India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ యాదయ్య కుటుంబం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. యాదయ్య దుండగుల కాల్పులలో మృతిచెందగా ఆయన భార్యకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని భూమిని రేవంత్ రెడ్డి కేటాయించారు ఈక్రమంలో నేడు యాదయ్య భార్య పిల్లలతో వెళ్లి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన జవాన్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు.
ఉమ్మడి జిల్లాలో 2022-23 సంవత్సరంలో 4,670 ఎకరాల్లో రైతులు వివిధ కూరగాయలను సాగు చేశారు. 2024 సంవత్సరంలో 2,577 ఎకరాలకు సాగు పడిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం వేల టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం, పదేళ్లు నిజమైన పాలన అందించిన బీఆర్ఎస్ మధ్య జరిగే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో తాగునీటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. పాలమూరు జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. వీరు జిల్లాలో జూలై నెల వరకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిదిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మహిళా ఓటర్లు అత్యధికంగా గద్వాల సెగ్మెంట్లోనే ఉన్నారు. గద్వాలలో 1,30,499 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,2,282 మంది మహిళా ఓటర్లతో వనపర్తి 2వ స్థానంలో ఉంది. అచ్చంపేట 1,24,382 ఓట్లతో 3వ స్థానంలో ఉండగా, అలంపూర్లో 1,21,074, కల్వకుర్తిలో 1,20,148, కొల్లాపూర్లో 1,17,942, నాగర్ కర్నూల్లో 1,19,366 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ అసమర్ధత పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్లో మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలకు పోయి ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు గుర్తించాలన్నారు. ఓటుతో బుద్ది చెప్పాలి, లేకపోతే మరోసారి మోసపోతారని అన్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 6న ‘ఎమర్జింగ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ డా.జి. జిమ్మికార్టన్, కో కన్వీనర్ డా. బి. వెంకట్ రాఘవేందర్ తెలిపారు. పీయూ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ప్రధాన వక్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొ. టీఎల్ఎన్. స్వామి హాజరవుతున్నారని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఒకరిపై మరొకరు చేసే విమర్శలు, ప్రతి విమర్శలతో పాలమూరులో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహ రచనతో ఉన్న అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తూ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి లీగల్ యాక్షన్లోకి దిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. మరి మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలకు పదును పెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అరుణ, వంశీని టార్గెట్ చేసి ముందుకు సాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.