Mahbubnagar

News April 25, 2024

MBNR:రాష్ట్రంలోనే బైపీసీలో మనమే టాప్!

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన సఫూరా తబస్సుమ్ బైపీసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించింది. బైపీసీలో ఆమెకు 440 మార్కులకు 438 వచ్చాయి. ఇంగ్లిష్‌లో 99 (థియరీ 79, ప్రాక్టికల్స్ 20),అరబిక్‌లో 99, బోటనీలో 60, జువాలజీ 60, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో ఆమెకు గ్రామస్థులు, పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

News April 25, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్

image

CM రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మహబూబ్‌నగర్ BJP అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక సీఎంగా ఉన్న రేవంత్ ఆరు సార్లు వచ్చారు. అంటే కాంగ్రెస్‌కు ఓటమి భయం మొదలైందని అన్నారు. రేవంత్ రెడ్డికి తాను పోటీ కానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.

News April 25, 2024

మే 4న నారాయణపేటకు ప్రధాని మోదీ

image

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో అచ్చంపేట GOVT కాలేజ్ విద్యార్థిని సత్తా

image

అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల స్నేహిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఎంపీసీ చేసిన స్నేహిత ఫస్టియర్‌లో 470 మార్కులకు 466 సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

News April 25, 2024

సెకండియర్ ఫలితాల్లో నారాయణపేటకు 34వ స్థానం

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 64.75శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64.21%తో MBNR 22వ స్థానంలో నిలిచింది. 7909కి 5078 మంది పాసయ్యారు. 62.82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59.06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 4942కి 2918 మంది పాసయ్యారు. 53.81%తో NRPT 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఫస్టియర్‌లో MBNRకు 20.. నారాయణపేటకు 34వ స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో MBNR జిల్లా 53.94 శాతంతో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8,962 మందికి గానూ 4834 మంది పాసయ్యారు. NRPT 44.3 శాతంతో 34వ స్థానంలో నిలిచింది. 3781కి గానూ 1675 మంది, WNP 52.78 శాతంతో 23వ స్థానంలో నిలవగా 5458కి గానూ 2881 పాసయ్యారు. NGKL 45.57 శాతంతో 33వ స్థానంలో ఉండగా 5363కి గానూ 2444 మంది, GDL 53.48 శాతంతో 21వ స్థానంలో నిలవగా 3257కి 1742 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్..!

image

సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో నిన్న ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోస్ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా మద్దూరులో, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లూరు రవికి మద్దతుగా బిజినపల్లిలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో విజయంపై ధీమాతో ఉన్నారు.

News April 25, 2024

గద్వాల: ఊయలగా కట్టిన చీర చుట్టుకొని మహిళ మృతి

image

ఊయలగా కట్టిన చీర గొంతుకు చుట్టుకొని మహిళ చనిపోయింది. పోలీసుల వివరాలు.. మల్దకల్‌కు చెందిన హేమలత, పరశురాముడు దంపతులు జ్యూస్ వ్యాపారం చేసి జీవిస్తున్నారు. రోజులాగే సోమవారం వ్యాపారం ముగించుకొని హేమలత ఇంటికి వచ్చింది. అప్పటికే చీరతో కట్టిన ఊయలో కుమార్తె ఊగుతుండగా.. ఇంట్లోకి వెళ్తున్న హేమలత గొంతుకు చీర చుట్టుకొని కిందపడింది. గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.

News April 25, 2024

26న పాలమూరుకు కేసీఆర్ రాక

image

మాజీ CM, BRS అధినేత కేసీఆర్ ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 26న జిల్లా కేంద్రంలో రోడ్లో పాల్గొంటారని, తర్వాత గడియారం కూడలిలో నిర్వహించే సమావేశంలో ప్రసంగిస్తారని వెల్లడించారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు.. దిగులుపడకు మిత్రమా..!

image

ఉమ్మడి జిల్లాలో పది, ఇంటర్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై అఘాయిత్యాలకు పాల్పడటం మనసును కలచివేస్తోంది. ఉత్తీర్ణత సాధించలేకపోయినా మళ్లీ పరీక్ష రాసి సత్తాచాటాలి. ఆశించిన మార్కులు రాకపోయినా నిరాశ చెందకుండా ఉన్నత చదువుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని, ఆలోచనలు మార్చుకుంటే అన్ని అద్భుతాలే అని విద్యాశాఖ అధికారులు, వైద్య నిపుణులు సూచించారు.