India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో షీ టీమ్స్ పనిచేసే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, మహిళల అక్రమ రవాణ, పోక్సో చట్టం, అనేక సమస్యల పరిష్కారంకు షీ టీం బృందం సహాయం చేస్తుందన్నారు. అత్యవసర సమయంలో 1930, 100 కు డయల్ చేయాలన్నారు.
ఇండస్ట్రీలు, కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని MBNR ఎంపీ డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది, నష్టం జరగకుండా ప్రభుత్వం ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేయాలన్నారు. రైతులు, కూలీల వలసల నివారణకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సరైన పరిష్కారమని ఎంపీ పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక విప్లవానికి ఆద్యుడు, టెలికాం రంగంలో సరికొత్త సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన మహా ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు ఆయన విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం సూచించారు. నేడు గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడగా.. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మీ మండలంలో వర్షం పడిందా? కామెంట్ చేయండి?.
✒JLMలకు ప్రమోషన్లు..CM,Deputy CM
చిత్రపటాలకు పాలాభిషేకం
✒ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా కల్పించాలి:RSP
✒బస్సులో డెలివరీ.. కండక్టర్ను సన్మానించిన సజ్జనార్
✒భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లు
✒CM ఇలాకాలో పాట రూపంలో రైతు ఆవేదన
✒ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
✒22న ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు
✒F-1 మార్కుల నమోదుకు చర్యలు:DEOలు
✒కోల్కతా ఘటన.. పలుచోట్ల నిరసన
గద్వాల్ జిల్లాలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కొరకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు బిసి స్టడీ సర్కిల్ కె రాములు తెలిపారు. స్వయం ఉపాధి శిక్షణ కొరకు బీసీ నిరుద్యోగ యువతి, యువకులు ఆన్లైన్ www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ లో ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు HYDలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజియన్ RTC చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించింది. రాఖీ పండుగ రోజున మొత్తంగా 3.71 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరగగా, 2.88 కోట్ల రాబడిని ఆర్టీసీ రాబట్టిందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి వెల్లడించారు. మొత్తంగా 5.88 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారన్నారు. డిపోలోనే రాఖీ పండగ కార్యక్రమం విజయవంతమైందన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పేరుతో గతేడాది జూలై 2, 3, 4, 8, 9తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. కానీ ఈరోజు వరకు పరీక్షలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించలేదు. ఈ పరీక్షలో మొదటి బహుమతిగా ల్యాప్టాప్, రెండో బహుమతిగా స్మార్ట్ ఫోన్, మూడో బహుమతిగా టాబ్లెట్, ప్రతి నియోజకవర్గంలో మహిళ టాపర్కు స్కూటీ ప్రకటించారు.
7వ శతాబ్దాలనాటి అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలపై ఆర్కియాలజికల్ కేంద్ర అధ్యయన బృందం మంగళవారం అలంపూర్ సందర్శించింది. ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ మహాలక్ష్మీ బృందం నవబ్రహ్మ ఆలయాలను సందర్శించి ఇక్కడి అర్కిటెక్చర్, శాసనాలు సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో అలంపూర్ ఆలయాలు సంతృప్తినిచ్చాయన్నారు. ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు.
బస్సులో ప్రయాణం చేస్తుండగా గర్భిణి సంధ్యకు కండక్టర్, నర్సు ప్రసవం చేశారు. దీంతో మంత్రి పొన్నం, RTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అభినందించారు. ఈ సందర్భంగా కండక్టర్ భారతి మాట్లాడుతూ.. జీవితంలో ఈ ఘటన గుర్తుండిపోతుందని, స్టాఫ్ నర్సు అలివేలు మాట్లాడుతూ.. కాన్పు చేసేందుకు గ్లాసులు లేకపోయినా వెనకాడ లేదని, పాప తల, మెడకు పేగు చుట్టుకొని ఉంది. జాగ్రత్తగా తీసి సుఖ ప్రసవం చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.