Mahbubnagar

News August 19, 2024

MBNR: NCC కవాతు గుర్రాలు చోరీ

image

మహబూబ్‌నగర్‌లోని స్థానిక జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో NCC కవాతు కోసం ఉపయోగించే రెండు గుర్రాలను ఆదివారం అర్ధరాత్రి చోరీ గురయ్యాయి. కళాశాలలో మొత్తం నాలుగు గుర్రాలు ఉండగా రెండు గుర్రాలు దుండగులు అపహరించారు. కళాశాల సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా గుర్తుతెలియని ఇద్దరు దండగులు చోరీ చేసినట్లు గుర్తించారు.

News August 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లూరులో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా పద్రలో 21.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 8.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా ధరూర్‌లో 5.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 19, 2024

MBNR: రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ

image

రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రజలకి ఎంపీ డీకే అరుణ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. అన్నా చెల్లెలు అనుబంధానికి, అప్యాయ‌త అనురాగాల‌కు ప్ర‌తిక ఈ రాఖీ పండుగ అని గుర్తు చేశారు. ఈ పండుగ మీ అంద‌రి కుటుంబాల్లో మ‌రిన్ని సంతోషాలు నింపాల‌ని ఆకాంక్షించారు. అక్కా చెల్లెలు, అన్నాద‌మ్ముళ్లు ఆనందోత్సాహాల న‌డుమ ఈ వేడుక జ‌రుపుకోవాలి అన్నారు.

News August 19, 2024

జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

image

MBNR ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా చేసుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ అన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు సాక్షిభూతమై అవనిపై అజేయంగా వర్ధిల్లుతున్న సంబురం ఇంతటి ప్రత్యేకమైన పండుగను నేడు పౌర్ణమి నాడు జరుపుకోనున్నట్లు తెలిపారు.

News August 19, 2024

MBNR: బస్సులో పురుడు పోసిన కండక్టర్..

image

బస్సు కండక్టర్ నిండు గర్భిణీకి పురుడు పోసిన ఘటన గద్వాల్ మండలం కొండపల్లిలో సోమవారం జరిగింది. గద్వాల్ నుంచి వనపర్తికి పల్లె వెలుగు బస్సులో సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సులో గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును ఆపి, బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. ఈ విషయంపై సజ్జనర్ Xలో ట్వీట్ చేశారు.

News August 19, 2024

MBNR: పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు

image

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పీపీపీ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంపద సృష్టించడం ద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నామని అన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని అన్నారు.

News August 19, 2024

“పాలమూరుకు ఎంఎంటీఎస్ రైళ్లు”

image

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రానుంది. నిజాం కాలంలో 140 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం త్వరలోనే కనుమరుగు కానుంది. ఇప్పటికే డబుల్ లైన్ పనులు, విద్యుదీకరణ పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ప్యాసింజరు, MMTS రైళ్లను ఈ మార్గంలో నడిపించేందుకు HYD రైల్వే డివిజన్ అధికారులు నిర్ణయించారు. రూ.17 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

News August 19, 2024

MBNR: 23న డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక.. షెడ్యూల్ ఇలా!

image

MBNR జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23న బ్యాంకు ఆవరణలో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్నికల అధికారి టైటాస్ పాల్ తెలిపారు. ఈ నెల 23న ఉ.9 నుంచి 11 గంటల వరకు నామినేషన్లు, ఉ.11.30గం. పరిశీలన, 12 నుంచి 2గం. వరకు ఉపసంహరణ, 2.30 గంటలకు అభ్యర్థుల తుది జాబితా, 3 నుంచి సా.5 గం. వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సా.5.30 గంటలకు ఓట్ల లెక్కింపు.

News August 19, 2024

MBNR: దుకాణాల్లో మొదలైన రాఖీ సందడి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో రాఖి అమ్మకాలు జరుగుతుండడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వ్యాపారాలు భారీగా పెరిగాయి. సుమారు 43 లక్షల జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారు. అందులో 15 లక్షల మంది క్రమం తప్పకుండా రాఖీలు కడతారని అంచనా. ఈ ఏడాది రాఖీలు, మిఠాయిల కొనుగోళ్లు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.16 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

News August 19, 2024

మక్తల్: విహారయాత్రలో విషాదం యువకుడు మృతి

image

తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మక్తల్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. అమృత్ గౌడ్ (25) తన మిత్రులతో కలిసి కారులో తమిళనాడులోని వివిధ పర్యటక ప్రాంతాలను సందర్శించేందుకు విహారయాత్రకు వెళ్లారు. కారు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో అమృత్ గౌడ్ అక్కడే మృతి చెందగా తనతో పాటు ఉన్న మరో నలుగురికి గాయాలు అయినట్లు తెలిపారు.