Mahbubnagar

News April 13, 2024

MBNR: అకాల వర్షం.. ముగ్గురు దుర్మరణం

image

ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, ఉప్పునుంతల, తిమ్మాజీపేట, రాజాపూర్‌ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఉప్పునుంతల మండలం తాడూర్‌ వాసి గుండేమోని శ్యామలమ్మ పొలం వద్ద పిడుగుపాటుతో స్పాట్లోనే మృతి చెందింది. తాడూరు మండలం ఐతోలులో తోడికోడళ్లు ఆసియా బేగం, అలియా బేగం కరెంట్ షాక్‌తో చనిపోయారు.

News April 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR:నేడు వామపక్షాల జిల్లా సదస్సు
✔దేవరకద్ర:నేటి నుంచి ఈశ్వర వీరప్పయ్య స్వామి ఉత్సవాలు ప్రారంభం
✔గండీడ్:VOA& ఉపాధ్యాయుల సమావేశం
✔NRPT:15న సీఎం రాక.. కొనసాగుతున్న ఏర్పాటు
✔కల్వకుర్తి:BRS కార్యకర్తల సమావేశం
✔కల్వకుర్తి:పలు మండలాలలో కాంగ్రెస్ కార్నర్ సమావేశాలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు,MP అభ్యర్థులు
✔NRPT,GDWL:పలు గ్రామాలలో కరెంట్ కట్

News April 13, 2024

MBNR: ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) HYDలో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వీరబాబుతో 4ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించిన అతను నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఇంటికి వచ్చిన యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.

News April 13, 2024

MBNR: 20 నుంచి వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు

image

HYD క్రికెట్ సంఘం, MBNR జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 20 నుంచి మే 20 వరకు 5 చోట్ల వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ వెల్లడించారు. MBNRలో ఎండీసీఏ మైదానం, GDWLలో డీఎస్ఏ, NGKL జిల్లా పరిషత్తు బాలుర మైదానం, జడ్చర్లలో డీఎస్ఏ, కల్వకుర్తిలోని డీఎస్ఏ మైదానాల్లో నెల రోజుల పాటు ఉచిత శిబిరాలు నిర్వహిస్తామన్నారు.

News April 13, 2024

కాంగ్రెస్‌కు ఓటేసినా.. BRSకు వేసినా మురిగిపోయినట్లే: DK అరుణ

image

CM రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. పాలమూరు బిడ్డగా ఆయన జిల్లాకు ఏం చేశారో చెప్పాలని DK అరుణ అన్నారు. బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జిల్లాకు సాగునీరు కోసం ఉమ్మడి రాష్ట్రంలో నేను కొట్లాడా. ఎంపీగా రేవంత్‌ ఏనాడూ ఈ జిల్లాపై మాట్లాడలేదు. ఆరు గ్యారంటీలు అమలు కావు.. 17సీట్లు గెలిచినా రాహుల్‌ ప్రధాని కారు. BRSకు ఓటేసినా.. కాంగ్రెస్‌కు వేసినా మురిగిపోయినట్లే’ అని అన్నారు.

News April 13, 2024

NGKL: పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

ఉమ్మడి జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. బల్మూర్ మండలం కొండనాగుల పెద్దగుడి బండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు అర్చకుడు విద్యాసాగర్ తెలిపారు. గతంలోనూ ఇక్కడ తవ్వకాలు జరిగాయని వీటిపై ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించి తవ్వకాలు జరిగాయని చెప్పారు.

News April 13, 2024

MBNR: డీకే అరుణ అసమర్థత నాయకురాలు: వంశీ చంద్‌రెడ్డి

image

బిజెపి ప్రభుత్వం కేంద్రంలో10 ఏళ్లు అధికారంలో ఉన్న డీకే అరుణ అసమర్థత వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. కేశంపేటలో వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రజల అవసరాలను ఏనాడైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. అరుణ బంగ్లా రాజకీయాలు అహంకార ధోరణి ప్రజలకు తెలుసునని ఆమెను విమర్శించారు.

News April 12, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యంశాలు

image

@MBNR:అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలి: వంశీ చందర్ రెడ్డి.
@ కొడంగల్: వైభవంగా శ్రీవారి చక్రస్నానం.
@ కోడేరులో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.
@ బిజినేపల్లి: చిరుత పులి దాడుల్లో లేగ దూడ మృతి.
@ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నాగర్కర్నూల్ కలెక్టర్.
@ మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పరిధిలో ఎంపీ అభ్యర్థుల ప్రచారం.
@ అచ్చంపేట: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ సిఎస్.

News April 12, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✏NGKL: కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి
✏MBNR:అసత్య ప్రచారాలు తిప్పి కొట్టండి: చల్లా వంశీచంద్‌రెడ్డి
✏నరేంద్ర మోడీకి మరోసారి పట్టం కట్టాలి: భరత్ ప్రసాద్
✏ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
✏బిజినేపల్లి:చిరుత పులి దాడిలో మరో లేగదూడ మృతి
✏NGKL: పార్లమెంట్ ఎన్నికల శంఖం పూరించిన మల్లురవి
✏ఉమ్మడి జిల్లాలో నూతన ఓటర్ల పై అధికారుల ఫోకస్
✏NRPT: జనగర్జన సభ ఏర్పాట్లు పరిశీలించిన డిఎస్పీ

News April 12, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి క్రైమ్ న్యూస్

image

√ నాగర్ కర్నూల్: విద్యుత్ తగిలి ఇద్దరూ తోటి కోడళ్ళ మృతి.
√బొంరాస్ పేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.
√ కొడంగల్: మద్యం మత్తులో డ్రైవింగ్ ఒకరు మృతి.
√ ఉప్పునుంతల: పిడుగుపాటు గురై మహిళ మృతి.
√ నాగర్ కర్నూల్: 30 గ్రాముల గంజాయి పట్టివేత.
√ నారాయణపేట: అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.
√ కడ్తాల్: వివాహిత అదృశ్యం కేసు నమోదు.

error: Content is protected !!