Mahbubnagar

News August 5, 2024

TLF నూతన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి

image

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(TLF) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మోహన్ రెడ్డి, కరుణాకర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా విజేత వెంకట్ రెడ్డి, MBNR-మల్లేష్ , GDWL-డాక్టర్ మహేందర్,NGKL-సత్యం,NRPT-అశోక్ గౌడ్,WNPT-డాక్టర్ చంద్రశేఖర్ లను ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

News August 5, 2024

MBNR: DEECETకు రేపే చివరి తేదీ

image

DEECET-2024లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మొత్తం 1611 కాగా అందులో 1134 విద్యార్థులు తమ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారని డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ మేరజులఖాన్ అన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులలో దాదాపు 70% ధ్రువపత్రాలను పరిశీలించామని, రేపటితో ఈ గడువు ముగుస్తుందని, మిగిలిన విద్యార్థులందరూ ధ్రువపత్రాలను పొందుపరచడానికి హాజరు కావాలన్నారు.

News August 5, 2024

నాగర్‌కర్నూల్: రూ.20 కోట్లు వసూలు చేసి పరారీ

image

నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలో మరో వడ్డీ వ్యాపారి రూ.20కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన జహీర్ నాగర్కర్నూల్, తుడుకుర్తి, నడిగడ్డ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుంచి అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి రూ.20 కోట్లు వసూలు చేశాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితులు కోరగా ప్లేట్ తిప్పేసి పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

News August 5, 2024

నాలుగు GOVT JOBS సాధించిన పాలమూరు బిడ్డ

image

మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన జ్ఞాన వర్షిని TGPSC ప్రకటించిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. ఈ ఉద్యోగమే కాకుండా ఇంకా (AE),TPBO, గ్రూప్-4ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనప్పటికీ వాటికి రాజీనామా చేస్తానని తెలిపారు. తల్లిదండ్రులు జ్ఞానేశ్వరి, రాజిరెడ్డి ఉపాధ్యాయులు, అన్నయ్య ప్రణవ్ రెడ్డి నౌక దళంలో లెఫ్ట్నెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
-CONGRATS

News August 5, 2024

MBNR: ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గడువు పొడిగింపు

image

తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఎంట్రీలను సమర్పించేందుకు ఈనెల 10 వరకు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు రూపొందించిన వారిని పరిచయం చేస్తూ వాటిని ఈనెల 15న ప్రదర్శిస్తామని వెల్లడించారు. వివరాలకు pr-tsic@telangana.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

News August 5, 2024

MBNR: విచారణ కమిటీ వేసిన సీపీ

image

సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News August 5, 2024

MBNR: నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు!

image

ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు కొంతమంది అయితే ఎన్నికల సమయంలో పార్టీ మారిన నాయకులు మరికొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువులు నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

News August 5, 2024

MBNR: నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు!

image

ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు కొంతమంది అయితే ఎన్నికల సమయంలో పార్టీ మారిన నాయకులు మరికొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువులు నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

News August 5, 2024

MBNR: ఇందిరమ్మ పథకం.. 42 వేల మందికి లబ్ధి!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ సర్కారు ప్రకటించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం కింద ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5 లక్షలు లబ్ధి దారులకు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం కలిపి 42 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా. వీటి నిర్మాణానికి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయి.

News August 5, 2024

నేడే ఆఖరు..’రైతు బీమా’ దరఖాస్తు చేసుకోండి!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు బీమా కోసం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు తెలిపారు. భూమి పట్టా పాసుపుస్తకం ఉండి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులని, రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం (జీరాక్స్) నకలు ప్రతులు అందించాల్సి ఉంటుంది.