Mahbubnagar

News August 5, 2024

MBNR: ‘దోస్త్’ ప్రవేశాలకు నేడు చివరి అవకాశం!

image

డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లకు సోమవారంతో గడువు ముగియనుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తెలిపారు. ప్రవేశాలకు ఆగస్టు 2న గడువు ముగియడంతో ప్రత్యేక గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులై ఉండి తొలి, మలి, చివరి విడత ప్రవేశాల్లో సీట్లు పొందని వారికి ఇది చక్కటి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 5, 2024

MBNR: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’.. నేడు చేపట్టాల్సిన పనులు!

image

నేటి నుంచి ప్రారంభంకానున్న “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ✒ఈనెల 5న ప్రజలకు “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై అవగాహన✒ప్రభుత్వ కార్యాలయాలు,కూడళ్లు,రోడ్లను శుభ్రం చేయడం✒మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం✒వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన✒చెత్త సేకరించి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమలు చేయడం తదితర పనులు చేపట్టనున్నారు.

News August 5, 2024

ఆటోమేటిక్ సైఫన్ సిస్టం కలిగిన ఏకైక ప్రాజెక్టు సరళ సాగర్

image

వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద ఊకచెట్టు వాగుపై ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టును 1959లో నిర్మించారు. అప్పట్లో దీనిని 22 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో రూపొందించారు. ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫన్ సిస్టం కలిగిన ప్రాజెక్టులో సరళ సాగర్ 2వదిగా చరిత్రలో నిలిచింది. ఈ ప్రాజెక్టులో నీరు నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా సైఫన్స్ తెరుచుకోడం, వరద ఉద్ధృతి తగ్గగానే మూసుకోవడం దీనీ ప్రత్యేకతలు.

News August 4, 2024

ఉమ్మడి జిల్లాలోని నేటి ముఖ్యవార్తలు!!

image

✔షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంతో తల్లీకొడుకు మృతి ✔’స్వచ్ఛదనం-పచ్చదనం’.. రేపటి నుంచి షురూ ✔అలంపూర్‌లో చండీ హోమాలు.. రూ.4.14 లక్షల ఆదాయం ✔పాలమూరును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి ✔NGKL:మద్యం మత్తులో వ్యక్తి మృతి ✔శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి ✔అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

News August 4, 2024

MBNR: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’.. రేపు చేపట్టాల్సిన పనులు!

image

రేపటి నుంచి ప్రారంభంకానున్న “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈనెల 5న✒ప్రజలకు “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై అవగాహన✒ప్రభుత్వ కార్యాలయాలు,కూడళ్లు,రోడ్లను శుభ్రం చేయడం✒మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం✒వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన✒చెత్త సేకరించి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమలు చేయడం తదితర పనులు చేపట్టనున్నారు.

News August 4, 2024

షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంతో తల్లీకొడుకు మృతి

image

షాద్‌నగర్ పరిధిలోని నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. స్థానిక జీపీ దర్గాకు వెళ్లి వస్తుండగా స్కూటీ, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతులు అంజద్‌బేగం(35), అబ్దుల్‌ రెహమాన్‌ (12)గా గుర్తించారు. మరో కొడుకు రహీం (9)కి తీవ్ర గాయాలయ్యాయి.

News August 4, 2024

MBNR: ఆదివారం అమావాస్య SPECIAL.. ‘రామకొండ జాతర’

image

ఏడాదిలో కేవలం అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రోజు మాత్రమే తెరుచుకునే దేవాలయం మన పాలమూరులో ఉంది. అదే MBNR నుంచి 16 కి.మీ.ల దూరంలోని కోయిలకొండ వద్ద ఉన్న రామ కొండ శ్రీరాముల వారి ఆలయం. ఇక్కడి జాతరకు పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రావడం విశేషం. రాముల వారు ఇక్కడ స్వయంగా వెలిశారని, కొండపై గల ఏ వనమూలికైనా తీసుకెళ్లి ఇంటి గుమ్మానికి కడితే మంచి జరుగుతుందని వారి నమ్మకం.

News August 4, 2024

జడ్చర్ల: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

image

చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. పట్టణంలోని గణేశ్ నగర్ కాలనీ సమీపంలో చెరువులో పడి మ్యాకల శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదవశాత్తు మరణించాడా.? ఆత్మహత్యకు పాల్పడ్డాడా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News August 4, 2024

MBNR: దోస్త్ మేరా దోస్త్.. FRIEND అంటే మాకు ప్రాణం!

image

ఫ్రెండ్ అంటేనే పాలమూరు వాసులు ప్రాణమిస్తారు. కష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఇక చిన్నతనం దోస్తానా జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. స్కూల్, కాలేజ్ నుంచి వెళ్లిపోయేటప్పుడు కన్నీరు పెట్టిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day..!!

News August 4, 2024

MBNR: 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

image

ఆదర్శ కళాశాల వసతి గృహంలో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు రెండేసి, మూడేసి సార్లు కడుపునొప్పి రావడంతో విలవిలలాడిపోయారు. ఓ విద్యార్థినికి తీవ్ర అస్వస్థత రావడంతో ఉపాధ్యాయుడు బైకుపై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కొన్ని రోజులుగా నాణ్యత లేని భోజనం పెడుతున్నట్లు సమాచారం.