Mahbubnagar

News August 14, 2024

బాలుడి హత్యకు అక్రమ సంబంధమే కారణం!

image

గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాలకు చెందిన బాలుడు <<13853898>>రఫీ హత్యలో<<>> విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలుడి సమీప బంధువైన మౌలాలి బాలుడి తల్లి సమీరాతో అక్రమ సంబంధం కొనసాగించాడు. ఇటీవల సమీరా మరొకరితో చనువుగా ఉంటుందని ఆగ్రహించి, మౌలాలి ఈనెల 13న ఆమె కుమారుడిని అపహరించి ముళ్ల పొదల్లో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

News August 14, 2024

ఇటిక్యాల: మిస్సైన బాలుడు దారుణ హత్య

image

గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగా <<13849590>>నజీర్ కుమారుడు<<>> రఫీ ఈనెల 13న కనిపించకుండా పోయాడు. ఈ విషయమై తండ్రి ఇటిక్యాల పీఎస్ ‌లో కంప్లైంట్ చేశాడు. అయితే బుధవారం సాయంత్రం బాలుడు గ్రామ శివారులో పంట పొలాల మధ్య ఉన్న ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. అటుగా వెళ్లిన రైతులు గ్రహించి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో ఘటనస్థలికి డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రవిబాబు, ఎస్సై వెంకటేశ్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News August 14, 2024

సీఎంకు స్వాగతం పలికిన ఎంపీ మల్లురవి

image

విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పూల బొకే, శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అమెరికా, కొరియాల విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్‌లో సీఎంను కలిశారు. విదేశీ పర్యటన ద్వారా పలు కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారని, తద్వారా తెలంగాణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

News August 14, 2024

పాలమూరులో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సంస్థానాధీశులు నిర్మించిన కోటలు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, ప్రాజెక్టులు, నల్లమల అటవీ సంపదకు ఈ ప్రాంతం నెలవు కావడంతో 2 సర్క్యూట్‌లుగా విభజించి డెవలప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. NGKL, WNP జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను ‘నల్లమల టూరిజం హబ్’గా, NRPT, MBNR, GDL ప్రాంతాలను కలిపి ‘ఏకో టూరిజం హబ్’గా అభివృద్ధి చేయనుంది.

News August 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో 52.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 13.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరు లో 7.5 మిల్లీమీటర్ల, గద్వాల జిల్లా సాటేర్లలో 3.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 14, 2024

కొడంగల్‌లో గుప్తనిధుల తవ్వకాలకు వెళ్లి ఒకరు మృతి

image

గుప్తనిధుల తవ్వకాల్లో వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. CI శ్రీధర్ రెడ్డి వివరాలు.. గోవిందరావుపల్లి శివారు గుట్టల్లో తూము కట్టడంపై ఏనుగు బొమ్మ ఉండటంతో నిధి ఉందని భావించిన నాగ్సాన్‌పల్లి వాసి శంకరయ్య, మరో 8 మంది మే 21న తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో దాదాపూర్‌కు చెందిన సత్యప్పపై ఓ రాయి మీదపడి చనిపోయాడు. ఘటనను కప్పిపుచ్చడానికి యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన నిందితులను అరెస్ట్ చేశారు.

News August 14, 2024

మన పాలమూరు ప్రత్యేక చరిత్ర !

image

MBNRను గతంలో “రుక్మమాపేట”, “పాలమురు” అనేవారు. HYD (1869-1911AD) నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా VI గౌరవార్ధం ఈ పేరును 4 డిసెంబర్ 1890న మహబూబ్ నగర్ గా మార్చారు. ప్రసిద్ధ “కొహినార్” డైమండ్ తో సహా ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఈ జిల్లా నుంచి వచ్చాయని టాక్. ఒకప్పుడు “చోళవాడి” / “చోళుల భూమి” అని పిలువబడింది. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. రాష్ట్రంలోనే అత్యధిక గ్రామీణ జనాభా(89%) ఉన్న జిల్లా ఇది.

News August 14, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఉచిత విద్యుత్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇకనుంచి ఉచితంగా విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. దీనికోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల వివరాలను వెబ్ పోర్టల్ లో పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు వారు తెలిపారు.

News August 14, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో విష జ్వరాలు

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు విష జ్వరాలు పెరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి నిన్న ఒక్కరోజే 2,206 మంది వచ్చారు. వీరిలో ఎక్కువ మందికి డెంగ్యీ, చికెన్‌ గున్యా, టైఫాయిడ్, సాధారణ ఫీవర్ ఉంది. ప్రస్తుతం 8 మంది డెంగీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, వైద్య సేవలు అందించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని వైధ్యాధికారి తెలిపారు.

News August 14, 2024

సివిల్స్ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

UPSC నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వనపర్తి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నుషిత మంగళవారం తెలిపారు. ఈ మేరకు రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఇచ్చే శిక్షణకు ఆసక్తి గలవారు UPSC, CSC ప్రిలిమినరీ పరీక్ష 2024 నందు ఉత్తీర్ణులై ఉండాలని, పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ లో చూడాలని చెప్పారు.