Mahbubnagar

News August 18, 2024

MBNR: అందుబాటులో ఓపెన్ పీజీ 2వ సంవత్సర హాల్ టికెట్స్ 

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గల డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని విశ్వవిద్యాలయం సమన్వయకర్త డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు https://www.braouonline.in/PGHallTickets/Halltic వెబ్‌సైట్లో ఉంచామని తెలిపారు.

News August 18, 2024

మూసాపేట్: చికెన్ తీసుకురాలేదని వైన్స్‌లో గొడవ

image

ఆర్డర్ చేసిన చికెన్ తీసుకురాలేదని కస్టమర్లకు, యజమానికి మధ్య గొడవ జరిగిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన నలుగురు యువకులు మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో చికెన్ ఆర్డర్ చేశారు. డ్రింక్ పూర్తయ్యే వరకు చికెన్ రాకపోవడంతో సీసా పగలగొట్టి గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలిపారు.

News August 18, 2024

MBNR: చేనేత ఎన్నికలు.. ఓటరు జాబితాపై ఫోకస్

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని చేనేత అధికారులు సహకార సంఘాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీని ప్రకారం ఓటరు జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో త్వరలోనే చేనేత, సిల్క్, పవర్ లూమ్, ఉన్ని, టైలరింగ్ సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని రకాల సహకార సంఘాలు కలిపి మొత్తం 64 ఉన్నాయి. వీటిలో సుమారు 8 వేల మందికి పైగా కార్మికులు సభ్యత్వం కలిగి ఉన్నారు.

News August 18, 2024

మహబూబ్‌నగర్: మూడేళ్లలో 171 రోడ్డు ప్రమాదాలు

image

పాలమూరులోని పలు జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-శ్రీశైలం, జడ్చర్ల-కోదాడ రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో 171 ప్రమాదాలు జరగగా.. 92 మంది చనిపోయారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం నేటికీ హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.

News August 18, 2024

MBNR: కాంట్రాక్ట్ వైద్యుల దరఖాస్తుల ఆహ్వానం

image

తిరుమల హిల్స్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ఆసక్తి కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నట్లు డైరెక్టర్ డా.రమేశ్ తెలిపారు. ఆచార్యులు, అసోసియేట్, సహాయ ఆచార్యులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీన కళాశాలలో నిర్వహించే మౌఖిక పరీక్షకు హాజరు కావాలని కోరారు.

News August 18, 2024

NRPT: ‘పోడు భూముల పంపిణీపై సమగ్ర వివరాలు అందించాలి’

image

జిల్లాలో పోడు భూముల పంపిణీపై సమగ్ర వివరాలు అందించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి, పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు.

News August 17, 2024

కోస్గి: జాబ్ మేళాలో 491 మందికి ఉద్యోగాలు

image

కోస్గి పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మేళాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 1800 మంది నిరుద్యోగులు హాజరు కాగా వారిలో వివిధ కంపెనీలు, సంస్థల్లో 491 మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. మరికొంత మందికి రెండవ విడత ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని అన్నారు. ఎంపికైన వారికి ఎస్పీ ఎంపిక పత్రాలను అందజేశారు.

News August 17, 2024

పాలమూరు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కేనా..?

image

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. NGKL ఎంపీ స్థానం నుండి జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో చోటు దాక్కగా.. MBNR ఎంపీ పరిధిలో మరో బెర్తు ఖరారు కావాల్సి ఉంది. విఫ్ కోసం MLA యెన్నం శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కోసం MLA వంశీకృష్ణ, బీసీ కోటలో మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి ఎవరికి దక్కేనో మరి.

News August 17, 2024

గద్వాల: యాక్సిడెంట్‌లో మహిళ మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

image

గద్వాల జిల్లాలోని ధర్మారం స్టేజీ వద్ద హైవే-44పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ స్పాట్‌డెడ్ కాగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. HYDలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు బైక్‌పై కర్నూల్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిఖితారెడ్డి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెతోపాటు ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.

News August 17, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

గడచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా జడ్చర్లలో 58.0మి.మీ వర్షపాతం నమోదైంది. హన్వాడ 33.5, రాజాపూర్ 17.5, కౌకుంట్ల 15.3, మూసాపేట 14.0 కోయిలకొండ 10.2, నవాబుపేట 9.7, దేవరకద్ర 8.5, మిడ్జిల్ 4.7, మహబూబ్నగర్ రూరల్ 3.3 అడ్డాకుల 3.3, బాలనగర్ 2.7, మహబూబ్ నగర్ అర్బన్ 0.8, మహమ్మదాబాద్ 0.5మి.మీ వర్షపాతం కురిసింది.