India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఒకేరోజు ఏడుగురు విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఉదయం పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై ఒక్కసారిగా పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి దాడి చేయడంతో దాదాపు 7గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈవిషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తల్లిదండ్రులంటున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 1,916 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. కౌంటింగ్ కు పాలమూరు యూనివర్సిటీలో ఏడు హాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన HNKజిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఈనెల 10న HYDవచ్చి MGBS బస్టాండ్లో వేచి చూస్తోంది. కాగా ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వరంగల్ జిల్లా వంగపహాడ్కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.

✔నేడు పలు రైతు వేదికల్లో దృశ్య శ్రవణ ప్రసారం
✔పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పర్యటన
✔WNPT:ఎన్నికల కోడ్..246 నియామకాలకు బ్రేక్
✔ELECTION-EFFECT..ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ఫోకస్
✔ఉమ్మడి జిల్లాలో ఓటు శాతం పెంచేందుకు అధికారుల నజర్
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్
✔ఉపాధి హామీ పనులపై సమీక్ష
✔ రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(మంగళ)-6:34,సహార్(బుధ)-5:01
✔NGKL:నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత

WNPT: పదో తరగతి తొలి పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడిన ఇద్దరు విద్యార్థినులు డీబార్ కావడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. శ్రీరంగాపురం ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జేడీ వెంకటనర్సమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను తనిఖీచేసే క్రమంలో ఇద్దరి వద్ద చిట్టీలు ఉండటంతో డీబార్ చేయాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. మాస్ కాపీయింగ్ పై చీఫ్ సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన హన్మంతు ఆదివారం రాత్రి మృతి చెందారు. తండ్రి మృతిని తట్టుకోలేక మృతదేహంపై పడి పెద్ద కుమారుడు అజయ్ రాత్రంతా రోదించాడు. ఉదయం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. బంధువులు ధైర్యం చెప్పి పదవ తరగతి పరీక్షకు పంపారు. పుట్టెడు దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకొని పరీక్ష రాశాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.

మహబూబ్ నగర్: సార్వత్రిక విద్య (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు వచ్చే నెల 25 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ తెలిపారు. ప్రతి రోజు రెండు పూటలు పరీక్షలు ఉంటాయని ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 నుంచి 10 వరకు ఉంటాయని పేర్కొన్నారు.

*ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేళ.. పటిష్ట పోలీస్ బందోబస్తు
*DSCకి ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
*మాజీమంత్రి శ్రీనివాస్ బీజేపీలో చేరుతున్నారనేది అసత్యం:DK అరుణ
*ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ప్రశాంతంగా పది పరీక్ష
*కొనసాగుతున్న కుష్టువ్యాధి సర్వే
*NGKL:CM,MLA,MLC చిత్రపటానికి పాలాభిషేకం
*GDWL:పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
*WNPT:రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Sorry, no posts matched your criteria.