Mahbubnagar

News August 12, 2024

NGKL: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి వ్యక్తి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉయ్యాలవాడలో స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2024

‘వెయ్యి లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వండి’

image

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రరీయన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా చూస్తామన్నారన్నారు.

News August 12, 2024

కార్యకర్తలే మా బలం.. బలగం: మంత్రి రాజనర్సింహ

image

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం.. బలగం అని, పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇస్తామని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి రాజనర్సింహ అన్నారు. నిన్న వనపర్తి జిల్లాలో మంత్రి పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, జిల్లా, మండల పరిషత్‌, డీసీసీబీల్లో మన వారిని గెలిపించుకోవాలన్నారు. హైవేపై ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు 20 నిమిషాల్లో చికిత్స అందించేలా మూసాపేట వద్ద ట్రామా కేరు సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

News August 12, 2024

NRPT: నేడు పాఠశాలల్లో ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రతిజ్ఞ నిర్వహించాలని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిజ్ఞ చేసిన చిత్రాలు, వీడియోలను విద్యాశాఖ అధికారులకు పంపించాలని, https:// nmba.dosje.gov.in/pledge-certificate ద్వారా ధృవపత్రం పొందాలన్నారు.

News August 12, 2024

NGKL: నేడు దివ్యాంగ విద్యార్థులకు పరీక్షలు

image

దివ్యాంగులైన పాఠశాల విద్యార్థులకు ఉచిత ఉపకరణాలు అందజేసేందుకు సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సహకారంతో కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేయనున్నామన్నారు. 18ఏళ్లలోపు దివ్యాంగ విద్యార్థులు సదరం ధ్రువీకరణ, ఆధార్ కార్డు, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రం/ఆహార భద్రత కార్డు జిరాక్స్, 2ఫోటోలు తీసుకు రావాలన్నారు.

News August 12, 2024

NRPT: దంపతుల మధ్య గొడవ.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

image

సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తిని పోలీసులు కాపాడిన ఘటన నారాయణపేట మండలంలో జరిగింది. బండగొండకు చెందిన రాజు, సుజాత దంపతులు ఆదివారం సాయంత్రం గొడవ పడ్డాడు. అనంతరం గ్రామ శివారులోని గుట్టపైకి వెళ్లి పురుగు మందు తాగి చనిపోతున్నానని భార్యకు ఫోన్ చేశాడు. సుజాత వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ASI బాలయ్య, కానిస్టేబుల్ ఆనంద్ టెక్నాలజీ సహాయంతో రాజు ఉన్న చోటుకు వెళ్లి కాపాడారు.

News August 12, 2024

NRPT: ‘సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ మోసగాళ్లు ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు తెరవకూడదని చెప్పారు. ప్రజలు సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News August 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✔సుంకేసులకు పెరిగిన వరద.. 7 గేట్లు ఓపెన్
✔మహబూబ్‌ నగర్‌లో శ్రీముఖి సందడి
✔జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చేలా కృషిచేస్తా:TWJF
✔విద్యార్థుల వివరాలు నమోదు చేయండి: DEOలు
✔స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
✔పలుచోట్ల సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
✔అలంపూర్: కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు

News August 11, 2024

ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామ సమీపంలో డీసీఎం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. నరసింహ(25) పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బైక్ పై ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన DCM ఢీ కొట్టింది. దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.

News August 11, 2024

గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ వైపు?

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే స్పష్టత లేదు. BRS నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 రోజుల క్రితం కేటీఆర్‌తో సమావేశమై BRSలో కొనసాగుతానన్నారు. పది రోజుల క్రితం మళ్లీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై బుజ్జగించారు. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంటుండడంతో చర్చనీయాంశంగా మారారు.