Mahbubnagar

News August 11, 2024

అచ్చంపేట: ఉమామహేశ్వర ఆలయ ప్రత్యేకత!

image

నల్లమల అటవీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర ఆలయం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా నీరు కొండలో నుంచి ఎప్పటికి సజీవజలంలా జాలువారుతూ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రక్కృతి ఒడిలో నుండి వచ్చిన స్వచ్ఛమైన పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.

News August 10, 2024

NGKL: సొంత ఊరిపై మమకారం చూపిన కల్కి డైరెక్టర్

image

జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా పుట్టిన ఊరు, కన్నతల్లిని ఎప్పటికీ మరచిపోకూడదని కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని ఐతోల్‌లో కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.66 లక్షల నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్, MLAతో నాగ్ అశ్విన్ కలిసి ప్రారంభించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అన్నారు.

News August 10, 2024

సోమశిలలో బ్రహ్మానందం సందడి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో కామెడీ స్టార్ బ్రహ్మానందం సందడి చేశారు. శ్రీలలిత సోమేశ్వరాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమశిల అందాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లమల ప్రకృతి అందాలు చాలా బాగున్నాయని, తనకెంతో నచ్చాయన్నారు. బ్రహ్మానందంతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. 

News August 10, 2024

MBNR: నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ

image

మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల BC నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి శిక్షణ కొరకు www.tgbcstudycircle.cgg.gov.in ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఇందిర, స్వప్న తెలిపారు. 18-25సం|| లోపు ఉండాలని, SSC, INTER, ITI &DIPLOMA పాసై ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు TGBC స్టడీ సర్కిల్ ద్వారా HYDలో శిక్షణ, నెలకు రూ.4వేల స్టైఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు.

News August 10, 2024

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది

image

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల, తుంగభద్ర నుంచి వస్తున్న నీటితో ఈ జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటివరకు ఈ జలాశయానికి 556.65 టీఎంసీలు నీరు రాగా.. దిగువకు గేట్ల ద్వారా 295.11 టీఎంసీలను వదిలారు. శుక్రవారం నాటికి జలాశయం నీటిమట్టం 883.00 అడుగులకు చేరింది.

News August 10, 2024

ఇండ్ల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు: ఎమ్మెల్యే

image

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఆరోగ్యానికి ఆర్థిక భరోసా అందించే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారి ఇండ్ల వద్ద అందజేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన చంద్రయ్యకు రూ.60,000, వీరాపురం గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.10,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు శనివారం అందజేశారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టామన్నారు.

News August 10, 2024

నాగర్ కర్నూల్: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలం గట్టునెల్లికుదురులో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడువ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి సుల్తాన్ మందలించాడు. దీంతో కోపంలో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

అడ్డాకుల: హత్య కేసులో.. 10 మందికి రిమాండ్

image

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం గ్రామానికి చెందిన కొల్లంపల్లి హత్య కేసు నిందితులను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. CI రామకృష్ణ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొల్లంపల్లి 6 రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 10, 2024

బిజినేపల్లి: భార్యను విడిపించాలని భర్త వేడుకోలు

image

నా. కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంకి చెందిన తప్పేట రాములు, భార్య ఎల్లమ్మ కొంతకాలంగా అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుంపుమేస్త్రి రామస్వామి దగ్గర వలస కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కుమారునికి ఆరోగ్యం బాగాలేక ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన మేస్త్రి పంపకపోవడంతో రాములు పారిపోయి వచ్చాడు. విషయం తెలుసుకున్న మేస్త్రి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వనిదే భార్యను పంపనని వేధిస్తున్నట్లు రాములు చెప్పారు.

News August 10, 2024

నేడు నాగర్ కర్నూల్ జిల్లాకు ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్

image

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు(M) ఐతోల్లో కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన పాఠశాలను శనివారం ప్రారంభించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దర్శకుడి సొంత గ్రామమైన ఐతోల్లో విద్యార్థులకు గదుల కొరత ఉందని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తన తల్లిదండ్రుల సహాయ సహకారంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి పాల్గొననున్నారు.