India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు పదవ తరగతి, నాలుగు ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
✒‘కాంగ్రెస్ జన జాతర’ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు,శ్రేణులు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా BRS నాయకుల “రైతు దీక్ష”
✒పెబ్బేర్:జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
✒BJPకి 400 సీట్లు పక్కా:DK అరుణ
✒పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !
✒తలకిందులుగా తపస్సు చేసిన BRSకు ఒక్క సీటు రాదు:మంత్రి జూపల్లి
✒ఉమ్మడి జిల్లాలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✒నేడు ‘షబ్-ఎ- ఖాదర్’..రాత్రంతా జాగారం
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపర్డెంట్ రంజిత్ మాట్లాడుతూ.. కొల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ మొదటి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షించిన అనంతరం సాధారణ ప్రసవంలోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఒకరు మగ బిడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నర్సులు ఉన్నారు.
రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కోయిలకొండ బిజెపి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రథమ స్థానంలో నిలిపిన నరేంద్ర మోడీకి తప్ప ఇంకెవరికి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని అన్నారు. రాహుల్ గాందీ తన సమయాన్నివృథా చేయడం తప్ప, తను అనుకున్నది ఏమి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాంత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు తలకిందులుగా తపస్సు చేసిన తెలంగాణ రాష్ట్రంలో వారికి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తుక్కుగూడ గ్రామంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై విరుచుకుపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నారని అన్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసి లిస్ట్లో మన పాలమూరుకు చెందిన ఇద్దరు అత్యంత ధనవంతులుగా నిలిచారు. మై హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు 2.3 బిలియన్ డాలర్ల(రూ.19 వేల కోట్లు)తో 1438 స్థానం, MSN ఫార్మా సంస్థ అధినేత ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్ డాలర్ల (రూ.16 వేల కోట్లు)తో 1623 స్థానంలో ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలలో ఔట్ సోర్సింగ్పై ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. వారిపై వార్డెన్స్ పెత్తనం చెలాయిస్తూ తమని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అందుకుగాను శనివారం జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావుకు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆధిపత్య భావజాలాన్ని అణగదొక్కాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి సెలక్షన్ కమిటీ దరఖాస్తులను కోరింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న 11 డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 3 ల్యాబ్ అటెండెంట్లు, 9 ఆఫీస్ సబార్డినేట్లు, 1 థియేటర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ ఉన్నాయి. 18- 45 వయసు లోపు స్థానిక అభ్యర్థులు జిల్లా ఉపాది కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో హైవేపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా.. వాహనం బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల నుజ్జునుజ్జు కావడంతో గుర్తించలేక పోతున్నారు.
ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టులోని 36,37 గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతుంది. ప్రతిరోజు వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నాయి. మరమ్మతులకు నిధులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మత్తు పనులు ప్రారంభించలేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రాజెక్టులో మొత్తం 9.68 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడిక పేరుకుపోవడంతో 7 TMCల నీరు నిల్వ ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.