Mahbubnagar

News March 1, 2025

MBNR: హక్కుల కోసం కలిసి ముందు కెళ్దాం: మాజీ మంత్రి

image

గౌడ్స్ హక్కుల కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. HYD నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో గౌడ్ సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మహాసభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు. నీరా కేఫ్ పై ప్రభుత్వంలో కదలిక రావడం సంతోషమన్నారు. షరతులు లేకుండా నీరా కేఫ్‌ని టాడీ కార్పొరేషన్‌కి అందించాలన్నారు.

News March 1, 2025

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

image

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.

News March 1, 2025

MBNR జిల్లా కలెక్టర్‌కు సీఎస్ కీలక ఆదేశాలు జారీ.!

image

మార్చి 5 నుండి 25 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణపై విస్తృత ప్రచారం చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయికి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

News March 1, 2025

మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

News February 28, 2025

MBNR: ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు: కలెక్టర్

image

LRS కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31లోగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. LRS దరఖాస్తులపై చీఫ్ సెక్రటరీ‌తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. గడువులోగా పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీనిస్తుందని, ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని తమ ప్లాట్లను క్రమ బద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News February 28, 2025

దేవరకద్రలో రోడ్డు ప్రమాదం

image

దేవరకద్రలో బ్రిడ్జి వద్ద స్కూటీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న కౌకుంట్ల మండలం రాజోలి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 28, 2025

MBNR: చివరి అవకాశం.. నేటితో ముగియనున్న కులగణన సర్వే

image

మహబూబ్ నగర్ జిల్లాలో నేటితో కులగణన సర్వే ముగియనుంది. గతంలో ప్రభుత్వం సర్వే చేసిన కొందరు వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంకా సర్వేలో పాల్గొననివారు, వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో వివరాలు నమోదు అధికారులు సూచించారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇవ్వగా.. నేటితో సర్వే ముగుస్తోంది. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.

News February 28, 2025

MBNR : రంజాన్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 28, 2025

MBNR: 36 పరీక్ష కేంద్రాలు, 22,483 మంది విద్యార్థులు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం పరీక్షలపై సమీక్షించిన కలెక్టర్, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయంతో పాటు తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2025

ఇంటర్మీడియట్ పరీక్షలకు వేళాయె..!

image

★ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
★ మహబూబ్ నగర్ జిల్లాలో 22483 మంది ఇంటర్ విద్యార్థులు
★ ప్రథమ సంవత్సరం:10922
★ ద్వితీయ సంవత్సరం:11561 మంది
★ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
★ పరీక్షల సందర్భంగా 144 సెక్షన్ అమలు
★ సిట్టింగ్ స్వ్కాడ్‌లు,ఫైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు
★ ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు
★ పరీక్ష సమయం: ఉ.9 నుంచి మ.12 వరకు
★ పరీక్షకు ఒక రోజు ముందే అన్ని సిద్ధం చేసుకోండి.

error: Content is protected !!