Mahbubnagar

News March 27, 2024

పాలమూరుపై సీఎం రేవంత్ రెడ్డి SPECIAL ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని MBNR, NGKL ఎంపీ సీట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సొంత జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. MBNR అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, NGKL అభ్యర్థి మల్లురవిల గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని ఆయన వారికి సూచించారు.

News March 27, 2024

NRPT: ‘గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి’

image

గ్రూప్స్ పరీక్షల ఉచిత శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కన్యాకుమారి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. గ్రూప్స్ 1,2,3,4 అభ్యర్థులు ఈనెల 28 లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి
✔ఫారుక్ నగర్: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
✔MBNR:ఉమ్మడి జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు
✔నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు:MBNR ఎమ్మెల్యే
✔’వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’: ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
✔క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:SP
✔TET ఫీజు తగ్గించాలి:PYL
✔MBNR:DEOపై చర్యలు తీసుకోవాలని CS కు ఫిర్యాదు
✔ఉపాధి హామీ పనులపై ఫోకస్

News March 26, 2024

వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి

image

పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వందశాతం అకౌంట్లో నగదు జమ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఏనాడూ పంట నష్టపోయిన రైతులను BRS ఆదుకోలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో తాము రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.

News March 26, 2024

గోవా క్యాంపు నుంచి ప్రజా ప్రతినిధుల తిరుగుముఖం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.

News March 26, 2024

MBNR: హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్.!

image

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని.. హరీష్ రావు చర్చకు సిద్ధమా.? అని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఎప్పుడూ ఎవరొకరి ఫోన్ ట్యాప్ చేయాలని చూశారని ఆరోపించారు. పదేళ్లుగా ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

News March 26, 2024

MBNR: తీవ్ర ఎండలు.. అధికారుల సూచనలు

image

✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.

News March 26, 2024

MBNR: పాలమూరులో భానుడి భగభగలు.!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి పూర్తిస్థాయిలో మొదలవకముందే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావడానికి భయపడుతున్నారు.

News March 26, 2024

MBNR:గడువు పొడగింపు..దరఖాస్తుల ఆహ్వానం!

image

సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని ఎస్సీ గురుకుల విద్యాలయాల మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు.ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తామని, అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 26, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు..

image

MLC ఉప ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,439 మంది MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లు, MLAలు, MLCలు, MPలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు BRSకు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది BJP, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో BRS ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.