India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ వేక్ (WAKE) యాప్లో రూ.1, 75,000 పోగొట్టుకున్నాడని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి పాలమూరులో భానుడి భగభగలు మరింత తీవ్రమవుతున్నాయి. జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా ఆరు బయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరినీళ్లు తీసుకోవాలని తెలిపారు.
నారాయణపేట జిల్లా గుండుమాల్ తహశీల్దార్ పాండు నాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ వద్ద నుంచి తహశీల్దార్ పాండు నాయక్ రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో మల్లేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ నాగర్ కర్నూల్ అసెంబ్లీ- 2,38,133
✓ అచ్చంపేట అసెంబ్లీ- 2,47,621
✓ కల్వకుర్తి అసెంబ్లీ- 2,42,962
✓ కొల్లాపూర్ అసెంబ్లీ – 2,38,459
✓ వనపర్తి అసెంబ్లీ – 2,72,653
✓ గద్వాల అసెంబ్లీ- 2,55,866
✓ అలంపూర్ అసెంబ్లీలో- 2,39,079 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారి కోసం మరోసారి అవకాశం కల్పించారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎక్స్- అఫీషియో హోదాలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు గురువారం రేవంత్ రెడ్డి కొడంగల్కు రానున్నారు. ఇప్పటికే అధికారులు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపు జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ZPTC, MPTC సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్అఫీషియో మెంబర్ల (14 మంది MLAలు, ఇద్దరు MPలు, ముగ్గురు MLCలు)తో కలిపి మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
✓వాట్సప్, ఫేస్బుక్లోని ప్రతి పోస్టింగ్కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులోని ప్రతి సభ్యుని పేరు, చిరునామా తెలిసి ఉండాలి.
✓ సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి.
✓నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలి.
✓అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే IT చట్టం IPC సెక్షన్ 153(ఎ) కింద కేసు నమోదు.
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల వివరాలిలా..
✓ మహబూబ్నగర్ అసెంబ్లీలో – 2,58,658
✓ జడ్చర్ల అసెంబ్లీ- 2,23,222
✓ దేవరకద్ర అసెంబ్లీ – 2,39,077
✓ నారాయణపేట అసెంబ్లీ – 2,35,517
✓ మక్తల్ అసెంబ్లీ – 2,43,338
✓ కొడంగల్ అసెంబ్లీ – 2,42,267
✓ షాద్ నగర్ అసెంబ్లీ – 2,38,338 మంది
ఉన్నారు. కాగా.. ఓటర్ల నమోదుకు మరోసారి అవకాశం కల్పించారు.
మహబూబ్ నగర్ స్థానికసంస్థల MLC ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. MLCఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్) నవీన్ కుమార్రెడ్డి(BRS)ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు.
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడి ఆరిపోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.
Sorry, no posts matched your criteria.