Mahbubnagar

News January 30, 2025

నేడు మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ నిరసన  

image

మహబూబ్‌నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా మహాత్మా గాంధీకి నివాళులర్పించి.. అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

News January 29, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔గద్వాల:రేపు వాహనాలకు వేలం:SP
✔సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
✔ఈవీఎంలు తనిఖీ చేసిన కలెక్టర్లు
✔ధన్వాడ:ZP పాఠశాలలో ఫుడ్ పాయిజన్
✔NRPT:MLA సంతకం ఫోర్జరీ..నిందితులు అరెస్టు
✔బిజినేపల్లి:FEB 9 నుంచి చౌడేశ్వరి దేవి ఉత్సవాలు
✔అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలి:సీపీఎం
✔బేటి బచావో- బేటి పడావో ఉత్సవాలు
✔నిర్లక్ష్యంగా నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు:MBNR కలెక్టర్
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News January 29, 2025

అడ్డాకుల: అనుమానాస్పద స్థితిలో యువకుడి సూసైడ్

image

అడ్డాకుల మండలం రాచాల (నాగయ్యపల్లి)కి చెందిన యువకుడు గద్దెగూడెం చెన్నయ్య(24) అనుమానాస్పద స్థితిలో మంగళవారం రాత్రి ఉరేసుకుని మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత చెన్నయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

News January 29, 2025

60 డివిజన్లుగా పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్

image

పాలమూరు మున్సిపాలిటీని 60 డివిజన్లతో కార్పొరేషన్‌గా మారుస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 49 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీని 60కి పెంచడంతో సభ్యుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు డివిజన్‌కు ఎంత మంది ఓటర్లు ఉంటారో తెలియాల్సి ఉంది.

News January 29, 2025

MBNR: ఐదు కిలోమీటర్ల వరకు మద్యపాన నిషేధం

image

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్న మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన పరిధి చుట్టూరా ఐదు కిలోమీటర్ల మేర మద్యపాన నిషేదం విధిస్తున్నట్టు స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యపాన నిషేధం విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.

News January 29, 2025

MBNR: ఈనెల 30న నిరుద్యోగులకు జాబ్ మేళా

image

మహబూబ్‌నగర్ లోని నిరుద్యోగులకు వివిధ ప్రవేట్ సంస్థల్లో 250 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 30న జిల్లా ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సర్టిఫికెట్స్‌తో పట్టణంలోని పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. 

News January 29, 2025

MBNR:మన్యం కొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష

image

మన్యం కొండ దేవస్థానం ప్రతిష్ఠను పెంచే విధంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసిలో మన్యంకొండ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,SP డి.జానకి పాల్గొన్నారు.

News January 29, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔Way2Newsతో SBI, SBRSETI డైరెక్టర్
✔ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ డీకే అరుణ
✔FBR 7నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు
✔తగ్గిన చలి.. పెరిగిన ఉష్ణోగ్రతలు
✔సీఎం,MLAల చిత్రపటానికి పాలాభిషేకం
✔UPS విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన
✔మరికల్:వేధింపుల కేసులో వ్యక్తికి జైలు శిక్ష
✔మక్తల్: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
✔దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో..చిరుత మృతి

News January 28, 2025

MBNR: ఫిబ్రవరి 7 నుంచి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు

image

తెలంగాణ తిరుపతిగా భావించే మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రంగరంగ వైభవంగా మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

News January 28, 2025

కర్ణాటక మంత్రులను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే

image

యాద్గిర్‌లో కర్ణాటక హోమ్ మినిస్టర్ డా. జి. పరమేశ్వర, పరిశ్రమల మంత్రి శరణబసప్పను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాల పై చర్చించారు. అనంతరం భోజనం చేశారు. యాద్గిర్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పాటిల్ తున్నూర్, షోరాపూర్ ఎమ్మెల్యే రాజా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!