Mahbubnagar

News August 9, 2024

NRPT: నేడు తేళ్ల పంచమి.. ఇదే ఇక్కడ స్పెషల్

image

నారాయణపేటకు సమీపంలోని కర్ణాటకలోని సరిహద్దు గ్రామం కందుకూరులో గుట్టపై వెలసిన కొండమేశ్వరి దేవి ఆలయంలో నేడు తేళ్ల పంచమి నిర్వహిస్తారు. దేవి ఉత్సవాల్లో భాగంగా శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచామితి తిథి రోజు(నేడు) తేళ్ల పంచమి నిర్వహిస్తారు. అమ్మవారు, తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అనంతరం అక్కడి రాళ్ల కింద దాగి ఉన్న తేళ్లను పట్టుకొని ఒంటిపై వేసుకుంటారు. ఎక్కడ వేసుకున్నా తేళ్లు కుట్టకపోవడం ఇక్కడి విశేషం.

News August 9, 2024

జడ్చర్ల: ఒకే ఇంటిలో 6 పాములు

image

ఒకే ఇంటి ఆవరణలో 6 పాములను పట్టుకున్న ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. ఉదండాపూర్ గ్రామంలో మేస్త్రీ పనిచేసే సోమయ్య ఇంటి బెస్మెంట్‌‌లోని రంధ్రంలో పాము కనిపించింది. వారు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సదాశివయ్యకు సమాచారం అందించారు. శిష్యులు రాహుల్, చంద్రశేఖర్‌తో కలిసి వెళ్లిన సదాశివయ్య.. ఆ రంధ్రంలో ఆరు పాములను గుర్తించి పట్టుకున్నారు. అయితే ఆ పాములన్నీ విషరహితమైనవే అని తెలిపారు.

News August 9, 2024

NRPT: ఓపెన్ డిగ్రీలో చేరేందుకు గడువు పెంపు

image

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రథమ,ద్వితీయ, తృతీయ సంవత్సరంలో చేరేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగిందని అధ్యయన కేంద్రం సమన్వయకర్త భాస్కర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరే వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలన్నారు. మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్ష జరగలేదని, అయినప్పటికీ ద్వితీయ సంవత్సరంలో చేరాలన్నారు.

News August 9, 2024

మహబూబ్‌నగర్: ALERT.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

image

రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా IAS, IPS అధికారుల పేరుతో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ల పేరు, ఫొటోలతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు తాజాగా NGKL ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ డీపీతో ఫేక్ ఇన్‌స్టా ఖాతా తెరిచి పలువురికి మెసేజ్‌లు పంపారు. విషయం తెలుసుకున్న ఎస్పీ.. ఇలాంటి వాటికి స్పందించవద్దని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

News August 9, 2024

NRPT: ‘స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి’

image

జిల్లా వ్యాప్తంగా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పరేడ్ మైదానంలో ప్రజలకు, అతిథులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జండా ఆవిష్కరించాలని చెప్పారు.

News August 8, 2024

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల నిరాకరణ చెల్లదు: హైకోర్టు

image

చిన్న పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్లు నిరాకరణ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను సవాలు చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన తాటికొండ కృష్ణ అనే జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం కాదని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

News August 8, 2024

BRS బలహీన పడలేదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

image

BJPలో BRS విలీనం అవుతోందంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా..? మేం రాకూడదా..?. MLAల అనర్హతపై సుప్రీం కోర్టులో కొట్లాడడం కోసమే ఢిల్లీకి వచ్చాం. BRS బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నాం. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు కాంగ్రెస్ నేతలు నోటికొచ్చింది మాట్లాడొద్దు.’ అని హెచ్చరించారు.

News August 8, 2024

MBNR: భర్త దశదినకర్మ రోజే భార్య మృతి

image

భర్త దశదినకర్మ రోజే భార్య మృతి చెందిన ఘటన పానగల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కేతేపల్లికి చెందిన మీనుగ చిన్న కిష్టయ్య(80) పది రోజుల క్రితం భోజనం చేస్తూ హఠాత్తుగా కిందపడి మరణించారు. కాగా, నేడు ఆయన దశదినకర్మ కార్యక్రమం నిర్వహిస్తుండగా భార్య లక్ష్మీ దేవమ్మ(75) హఠాత్తుగా కుప్పకూలింది. భార్త మృతి చెందిన 10 రోజులకే భార్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News August 8, 2024

NRPT: మహిళకు పాముకాటు.. ఆస్పత్రికి వెళ్తుండగా యాక్సిడెంట్

image

పాముకాటుకు గురైన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. ఊట్కూరు మం. ఏర్గడ్‌పల్లికి చెందిన సుజాత పాము కాటుకు గురైంది. ఆమెను అభినవ్(24) బైక్ పై చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. దత్తసాయి కాలేజ్ సమీపంలో అడ్డొచ్చి ఎద్దులను తప్పించబోయి అదుపుతప్పి కింద పడటంతో అభినవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ సుజాతను ఆస్పత్రికి తరలించారు.

News August 8, 2024

నాగర్‌కర్నూల్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెగుచూసింది. ఓ కామాంధుడు ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.