Mahbubnagar

News April 4, 2024

చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు..?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 103 చేనేత, జౌళి సంఘాలు ఉన్నాయి. వీటిలో 13 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీకాలం గడువు 2018 ఫిబ్రవరి 10 నాటికి ముగిసింది. అప్పటినుండి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

News April 4, 2024

MBNR: ఎండలు ఉష్ణోగ్రతలు.. జాగ్రత్త

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఈ క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత ధరూర్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 43.3, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.1, మహబూబ్నగర్ జిల్లా సల్కార్ పేటలో 41.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 41.4 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News April 4, 2024

MBNR: మళ్లీ తెరపైకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ !

image

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న పోలీస్ అధికారులకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలతో BJP నాయకులు ఫోన్‌లో సంప్రదించి బేరసారాలకు పాల్పడిన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ఏడాది MLAల కొనుగోలు కేసు సంచనం రేపిన విషయం తెలిసిందే.

News April 4, 2024

బీఆర్‌ఎస్‌, బీజేపీపై మంత్రి జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు

image

పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్లు రవి పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న భరత్‌ పదవుల కోసం పార్టీ మారారని, బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ గత 10ఏళ్లు నాటకం ఆడారని జూపల్లి పేర్కొన్నారు.

News April 4, 2024

MBNR: మెరుగుపడనున్న తాగునీటి సమస్య !

image

అమృత్ -2 పథకంలో భాగంగా MBNR జిల్లా పరిధిలోని 3 మున్సిపాలిటీలకు రూ.341,25కోట్లు, గద్వాల జిల్లాలో 3 మున్సిపాలిటీలకు రూ.89,46కోట్లు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు గాను రూ.128.29 కోట్లు, NRPT జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు రూ.55.57 కోట్లు, NGKL జిల్లాలోని 2 మున్సిపాలిటీలకు రూ.59.73 కోట్ల నిదులు విడుదలయ్యాయి. ఈ నిధులతో 15 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభం కానున్నాయి.

News April 4, 2024

MBNR: దంచి కొడుతున్న ఎండలు

image

పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే MBNR, GDWL, జిల్లాల్లో 42.03 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 45 రోజులలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధితశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. 

News April 4, 2024

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి

image

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2021-2022 విద్య సంవత్సరంలో డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ సబ్జెక్ట్‌ల పరీక్షల ఫీజును చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు కోరారు. ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు సంబందించిన కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. 200 రూపాయలు ఫైన్‌తో ఏప్రిల్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

News April 4, 2024

MBNR: అనధికారికంగా విద్యార్థులను చేర్చుకుంటే చర్యలు

image

ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనధికారికంగా విద్యార్థులను చేర్చుకుంటే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేయలేదని, అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in)లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని అన్నారు.

News April 4, 2024

మద్దూర్: వివాహిత ఆత్మహత్య.. ప్రియుడు అరెస్ట్

image

పెళ్ళైన మూడు రోజులకే <<12979867>>వివాహిత ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై ఎస్ఐ రామ్ లాల్ వివరాలు.. యువతి(20)కి తల్లిదండ్రులు మార్చి నెలలో ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్లైన మూడో రోజున తన ప్రియుడు ఆమెను కలిశాడు. మార్చి 16న ఆమె పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా నిందితుడిని మంగళవారం రిమాండుకు తరలించారు.

News April 4, 2024

మహబూబ్‌నగర్: పది మూల్యాంకనం ప్రారంభం

image

టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని గ్రామర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 11 వరకు కొనసాగనుంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 160 మందికి పైగా విధులకు గైర్హాజరైనట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు TA, DA ఇవ్వడం లేదని, పారితోషికం తక్కువేనని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!