India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MJP బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పెంచినట్లు బీసీ గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అర్హులని, ఈనెల 28న ఉదయం 10 గం. ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. నోవాపాన్ కూడలి సమీపంలో పటాన్చెరు నుంచి సంగారెడ్డివైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి కారు, ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి డివైడర్పైకి ఎక్కంది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు వనపర్తి జిల్లా రాజాపూర్నకు చెందిన కార్మికుడు మహేశ్(20)గా గుర్తించారు.
✔నేడు వనపర్తికి కామారెడ్డి ఎమ్మెల్యే రాక
✔నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✔మక్తల్: అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
✔ఓటరు నమోదుకు రెండు రోజులే గడువు..APPLY చేసుకోండి
✔పలు నియోజకవర్గంలో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✔నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
✔నేడు PUలో జాబ్ మేళా
✔సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు
✔నేడు పాలమూరుకు మాజీ మంత్రి హరీష్ రావు రాక
మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపికను ఈ నెల 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేపడుతున్నట్లు సంఘం కార్యదర్శి భానుకిరణ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
వెల్దండ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి చెర్కూర్ గ్రామంలో ఏకంగా 10 ఇళ్లల్లో చోరీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, తులంన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ రవి గ్రామాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కేర్ 133వ జయంతి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండలాల ప్రజాప్రతినిధులు, పాల్గొని అంబేద్కర్ గ్రహానికి నివాళులర్పించారు. జిల్లాలోని పలు గ్రామాలలో అంబేద్కర్ ఉత్సవాల శోభయాత్ర నిర్వహించి డీజే పాటలకు నృత్యాలు చేయనున్నారు.
ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లు రవితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రజారంజక పాలన అందిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
✏MBNR: మోదీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ
✏కాంగ్రెస్ లో చేరిన పలువురు BJP&BRS నేతలు
✏నేడుPU పరిధిలో ఎంఈడీ పరీక్ష రీషెడ్యూల్ విడుదల
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏BRS పార్టీని వీడే ప్రసక్తి లేదు: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
✏MBNR:పాలమూరు ప్రగతి కాంగ్రెస్తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి
✏తాగునీటి సమస్యలపై అధికారుల సమీక్ష
✏ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలకు టెంట్లు మంజూరు.
ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా సొసైటీ అధికారులు తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఒక సెషన్, మ.2:30 నుంచి సా.5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www .telanganaopenschool.org/ వెబ్ సైట్ లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
@ తెలకపల్లి: బావిలో దూకి మహిళా ఆత్మహత్య.
@ కల్వకుర్తి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇద్దరికీ జైలు శిక్ష.
@అమ్రాబాద్:అక్రమ మద్యం పట్టివేత ముగ్గురిపై కేసు నమోదు.
@ మరికల్: అక్రమంగా తరలిస్తున్న మద్యం డబ్బులు పట్టివేత.
@ దౌల్తాబాద్: చంద్రకల్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ1.50 లక్షల పట్టివేత.
@ తాండూర్: హోటల్లో ఆత్మహత్య చేసుకున్న కోడంగల్ వాసి.
Sorry, no posts matched your criteria.