India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరులో స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ BRS, కాంగ్రెస్ పార్టీల MLAలు, మాజీ MLAలు జాగ్రత్త పడుతున్నారు. ఎన్నికకు వారం రోజుల సమయం ఉండడంతో అంతవరకు ఓటర్లు పార్టీలు మారకుండా ఉండేందుకు వీలుగా క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. ఇలా అయితే అభ్యర్థుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?
ప్రభుత్వానికి చెల్లించాల్సిన సిఎంఆర్ బియ్యాన్ని తక్షణమే అప్పజెప్పాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీతారామారావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఏప్రిల్ 30లోగా ప్రభుత్వానికి అప్పజెప్పాలని మిల్లర్లను ఆదేశించారు. లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తో కలిసి సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ని ఎకరాల్లో వరి పంట సాగు చేశారు, దిగుబడి ఎంత మేరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జనభర్జన పడ్డ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు అభ్యర్థి పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతుంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా, చివరకు ఎంపీ టికెట్టు మల్లు రవికి దక్కినట్లు ఆయన అనుచరులు సోషల్ మీడియాలో బుధవారం విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.
నరేంద్ర మోదీ వచ్చిన పాలమూరులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పార్లమెంటరీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్నగర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. డీకే అరుణ తరఫున ప్రచారానికి నరేంద్ర మోడీ వచ్చినా గెలుపు మాత్రం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆమె ఓటమి తప్పదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
✔కొత్తూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
✔MBNR:కాంగ్రెస్లో చేరిన జడ్పీ ఛైర్పర్సన్,పలు నేతలు
✔నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
✔MBNR:BJPలో చేరిన పలువురు నేతలు
✔GDWL:MRO ఆఫీసులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
✔కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి జూపల్లి
✔NGKL: చేపల వేట.. రెండు గ్రామాల మధ్య గొడవ
✔ఉమ్మడి జిల్లాలో ఉపాధిహామీ పథకంపై అధికారుల ఫోకస్
అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన పదర మండలం వంకేశ్వరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్కచేను స్వామి(26) మంగళవారం రాత్రి తమ సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్రాబాద్ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు.
>1996లో టీడీపీ తరఫున MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
>2004లో సమాజ్ వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2009, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2018లో గద్వాల ఎమ్మెల్యేగా ఓటమి
>2019లో బీజేపీలో చేరి MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
కీలక పదవులు:
>కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సంబంధాలు, సమాచార శాఖ, చిన్న తరహా, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు
>ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా..
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కిష్టయ్య, వెంకటేశ్గా గుర్తించారు.
నారాయణపేట జిల్లాకు చెందిన రవి కుమార్ 4/400 మీటర్ల రిలే పరుగులో గోల్డ్ మెడల్ సాధించాడు. చండీగఢ్లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొని అసమాన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన రవిని అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, మిత్రులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.