Mahbubnagar

News August 20, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ఐజలో 133.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 131.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 13.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో ఏటి 9.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్లో 67.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 20, 2024

నందిగామ: రైలు పట్టాలపై యువకుడు సూసైడ్

image

రైలు పట్టాలపై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన ఖాజా(23) నందిగామ సమీపంలోని రైలు పట్టాపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మృతుడి తల కొద్ది దూరంలో ఎగిరి పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 20, 2024

UPDATE: జూరాలకు పెరిగిన వరద!

image

జూరాల జలాశయంలోకి వరద పెరుగుతోంది. 48,500 క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు జలవిద్యుదుత్పత్తి ద్వారా 39,907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 5.343 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 19వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 20వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.

News August 20, 2024

UPDATE: జూరాలకు పెరిగిన వరద!

image

జూరాల జలాశయంలోకి వరద పెరుగుతోంది. 48,500 క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు జలవిద్యుదుత్పత్తి ద్వారా 39,907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జలాశయంలో నీటినిల్వ 5.343 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 19వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలోకి 20వేల క్యూసెక్కుల వరద చేరుతోంది.

News August 20, 2024

గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం.. పిగుగుపాటుకు మగ్గురు మృతి

image

గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి ముగ్గురు మృతి చెందారు. అలంపూర్ మండలం క్యాతూర్‌కు చెందిన <<13895032>>రాజు<<>>(40), గట్టు మండలం ఆరగిద్దకు చెందిన <<13894474>>నల్లారెడ్డి <<>>, కూలీ పనిచేసేందుకు కర్నూలు జిల్లా కనకవీడు‌ నుంచి మల్దకల్ మండలానికి వచ్చిన ఆదిలక్ష్మి (15) పిడుగుపాటుకు గురై మృతి చెందారు.

News August 20, 2024

22న ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు

image

రాష్ట్రస్థాయి యోగా టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారులు, క్రీడాకారిణుల ఎంపికలు ఈనెల 22న ఉదయం 9గం. స్టేడియంలో చేపడుతున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామూలు, ఆర్.బాలరాజు తెలిపారు. ఆధార్, ఇతర ధ్రువపత్రాలు తీసుకొని రావాలని, 8-10, 10-12, 12-14, 14-16, 16-18, 18-21, 21-25, 25-30, 30-35, 35-45 సంవత్సరాలలో విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని, వివరాలకు 90525 54298 నంబరులో సంప్రదించాలని కోరారు.

News August 20, 2024

పక్కాగా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్లు

image

ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా బీఎల్ఎలు నిర్వహించనున్న ఇంటింటి పరిశీలన ఆన్లైన్‌లో అప్డేట్ పకడ్బందీగా చేపట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1,2025 క్వాలిఫైయింగ్ ఆధారంగా చేపట్టనున్న ప్రత్యేక సవరణను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసేందుకు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

News August 20, 2024

MBNR: కండక్టర్‌ జి.భారతిని అభినందించిన మంత్రి పొన్నం

image

డెలివరీ చేసిన కండక్టర్ జి.భారతిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. RTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్‌ జి.భారతికి తన అభినందనలు అంటూ కొనియాడారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

News August 19, 2024

PU సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్-1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ల బ్యాక్లాగ్, రీవాల్యుయేషన్ ఫలితాలను సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. త్వరలోనే వారి లాంగ్ మెమోలను కళాశాలలకు పంపిణీ చేస్తామన్నారు. సంబంధిత యూనివర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను చేసుకోవాలని పీయూ అధికారులు విద్యార్థులకు సూచించారు.

News August 19, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.