India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న గిరిజన మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలతో అందర్ని ఆకట్టుకున్నారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో అందరిని అలరించిన గిరిజన మహిళలు తమ నృత్య ప్రత్యేకతను చాటుకొని అధికారుల మన్ననలను పొందారు.
మహిళలు స్వయం ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు తయారుచేసిన వస్తువుల్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇలాంటి పనుల్లో ప్రతి ఒక్కరు రాణించేందుకు కృషి చేయాలన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పనిచేసే చోట వివక్షకు తావులేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. మహిళలకు సమానత్వం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన మహిళలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఘనంగా సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళల్ని సన్మానించి అభినందించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని విజ్ఞప్తి చేశారు.
రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNRజిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేస్తారు. మీరు తింటే ఎలాఉందో కామెంట్ పెట్టండి?
దేవరకద్ర మండలంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ కూల్ డ్రింక్స్ నిర్వాహకుడు కొన్ని నిమ్మకాయలను కొనుగోలు చేశారు. అందులో ఓ అరుదైన నిమ్మకాయ కనిపించింది. ఏకంగా పెద్ద సంత్రపండు సైజులో ఉంది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది పెద్ద సంత్ర పండు సైజులో ఉన్న నిమ్మకాయను చూడటానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఓ నిమ్మకాయ ఇంత పెద్ద సైజులో ఉండేలా చూడటం ఇదే మొదటి సారి అని నిర్వాహకుడు తెలిపారు.
బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించడంతో మున్సిపల్ కార్యాలయానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చేస్తున్న విస్తృతప్రచారానికి తగ్గట్టుగానే దరఖాస్తుదారులు ముందుకు వస్తున్నారు. గురువారం ఒక్కరోజు 200కు పైగా దరఖాస్తుదారులు పరిష్కరించుకొనేందుకు ముందుకొచ్చారు. ఇప్పటివరకు 2వేలమందికి పైగా ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకొని ప్రభుత్వం కల్పించిన 25% శాతం రాయితీని పొందాల్సిందిగా స్పెషల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ లో చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పరిశీలించారు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించి తమ దరఖాస్తులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.
Sorry, no posts matched your criteria.