ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ రెడ్డి సైతం ఓటమి చెందడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ అలుముకుంది. ఇది రేవంత్కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో నోటాకు ఆదరణ తగ్గింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఇష్టం లేనప్పుడు ఓటర్లు నోటాకు ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో నోటాకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు ఓట్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్న అభిప్రాయానికి ఓటర్లు వచ్చినట్లు స్పష్టత వస్తోంది.

ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ను బీజేపీ, నాగర్కర్నూల్ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. కాగా MBNR కౌంటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ తీవ్ర ఉత్కంఠ రేపింది. రౌండ్ రౌండుకూ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అయింది. చివరకు 7,601 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ గెలిచింది. అటు NGKLలో మల్లు రవి 94,414 ఓట్లతో ఘనవిజయం సాధించారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన డీకే అరుణకు జిల్లా ఎన్నికల అధికారులు మంగళవారం సాయంత్రం గెలుపొందిన పత్రాన్ని అందజేశారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ కౌంటింగ్ మొదట నుండి ఉత్కంఠ మధ్య జరిగింది. ఎట్టకేలకు డీకే అరుణ స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై విజయం సాధించారు. గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

✒మహబూబ్ నగర్ లో డీకే అరుణ(BJP) విజయం
✒నాగర్ కర్నూల్ లో మల్లురవి(INC) ఘన విజయం
✒భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు
✒ఉమ్మడి జిల్లాలో CONGRESS,BJP నాయకుల సంబరాలు
✒APలో చంద్రబాబు గెలుపు.. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల టిడిపి కార్యకర్తల సంబరాలు
✒GDWL:ఈదురు గాలులు.. రాకపోకలు బంద్
✒NRPT: ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి
✒ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లపై అధికారుల పై అధికారుల ఫోకస్

మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి స్వల్ప తేడాతో డీకే అరుణపై ఓడిపోయారు. దీంతో వంశీ ఇప్పటి వరకు వరుసగా 3సార్లు ఓటమి చవిచూశారు. 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి 78 ఓట్లతో MLAగా గెలుపొందిన చల్లా 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మహబూబ్నగర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోగా తాజాగా మరోసారి ఓటమి పాలయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ ఆయనను ప్రజలు ఆదరించలేదు.

పాలమూరు పార్లమెంట్ సీటు హాట్ సీటుగా మారింది. మహబూబ్ నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. NGKLలో మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు.

మహబూబ్నగర్ లోక్సభ ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠంగా సాగుతోంది. 17వ రౌండ్ ముగిసేవరకూ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కేవం 3000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్కు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కౌంటింగ్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మొదటి నుంచి లీడ్లో కొనసాగిన డీకే అరుణ ఆధిక్యం తాజాగా తగ్గడంతో కమలం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
Sorry, no posts matched your criteria.