Mahbubnagar

News August 17, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

గడచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా జడ్చర్లలో 58.0మి.మీ వర్షపాతం నమోదైంది. హన్వాడ 33.5, రాజాపూర్ 17.5, కౌకుంట్ల 15.3, మూసాపేట 14.0 కోయిలకొండ 10.2, నవాబుపేట 9.7, దేవరకద్ర 8.5, మిడ్జిల్ 4.7, మహబూబ్నగర్ రూరల్ 3.3 అడ్డాకుల 3.3, బాలనగర్ 2.7, మహబూబ్ నగర్ అర్బన్ 0.8, మహమ్మదాబాద్ 0.5మి.మీ వర్షపాతం కురిసింది.

News August 17, 2024

వ్యవసాయ రుణాలు మాత్రం 10 శాతం దాటలేదు: జూపల్లి

image

వనపర్తి జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీ ద్వారా జిల్లాలో దాదాపు రూ.400 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని, వ్యవసాయ రుణాలు మాత్రం 10 శాతం దాటలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సం రూ.3,454.92 కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోగా జూన్‌, 2024 వరకు కేవలం రూ.324.92 కోట్లు ఇచ్చిందని అన్నారు.

News August 17, 2024

నేడు పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు.. అంతా సిద్ధం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) శనివారం నిర్వహించేందుకు ప్రధాన ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల ముందే విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. MBNR-791, NGKL-808, GDWL-448, WNPT-495, NRPT-456 మంది ఏఏపీసీలు ఉన్నారు. తల్లిదండ్రుల ప్రశ్నలు, ఉపాధ్యాయుల సమాధానాలు, ఆలోచనలను పంచుకుంటారు.

News August 17, 2024

MBNR: హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ

image

జిల్లా నుంచి 2025లో పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్న ఔత్సాహికులు ఆన్లైన్‌లో హజ్ కమిటీ కార్యాలయం నుంచి దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించామని హజ్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరాజుద్దీన్ తెలిపారు. 2024 సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, పాస్ పోర్టు కాపీ జిరాక్సు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఓటరు గుర్తింపు కార్డు, తదితర పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 17, 2024

MBNR: అర్హులందరికీ రూ.2లక్షల రుణమాఫీ: కలెక్టర్

image

అర్హులైన రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని MBNR జిల్లా కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం ఆమె నవాబుపేట తహసీల్దార్ ఆఫీసులో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో కొల్లూర్‌కు చెందిన పద్మమ్మ తనకు రుణం మాఫీ కాలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆమె పాస్ పుస్తకాన్ని పరిశీలించి.. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అర్హులందరికీ రుణమాఫీ అవుతుందని.. అందోళన చెందొద్దన్నారు.

News August 17, 2024

NRPT: ‘గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం’

image

గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాలలో దూసుకుపోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

News August 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔D-8 కాలువలను పరిశీలించిన మంత్రి జూపల్లి ✔MBNR:లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి ✔నాగర్ కర్నూల్‌లో వైద్య విద్యార్థుల నిరసన ✔రేపు ఉమ్మడి జిల్లాలో వర్షాలు ✔ఇంటింటా ఇన్నోవేషన్‌.. 19 ప్రాజెక్టులు ఎంపిక ✔షాద్‌నగర్ ఘటనపై NHRCలో ఫిర్యాదు ✔రేపు కోస్గిలో జాబ్ మేళా ✔రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. తీవ్ర గాయాలు ✔MBNR:20 నుంచి 29వ తేదీ వరకు సదరం క్యాంపులు

News August 16, 2024

తనిఖీలలో పట్టుబడ్డ గుర్తింపు లేని వాహనాలకు వేలం

image

పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత తనిఖీలలో పట్టుబడ్డ గుర్తింపు లేని వాహనాలకు వేలం నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మొత్తం 76 వాహనాలు జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉంచినట్టు పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఆర్ఎస్ఐ నగేష్ 871265 9329 నంబర్ పై సంప్రదించాలన్నారు. ఎవరు సంప్రదించని క్రమంలో ప్రచురణ జరిగిన 14 రోజులలో వేలం వేస్తామన్నారు.

News August 16, 2024

MBNR: రేపు ఉమ్మడి జిల్లాకు భారీ వర్షసూచన

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT

News August 16, 2024

MBNR: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి

image

మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వేపూరు గ్రామానికి చెందిన యాదయ్య వంట మాస్టర్. గత కొకొన్ని రోజులుగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఉంటూ జీవనం సాగించేవాడు. యాదయ్య రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య కొడుకు కూతురు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.