India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం శ్రీరాముడి తలంబ్రాలు నేరుగా ఇంటికే అందించనున్నట్లు ఆయా డిపోల ఆర్టీసీ డీఎంఈలు తెలిపారు. రూ.151 చెల్లించి ఈనెల 18 వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
1.మహబూబ్ నగర్-91542 98612
2.నాగర్ కర్నూల్-96189 65885
3.కోస్గి-63051 09009
4.గద్వాల్-91542 98609
5.అచ్చంపేట-91542 98608
6.కల్వకుర్తి-91542 98610
7.కొల్లాపూర్-91542 98611
8.నాగర్ కర్నూల్-91542 98613
నారాయణపేట జిల్లా రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అలాంటి ఆలోచన లేదన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు అని స్పష్టం చేశారు. జీఓ69 ఓ కల అని, అది రేవంత్ రెడ్డి సారథ్యంలో జీఓ14 ద్వారా నెరవేరుతుందన్నారు.
MBNR, NGKL లోక్ సభ పరిధిలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. MBNR పరిధిలో పురుషులు 8,28,944 మంది ఉండగా మహిళలు 8,46,308 మంది ఉన్నారు. NGKL లోక్ సభ పరిధిలో పురుషులు 8,61,980 మంది ఉండగా మహిళా ఓటర్లు 8,69,803 మంది ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 25,187 మంది అధికంగా ఉన్నారు.
✔MBNR: నేడు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్
✔గ్రామాల్లో తాగునీటి పరీక్షలు
✔నేటి రంజాన్ వేళలు:ఇఫ్తార్(బుధ):6:38
✔కోస్గి:నేడు కరెంట్ కట్
✔నేడు సంయుక్త ఖాతాల కొరకు దరఖాస్తు చేసుకోండి:DEOలు
✔పరుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న స్థానిక MLAలు,ప్రజాప్రతినిధులు
✔SA-2 పరీక్షలపై అధికారుల ఫోకస్
✔దామరగిద్ద:నేడు సమీక్ష..11 నుంచి వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
✔కొనసాగుతున్న తనిఖీలు
ఉమ్మడి జిల్లాలో TET అర్హత పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. నేటితో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగియనుంది. ఉపాధ్యాయుల నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. గత ఏడాది వరకు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకుంటే రుసుము రూ.400 ఉండేది.. ప్రస్తుతం ఒక్కో పేపర్ కు దరఖాస్తు రుసుము రూ.1000కి పెంచారు.
NGKL: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్యర్యంలో ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తీసేందుకు HMలు దరఖాస్తు చేసుకోవాలని DEO డా.గోవిందరాజులు తెలిపారు. బ్యాంకు ఖాతాను తీసేందుకు MEOల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను బుధవారం వరకు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘం అధ్యక్షురాలు, HM పేరుతో సంయుక్త ఖాతా తీయాలన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి కర్ణాకటకు వెళ్తున్న తుఫాన్ వాహనం బిజినేపల్లిలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్నవారిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పలు బస్తీలలో పర్యటిచారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు పొట్టకూటి కోసం పట్టణానికి చేరుకుని సంవత్సరాల గడుస్తున్న కనీసం పక్కా ఇల్లు ప్రభుత్వాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సందర్భంలో పాలమూరు బిడ్డలకు ఇల్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేసారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే పోటీలో నుండి తప్పుకుంటానని అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15న నారాయణపేటలో నిర్వహించే జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని చెప్పారు.
♥ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు
♥ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
♥ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలో పాల్గొన్న స్థానిక MLAలు,కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు
♥నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
♥అచ్చంపేట యువతితో ప్రేమ.. పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్న యువకుడు
♥ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
♥ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థులు
Sorry, no posts matched your criteria.