Mahbubnagar

News August 13, 2024

మాదకద్రవ్య రహిత సమాజం నిర్మిద్దాం: పీయూ రిజిస్ట్రార్

image

మాదకద్రవ్య రహిత సమాజం నిర్మిద్దామని పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం పాలమూరు యూనివర్సిటీలో మాదకద్రవ్యాలపై అవగాహన నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, మాదకద్రవ్యాల బారిన పడితే ఒక కుటుంబం పూర్తిగా నాశనం అవుతుందని, మానవ శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News August 13, 2024

మహబూబ్‌నగర్: బంద్‌కు హిందూ సంఘాల పిలుపు

image

బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌కు హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపునిస్తున్నాయి. సోమవారం మక్తల్‌లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నేడు ఉమ్మడి జిల్లాలోని మద్దూర్, కోస్గి, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, తదితర ప్రాంతాల్లో బంద్ చేపట్టాయి. ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.

News August 13, 2024

దరఖాస్తులను వారంలో పరిష్కరించాలి: కలెక్టర్ సంతోష్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారం రోజుల్లో పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో మౌలిక వసతులను పర్యవేక్షించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు.

News August 12, 2024

ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 ఖాళీలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. NGKL జిల్లాలో 4, WNP జిల్లాలో 4, GDWL జిల్లాలో 3, NRPT జిల్లాలో 2 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో‌‌ పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

News August 12, 2024

జాతీయ సమైక్యతను చాటాలి: డీకే అరుణ

image

ప్రతి పౌరుడు ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరవేసి భారత జాతీయ సమైక్యతను చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళ మోర్చా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో దేశ ప్రజలందరం ఐక్యంగా ఉన్నామని చాటిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. భావితరాల వారికి దేశభక్తి స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందని డీకే అరుణ అన్నారు.

News August 12, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గిన వర్షపాతం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 2.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 1.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాల్ పాడు 1.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా ఎళ్లికల్లి 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 12, 2024

అలంపూర్: తుంగభద్ర నదిలో స్నానాలు బంద్: EO

image

జోగులాంబ ఆలయానికి దర్శనార్థం వచ్చే భక్తులు ఎవరూ తుంగభద్ర నదిలో స్నానాలకు దిగొద్దని ఈవో పురేందర్ కుమార్ సూచించారు. తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం అలంపూర్ వద్ద పుష్కర ఘాట్‌ను ఈవో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. భక్తులు ఆలయం దగ్గరలోనే స్నానపు గదులు ఉన్నాయని, అక్కడే స్నానాలు ఆచరించాలన్నారు. ఆలయ సిబ్బంది పుష్కర్ ఘాట్ దగ్గర భక్తుల కదలికలను గమనించాలన్నారు.

News August 12, 2024

అలంపూర్ ఆలయాల్లోకి వాహనాలు నిషేధం..!

image

అలంపూర్ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలోకి నేటి నుంచి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీఐపీలు కూడా బయట పార్కింగ్ ప్రాంగణంలో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే వీటితోపాటు పురావస్తు శాఖ స్థల ప్రదర్శనశాల, నవబ్రహ్మ ఆలయాలు వెళ్లే మార్గానికి భక్తులు, సందర్శకుల సౌకర్యంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

News August 12, 2024

MBNR: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 3,225 ప్రభుత్వ పాఠశాలల ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్లు, తరగతి గదులు, పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, మొక్కల సంరక్షణ వంటి అంశాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రాంట్ ఇవ్వనుంది. పాఠశాలల నిర్వహణ కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష అభియాన్ కింద కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ను ప్రభుత్వం అందిస్తుంది. వాటికి అదనంగా స్కూల్ ఫెసిలిటీ మెయింటెన్స్ గ్రాంట్ కూడా ఈ నెల నుంచి ఇవ్వనున్నారు.

News August 12, 2024

అయిజ: ఉద్ధృతంగా తుంగభద్ర.. నది పొంగే అవకాశం

image

కర్ణాటకలోని తుంగభద్ర డామ్ గేటు కొట్టుకుపోయిన కారణంగా దిగువన ఉన్న తుంగభద్ర నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామ శివారులో సోమవారం తుంగభద్రా నది నిండుకుండలా, ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరో 5 అడుగులు వరద ఉద్ధృతి కొనసాగితే నది పొంగి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉంది. దీంతో నదీ తీర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.