Mahbubnagar

News April 10, 2025

ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

image

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.

News April 10, 2025

MBNR: ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

image

మహబూబ్‌గర్ జిల్లా నవాబ్‌పేట మండలం కారుకొండ గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఉంటుందని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు. అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ డీకే అరుణ, లక్ష్మారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మంత్రి నరసింహయ్య రానున్నారని చెప్పారు.

News April 10, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News April 10, 2025

MBNR: నేటి నుంచి ధర్మాపూర్ శ్రీ పాండురంగస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మన్యంకొండ ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం 200 ఏళ్ల చరిత్ర కలిగినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈరోజు రాత్రికి వంశపారంపర్య ధర్మకర్త నరసింహయ్య ఇంటి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పల్లకీలో గుట్ట పైకి చేరుస్తారు. రేపు ప్రభోత్సవం జరగనుంది.

News April 10, 2025

నాగర్‌కర్నూల్: చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్

image

చిన్నతగాదా భార్యాభర్తల ప్రాణాలు తీసి, 11 నెలల బాలుడిని అనాథ చేసిన ఘటన HYDహయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKLజిల్లా అమ్రాబాద్‌కు చెందిన దంపతులు నగేశ్, శిరీష బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చారు. ఇటీవల వారి మధ్య చిన్న వివాదం తలెత్తగా శిరీష ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. రాత్రి బంధువుల పూచీకత్తుతో అతడిని వదిలేయగా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడు.

News April 10, 2025

మహబూబ్‌నగర్: నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని ఆచార్యపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమై సోమవారం వరకు ఐదు రోజులపాటు కొనసాగానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వ్యవస్థాపకుడు తమ్మళి విజయకుమార్, రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా, కర్ణాటక రాష్టం నుంచి భక్తులు వస్తుంటారు.

News April 10, 2025

పాలమూరు: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి MBNRజిల్లాలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈమేరకు MBNR, NGKL జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. GDWL, NRPT, WNPలో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల పాలమూరులో పిడుగు పాటుకు ఒకేరోజు ఐదుగురు మరణించారు. జర జాగ్రత్త. SHARE IT

News April 10, 2025

బాలానగర్: రైలు ఢీకొని.. వృద్ధురాలు మృతి

image

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

News April 10, 2025

MBNR: బెట్టింగ్‌కు యువత బలి కావద్దు: ఎస్పీ

image

మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడిన ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ మోజులోపడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మోసగాళ్ల మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితులై మోసపోతున్నారు. 100 డయల్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 9, 2025

GREAT: ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి పాలమూరు బిడ్డ ❤

image

మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(MDCA) కృషితో ఉమ్మడి పాలమూరు జిల్లా మరికల్(M) వెంకటాపురంకి చెందిన జి.గణేశ్ ఇంగ్లాండ్ క్రికెట్ రెండో కౌంటీకి ఎంపికయ్యాడు. ఆరేళ్లపాటు ఒప్పందం కుదరడంతో ఐదు సిరీస్‌లలో 20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ 2వ కౌంటీలకు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని, భారత జట్టుకు ఆడడం తన లక్ష్యమన్నారు.