India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటన తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎంపీటీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతోపాటు మూఢా ఛైర్మన్ లక్ష్మణ యాదవులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులంలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.
మహబూబ్నగర్ జిల్లా బండమీదిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమూరు యూనివర్సిటీ ఎదురుగా సైకిల్పై వస్తూ నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన లారీ( ట్రక్కు) కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ నుంచి అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి <<15574517>>వ్యక్తిని <<>>హత్య చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో పోలీసులు బుధవారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 24వ తేదీన క్రేన్ మరమ్మతు కోసం పుణేకు చెందిన వినయ్ రాగా అతను బస చేస్తున్న గది వద్ద బిహార్కు చెందిన రషీద్తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతన్ని గోడకేసి బాది చంపేశాడు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు
LHPS వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్కు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని LHPS రాష్ట్ర కమిటీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా LHPS రాష్ట్ర నాయకులు విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి గిరిజనుల సమస్యలపై బెల్లయ్య ఎన్నో పోరాటాలు చేశారన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉండే హ్యాండ్ పంపులను అవసరమైతే మరమ్మతులు చేయించాలన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు, డామేజీలు ఉంటే వెంటనే సరి చేయాలన్నారు.
MBNR:ZP మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రథమంగా పాలమూరు ఎంపీ డికె.అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.PMFME, విశ్వకర్మ పథకం, NREGS కింద గొర్రెలు, కోళ్ల పెంపకం, డైరీ ఫామ్స్(ఫిషరీస్) మత్స్య శాఖలో ప్రోత్సాహకాలు, టెక్స్టైల్స్, ట్రైబల్ వెల్ఫేర్, PMFME పథకాల అమలు తీరు వాటి మార్గదర్శకాలను సంబంధిత అధికారులు వివరించారు. ఎమ్మేల్యే యెన్నం, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
MBNR జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ సురేంద్ర మెహన్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి, ఎస్పీ జానకిలతో కలసి కలేక్టరేట్లోని సమావేశమయ్యారు. పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య, అర్అండ్బి శాఖలతో ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.