India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఊట్కూరు మండలంలో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాలు.. ఈనెల 8 భర్త బయటకు వెళ్లగా మధ్యాహ్నం ఆదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. విషయం బయట చెప్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. ఆమె మనోవేదనతో అనారోగ్యానికి గురికావడంతో భర్త ఆర తీయడంతో విషయం చెప్పింది. ఘటనపై ఫిర్యాదు వచ్చినట్లు హెడ్కానిస్టేబుల్ సురేందర్ తెలిపారు.
@ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
@కోస్గీ: ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపాల్.
@MBNR: డిసెంబర్ 9 నుండి రాష్ట్రంలో అసలైన స్వేచ్ఛ: మంత్రి జూపల్లి.
@NRPT: జల సిరుల తెలంగాణగా మార్చడమే లక్ష్యం: గుర్నాథ్ రెడ్డి.
@GDL:రాష్ట్ర సర్వతో అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ప్రీతం.
@WNP: అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం: మాజీ మంత్రి
ORRపై జరిగిన ఘోర <<13863174>>రోడ్డు ప్రమాదం<<>>లో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా వనపర్తి జిల్లా వాసులే. ఆత్మకూరుకు చెందిన రాజేశ్ కుటుంబంతో కలిసి తుపాన్ వాహనంలో యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో తుపాన్లో ఉన్నఓ బాలుడు, రాజేశ్, డ్రైవర్ తాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో 10 మందిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో CSE, CSD, CSM గ్రూపుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ తీసుకోనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 16 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 28న అడ్మిషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
జడ్చర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ విద్యార్థినికి షూ వేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో విద్యార్థులకు బూట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినికి ఆయన స్వయంగా బూట్లు తొడిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే నిరాడంబరతకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూజలు చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలు కొనసాగించాలని అన్నారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పలువురుBJP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కూచూర్ గ్రామం ఆర్మీ జవాన్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. గ్రామంలో 3,248 మంది జనాభా ఉండగా 78 మంది ఆర్మీలో ఉన్నారు. మరో 9 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లో పనిచేస్తుండగా 10 మంది పోలీస్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరప్ప కుమారుడు రవి 1993లో ఆర్మీలో చేరగా ఆయన స్ఫూర్తితో దేశ సంరక్షణకు మేమంటే మేము అంటూ యువత పోటీ పడుతున్నారు.
పాలమూరులో లోకాయపల్లి సంస్థానాధీశులు పట్టణ నలువైపులా 4 ప్రవేశ ద్వారాలను నిర్మించారు. 3 కమాన్లు కాలగర్భంలో కలిసిపోగా తూర్పు కమాన్ మాత్రం మిగిలింది. స్వాతంత్రోద్యమానికి తూర్పుకమాన్ కు వీడదీయలేని సంబంధం ఉంది. 1947 ఆగస్టు 15న ఎక్కడా త్రివర్ణపతాకాలు ఎగరేయవద్దని హుకూం జారీ చేశారు. నిజాం పోలీసులు గస్తీ తిరిగినా వారి కన్నుగప్పి ఉద్యమకారుడు విరివింటి లక్షణమూర్తి తూర్పు కమాన్ పై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
రాష్ట్రపతి పతకానికి ఇటిక్యాల ASI వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. కడప జిల్లా బద్వేల్ మండలం పోరుమామిళ్లకు చెందిన వెంకటేశ్వర్లు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి 1989లో పోలీసు ఉద్యోగం సంపాదించారు. మొదట KNRలో విధుల్లో చేరారు. 8 నెలల అనంతరం అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలికి బదిలీపై వచ్చారు. అనంతరం హెడ్కానిస్టేబుల్గా బిజినేపల్లకి అక్కడి నుంచి మిడ్జిల్ అనంతరం ASIగా ఉన్నతి పొంది 2020లో ఇటిక్యాలకు బదిలీపై వచ్చారు.
రాఖీ పండగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కార్గోలో రాఖీలు, మిఠాయిలు, బహుమతులు పంపవచ్చని ఏటీఎం లాజిస్టిక్స్ ఇసాక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సేవలు అందుబాటులో ఉంటాయని, పూర్తి వివరాల కొరకు 91542 98609, 91542 98610 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.