Mahbubnagar

News March 31, 2024

బాలానగర్: చేప గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికుల వివరాలిలా.. బాలానగర్‌ మండలం మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్‌(45) మోతిఘణపూర్‌ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. పట్టిన వాటిలో ఒక చేపను తినగా అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. సహచరులు దాన్ని తీసేలోపే అతనికి ఊపిరాడక మృతి చెందాడు.

News March 31, 2024

MBNR: వంద రోజుల్లో మంచి పరిపాలన అందించాం: చిన్నారెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన అందించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వంద రోజుల పరిపాలన గురించి పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

News March 30, 2024

గద్వాల: శ్రీశైలానికి జొన్నల బస్తాతో నడుస్తున్న కర్ణాటక భక్తుడు..!

image

కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒వనపర్తి: BRSకు బిగ్ షాక్.. 8 మంది కౌన్సిలర్లు రాజీనామా
✒MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
✒‘సోషల్ మీడియాపై పోలీసుల నిఘా’
✒దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
✒ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కుపై అవగాహన
✒జాగ్రత్త సుమా.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒MBNR:ZP చైర్పర్సన్ పై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం
✒పలుచోట్ల తనిఖీలు

News March 30, 2024

MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు

image

మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండ్లు అందించి ఉపవాస దీక్షను విరమించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.

News March 30, 2024

పాలమూరు గడ్డ పై బిజెపి జెండా ఎగరవేద్దాం: డీకే అరుణ

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై BJP జెండా ఎగరవేద్దామని మాజీ మంత్రి DK అరుణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఊట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోడీని ప్రధానిగా కాకుండా ఆపే శక్తి దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిల పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు గద్వాల జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 42.4, మహబూబ్ నగర్ జిల్లా సల్కర్‌పేటలో 42.2, నారాయణపేట జిల్లా ధన్వాడలో 41.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

News March 30, 2024

కల్వకుర్తి: సీఎంని కలిసిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

image

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ఆయన మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం సూచించారు.

News March 30, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 200 ఓట్ల మెజార్టీ..?

image

ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ సాధ్యమేనా అనే చర్చ సాగుతుంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800కు పైగా ఓట్లు ఉంటే కాంగ్రెస్‌కు 400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.

News March 30, 2024

గద్వాల: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మల్లు రవి

image

లోక్ సభ ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి పేర్కొన్నారు. గద్వాల కేఎస్ ఫంక్షన్ హాల్లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు.