India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీపడుతూ గత ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా వ్యూహాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులకు ఎప్పటికీ అప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్పై వ్యతిరేకతతో ఓట్లు వేశారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జడ్చర్లలో బీజేపీ పార్లమెంటు నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మోడీని చూసి ఓట్లు వేస్తారని అన్నారు. మళ్లీ మూడోసారి మోదీ ప్రధాని అవుతారని అన్నారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
✒పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు
✒స్థానిక ప్రజాప్రతినిధులు తమ గుర్తింపు కార్డు వెంట తీసుకువచ్చి ఓటు వెయ్యాలి
✒సైలెన్స్ పీరియడ్ పకడ్బందీగా అమలు
✒అన్ని రకాల ఎన్నికల ప్రచారాలకు బ్రేక్
✒పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు
ఉమ్మడి MBNR స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డి ఇద్దరిలో గెలుపు ఎవరిది అనే చర్చ మొదలైంది. సంఖ్యా బలం ప్రకారం బీఆర్ఎస్ మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఆ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులలో కలవరం మొదలైంది. ఇరు పార్టీల చెందిన ఓటరు గోవా తదితర ప్రాంతాల్లో క్యాంపు ఏర్పాటు చేశారు.
SC స్టడీ సర్కిల్లో మూడు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు 28న తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి వి.పాండు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఉచిత శిక్షణకు ఇప్పటికే 56 మంది ఎంపిక కాగా.. ఇంకా 44 సీట్లు ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీకి రేపే స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనారోగ్యంతో తండ్రి మృతిచెందిన బాధను దిగమింగి ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్షకు హాజరైంది. చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన కడారి పావని తండ్రి తిరుపతయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. తండ్రిని కోల్పోయిన విద్యార్థిని పుట్టెడు దుఃఖంతో మంగళవారం మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు హాజరైంది. కుమార్తె పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ-ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రి సహకారంతో ఈనెల 28న చిన్నపిల్లలకు ఉచితంగా గుండె సంబంధ వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఈ మేరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డీఈఐసీ మేనేజర్ దేవిదాస్ తెలిపారు. 0-18ఏళ్ల వారి కోసం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆ మరకలు మహబూబ్నగర్ను అంటుకోగా.. హాట్ టాపిక్గా మారింది. తన ఫోన్తో పాటు జిల్లాలోని అప్పటి విపక్ష నాయకులు, బడా వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని.. ఇందులో ఓ మాజీ మంత్రితో పాటు పలువురు పోలీస్ అధికారుల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.
✒దేవరకద్ర: నేడు ఉల్లి వేలం
✒ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కలకలం
✒MLC ఎన్నికలు.. కొనసాగుతున్న సైలెంట్ పిరియడ్
✒ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై, త్రాగునీటి సమస్యలపై అధికారుల ఫోకస్
✒రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(బుధ)-6:35,సహార్(గురు)-4:51
✒’ELECTION EFFECT’..కొనసాగుతున్న తనిఖీలు
✒ఉమ్మడి జిల్లాలో శుభకార్యాలకు ఎలక్షన్ కోడ్ కష్టాలు
✒MBNR:ఓటు నమోదుపై 5KM రన్
✒MLC ఎన్నికలు.. పకడ్బందీగా ఏర్పాట్లు
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహణ బాధ్యతలను మహిళా కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘అమ్మ ఆదర్శ’ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయనుంది. శానిటేషన్ నుంచి విద్యార్థులకు అందించే ఉచిత దుస్తుల పంపిణీ, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణాలు, మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలను ఇలా సమస్తం మహిళా కమిటీల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.