Mahbubnagar

News August 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔గద్వాల: రైలు కిందపడి యువకుడు సూసైడ్
✔నర్వలో ప్రోటోకాల్ వివాదం.. ‘CONGRESS V/s BJP’
✔గండీడ్:SBI ఏటీఎంలో దొంగల బీభత్సం
✔కొడంగల్: అక్రమ కట్టడాలు కూల్చివేత
✔నేతన్నకు ‘బీమా’దరఖాస్తుల ఆహ్వానం
✔MBNR: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
✔’స్వచ్ఛదనం-పచ్చదనం’ పై ప్రత్యేక ఫోకస్
✔ITIలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
✔NGKL:కాలువలో గుర్తుతెలియని మృతదేహం
✔రేపు మహిళ ఫుట్ బాల్ జట్టు ఎంపిక

News August 3, 2024

MBNR: LRS ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలి: డీప్యూటీ సీఎం

image

రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్దీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న LRS ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయాలని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్ వీసీలో పాల్గొన్నారు.

News August 3, 2024

గండీడ్: SBI ఏటీఎంలో దొంగలు బీభత్సం

image

SBI బ్యాంకు ATMలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించిన ఘటన గండీడ్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ గాంధీ నాయక్, ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నేడు తెల్లవారుజామున మొహానికి గుడ్డలు కట్టుకొని ATMను కాల్చి దొంగతనానికి ప్రయత్నించారని, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామన్నారు. క్లూస్ టీమ్స్ సహాయంతో దొంగలను వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

News August 3, 2024

MBNR: ‘నేతన్నకు బీమా’దరఖాస్తుల ఆహ్వానం

image

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్నకు బీమా పథకం ప్రవేశ పెట్టిందని.. అర్హులైన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత,జౌళిశాఖ AD గోవిందయ్య తెలిపారు. వనపర్తి, NGKL, గద్వాల జిల్లాల పరిధిలో 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు బీమా చేయించుకోవాలని చెప్పారు. ఈనెల 9వ తేదీ నాటికి దరఖాస్తులను ఏడీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కొత్తగా జియోట్యాగ్ నంబర్ వచ్చిన వారు కూడా అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు.

News August 3, 2024

MBNR: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మక్తల్ పట్టణానికి చెందిన దంతనూర్ కుర్మయ్య (45) అనే వ్యక్తి పట్టణ శివారులోని ఎల్లమ్మ కుంట వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టాలపై పడివున్న కుర్మయ్యను శనివారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News August 3, 2024

‘స్వచ్ఛదనం-పచ్చదనం’కి సమాయత్తం.. రేపటి నుంచి షురూ!

image

రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈనెల 9 వరకు అమలు చేయనుంది. ఉమ్మడి MBNR జిల్లాలో 1,692 గ్రామపంచాయతీలు, 19 పురపాలికలు ఉన్నాయి. 5 జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాకాలం కావడంతో పారి శుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది. వాటిపై దృష్టి పెట్టమన్నారు.

News August 3, 2024

MBNR: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈనెల 8,9,10,11, 15,17,18,22,23,24,28,30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 3, 2024

MBNR:’స్వచ్ఛదనం-పచ్చదనం’ పై ప్రత్యేక ఫోకస్

image

‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లోని వార్డులో చేపట్టాలన్నారు. వనమహోత్సవం, లక్ష్య సాధనకు, పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక ఫోకస్ చేయాలన్నారు.

News August 3, 2024

భారీ నాగు పామును పట్టుకున్న కృష్ణ సాగర్

image

వనపర్తికి చెందిన రాంబాబు ఇంటిలో భారీ నాగుపాము(ఇండియన్ స్పెటికల్ కోబ్రా)ను సాగర్ స్నేక్ సొసైటీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ సాగర్ పట్టుకున్నారు. మొదట ఈ పామును చూసిన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా నాగుపాములు 5 అడుగులకు మించి ఉండమని, ఈ భారీ నాగు 6 అడుగుల 1 ఇంచు పొడవు ఉందని, ఇంతవరకు ఇంత పెద్ద పామును చూడలేదన్నారు. అనంతరం దాన్ని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News August 3, 2024

స్వచ్ఛదనం-పచ్చదనం సక్సెస్ చేయాలి: కలెక్టర్

image

అధికారులు సమన్వయంతో కృషి చేసి స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. కార్యక్రమంలో చేపట్టవాల్సిన వివిధ అంశాలపై కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆమె వెబెక్స్ సమావేశం నిర్వహించారు. 5రోజులపాటు జరగనున్న కార్యక్రమం పటిష్టంగా నిర్వహించేందుకు జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తూ, అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు.