Mahbubnagar

News April 5, 2024

MBNR: ‘పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

image

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని
మహబూబ్ నగర్ కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్ నుంచి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News April 4, 2024

పాలమూరు TODAY టాప్ న్యూస్

image

✒అచ్చంపేట: ప్రభుత్వ ఆస్పత్రిలో 10 కిలోల కణితి తొలిగింపు
✒బిజినేపల్లి:బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
✒’తుక్కుగూడ సభను విజయవంతం చేయాలి’: కాంగ్రెస్ నేతలు
✒ట్రాక్టర్,ట్యాంకర్ ఢీ..NRPT వాసి మృతి
✒ఏప్రిల్ 6న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. సద్వినియోగం చేసుకోండి:NRPT కలెక్టర్
✒GDWL:తనిఖీల్లో..రూ.4,73,500 నగదు స్వాధీనం
✒తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
✒MBNR:మళ్లీ తెరపైకి వచ్చిన MLAల కొనుగోలు ఎపిసోడ్

News April 4, 2024

సీఎం నివాసంలో పాలమూరు నేతల సమావేశం

image

హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశము నిర్వహించారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గెలుపు తదితర విషయాలను చర్చించామన్నారు. రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. భారీ బహిరంగ సభకు సోనియాగాంధీని రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు.

News April 4, 2024

పెబ్బేరు యార్డులో ప్రమాదం.. ఆ కిటికీ ఎలా తెరుచుకుంది..?

image

పెబ్బేరు మార్కెట్‌ యార్డులో జరిగిన ప్రమాదంలో రూ.కోట్ల విలువైన గన్నీ బ్యాగులు తగలబడిన వ్యవహారంలో ఇంటి దొంగల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైన గోదాం రెండో కంపార్ట్‌మెంట్‌లోని ఒక కిటికీ ప్రమాదం జరిగిన సమయంలో ఎలా తెరుచుకుని ఉందనే విషయంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇనుప కిటికీలు బయట నుంచి తెరవడం అసాధ్యమని ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు అంటున్నారు.

News April 4, 2024

ట్రాక్టర్, ట్యాంకర్ ఢీ.. నారాయణపేట వాసి మృతి

image

NRPT: ట్రాక్టర్, సిమెంట్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలో జరిగింది. నారాయణపేట జిల్లాకి చెందిన డప్పు బాలప్ప ట్రాక్టరులో తాండూర్ వెళ్తుండగా యాలాల్ శివారులో సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలప్పను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

NRPT: ‘ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూల్లో పాల్గొనండి’

image

నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎకనామీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https://narayanpet.telagana.gov.in లో చూడాలన్నారు.

News April 4, 2024

MBNR: పచ్చటి అడవి మధ్యలో వెలసిన ఆలయం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.

News April 4, 2024

MBNR: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీలు చేపట్టాలి

image

తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఎన్నికల కమిషన్ అనుమతితో మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధారణ బదిలీలను చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News April 4, 2024

పాలమూరు.. బెంగళూరు కానుందా..?

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. రోజురోజుకూ నీటి ఎద్దడి తీవ్రం అవుతోంది. అయితే జలసంరక్షణ చర్యలు లేకపోవడంతోపాటు తాగునీటిని విచ్చలవిడిగా వాడటం, పచ్చదనాన్ని దెబ్బతీయడం, వాల్టా చట్టం అమలు చేయకపోవడం ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి పాలమూరు ప్రజలు చాలా నేర్చుకోవాలని.. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే బెంగళూరు మాదిరిగా నీటి కటకట రానుందని హెచ్చరించిస్తున్నారు.

News April 4, 2024

బిజినేపల్లి: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బిజినేపల్లి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. నాగనులు గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై పాలెం నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో మార్గ మధ్యలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.