Mahbubnagar

News March 31, 2025

మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

image

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

News March 31, 2025

MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..! 

image

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు. 

News March 31, 2025

NGKL: వివాహితపై అత్యాచారం.. ఆ వ్యక్తిదే కీలకపాత్ర!

image

ఊర్కొండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనార్థం వచ్చిన<<15944914>> ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన<<>> సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి దేవాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 31, 2025

వనపర్తి: కొడుకు మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. బుద్దారానికి చెందిన కోదండరాములు(55) కుమారుడు ఆంజనేయులు భార్యతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగా ఇటీవల ఇంట్లో ఉరేసుకున్నాడు. కోదండరాములు చిన్న కొడుకు సైతం ఏడాది క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 31, 2025

MBNR: రంజాన్‌కు భారీ బందోబస్తు: SP 

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ నేపథ్యంలో నేడు ఈద్గా, మసీద్‌లలో పెద్ద ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

News March 31, 2025

గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

image

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.

News March 31, 2025

WOW: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ విద్యార్థిని

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కర్ని (ZPHS) పాఠశాల విద్యార్థిని వై.శశిరేఖ 57వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ బి.రూప తెలిపారు. జనవరి 9, 10, 11న వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఒడిశాలోని పూరిలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటయ్య,ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATS❤

News March 31, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

❤కనిపించిన నెలవంక.. రేపే రంజాన్❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤’రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం’❤ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు❤జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి❤సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు❤గద్వాల: చట్నీలో బల్లి❤బల్మూర్‌: జిల్లా స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు❤గ్రామాల్లో పంచాంగ శ్రవణం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 30, 2025

NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

image

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News March 30, 2025

MBNR: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.