India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
గద్వాల నేత చీరలు దేశ, విదేశి వనితల ఆదరణ పొందుతూ పాలమూరు గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివాహాది శుభకార్యాలకు మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికే వస్తుంటారు. ఒక్కో చీర రూ.1000 నుంచి రూ.2లక్షల వరకు పలుకుతాయి. ఏటా దసర బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు గద్వాల నుంచే వెళ్తాయి. కాగా.. గద్వాల జరీ చీరలకు 2008లోనే జీఐ ట్యాగ్ లభించింది.
జడ్చర్ల మండలం నాగసాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో పలవురు విద్యార్థులు ఇబ్బంది పడటంతో వారిని పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ కలెక్టర్ విజయేద్ర బోయి పాఠశాలను సందర్శించి పిల్లలకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెంట్లవెల్లి KGBVలో విద్యార్థినులు ఆస్వస్థతకు గురైన 2రోజుల్లోనే ఈ ఘటన జరగడం బాధాకరం.
కృష్ణా నదిలో వరద కొనసాగుతుంది. జూరాల 30 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.49 లక్షల క్యూసెక్కులు.. ఔట్ఫ్లో 2.35లక్షల క్యూసెక్కులుగా ఉంది. 9.65TMCలకు 9.09TMCల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తారు. స్పిల్ వే ద్వారా 3.11 లక్షల క్యూసెక్కులు వదులుతుండగా.. ఇన్ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 205 TMCల నిల్వ ఉంది. సాగర్లో 20గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా గట్టులో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 86.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 82.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా గోపాల్ పేట పేటలో 71.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా వట్వర్లపల్లిలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పారిస్లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడల్లో మహబూబ్నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సందడి చేశారు. ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్న ఆయన ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ క్రమంలో ఆయనతోపాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డి, వీసీఎండీ సోనీ బాలాదేవి, అధికారులు శానవాజ్, వేణుగోపాల చారి, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) త్రీడే లీగ్లో ఉమ్మడి జిల్లా జట్టు వర్సెస్ ఖల్సా జట్ల మధ్య మంగళవారం మూడవ మ్యాచ్ ప్రారంభం అవ్వగా..RR జిల్లా మొయినాబాద్లోని SR-1 మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఖల్సా క్లబ్(HYD) జట్టు మొదటి రోజు 86.1 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. జట్టులో చిరాగ్ యాదవ్ 182 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లు అరుణ్ 4, ఎ.శ్రీకాంత్, షాదాబ్ చెరో వికెట్ తీశారు.
MBNR రవాణా శాఖ అధికారులు మంగళవారం టీజీ 06,6666 అనే ఫ్యాన్సీ నంబరుకు ఆన్లైన్ వేలం నిర్వహించగా.. 9 మంది వాహనదారులు ఒక్కొక్కరు రూ.30వేల చొప్పున చెల్లించారు. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన వేలంలో కె.బాలకృష్ణ అనే వ్యక్తి అత్యధికంగా రూ.5.45 లక్షలకు కోట్ చేయగా అధికారులు ఆయనకు ఆ నంబర్ కేటాయించారు.ఈ నంబరు వేలంతో రవాణా శాఖకు మొత్తం రూ.8.15 లక్షల ఆదాయం సమకూరింది.
అలంపూర్ BRS MLA విజయుడిని పోలీసులు అరెస్టు చేయడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విట్టర్(X) ద్వారా స్పందించారు. ‘ప్రజా పాలనలో మన ప్రజాప్రతినిధులు రోజు అవమానాలకు గురవుతున్నారు. మా ఎమ్మెల్యే విజయుడిని అవమానించిన జిల్లా అధికారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాను. అన్ని అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ప్రజలచే తిరస్కరించబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించడానికి కారణం ఏమిటి?’ అని CSను ట్యాగ్ చేశారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు RTF కోర్సు ఫీజులు విడుదల కాలేదు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. అటు స్కాలర్షిప్ ఇటు కోర్స్ ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీయూ అధికారులు స్పందించి RTFలను విడుదల చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.