India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనధికార ప్లాట్లు లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని 31190 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకుని 25% రాయితీని పొందుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ముందుకు వచ్చిన దరఖాస్తుదారుడికి వెంటనే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ డీఇవో అబ్దుల్ ఘని ఉత్తర్వులుజారీ చేశారు. పాన్గల్ జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న చిన్న నాగన్న, రఘురాం ఈనెల 5న స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీఇవో విచారణ చేసి టీచర్లను సస్పెండ్ చేశారు. హెచ్ఎం విజయ్, టీచర్ కిరణ్కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా MBNR జిల్లాలోని 19 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, గుట్ట కింద వెలసిన శ్రీ అలవేలు మంగమ్మ అమ్మవారికి పాల్గుణ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంకురార్పణకు బుధవారం పుట్ట మట్టిని అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువచ్చారు. నవధాన్యాలను పుట్టమట్టిలో వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణం అంటారు.
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలానికి చెందిన నీలి నాగన్న కూతురు దండు మంగమ్మ మంగళవారం కూలీ పనులకు వెళుతుండగా కారు ఢీ కొనగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి కీలక సూచనలు చేశారు. 14వ తేదీ ఉదయం 6 -12 మధ్యాహ్నం గంటల వరకు హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, హోలీ పండుగ ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగు నీరు చల్లడం నిషేధమన్నారు. పబ్లిక్ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం వీధులలో ఇష్టానుసారంగా తిరగడం అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా మ్యాథ్స్ ,బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తంగా 10,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా కేవలం 10,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 209 మంది జనరల్,51 మంది ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 260మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించిన PHD ప్రవేశ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 17 నుంచి 20 వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది రాసిన ఉమ్మడి పాలమూరు వాసులు రిజల్ట్స్ http://www.teluguuniversity.ac.in వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Sorry, no posts matched your criteria.