Mahbubnagar

News February 26, 2025

నవాబ్ పేట: చికిత్స పొందుతూ కార్మికురాలి మృతి

image

ఈనెల 14న ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని గాయాల పాలైన గురుకుంట గ్రామపంచాయతీ కార్మికురాలు చెన్నమ్మ(62)చికిత్సపొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. విధులలో భాగంగా కార్మికురాలు చెన్నమ్మ గ్రామంలోని వీధులను ఊడ్చిన చెత్తను అంటిస్తుండగా చీర కొంగుకు నిప్పు అంటుకొని ప్రమాదం సంభవించగా, చికిత్సనిమిత్తం MBNR ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

News February 26, 2025

MBNR: ప్రతి కళాశాలలో యాంటిడ్రగ్స్ కమిటీలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని జూనియర్ కళాశాలలు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో మాదకద్రవ్యాలు, సైకో ట్రోపిక్ పదార్థాల నియంత్రణపై సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించాలని అధికారులను ఆదేశించారు.

News February 25, 2025

MBNR: పాన్ షాప్‌లపై గట్టినిఘా: అదనపు కలెక్టర్

image

మాదకద్రవ్వాల నియంత్రణకై జిల్లా వ్యాప్తంగా డ్రాగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పాన్‌షాప్‌లపై గట్టి నిఘా పెట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో దాడులపై సమీక్ష నిర్వహించారు. డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటిని విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

News February 25, 2025

జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2025

జడ్చర్ల: ఆటో, బైక్‌ ఢీ.. యువకుడికి గాయాలు

image

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2025

మహబూబ్‌నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్‌ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.

News February 24, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్ (25), అనిల్ (22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ సీఐ రామకృష్ణ పరిశీలించారు.

News February 24, 2025

మహబూబ్‌నగర్ కలెక్టర్ కీలక సూచన

image

MBNR జిల్లా వ్యాప్తంగా ఆర్థిక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రుణాలను ప్రభుత్వ సంస్థల ద్వారానే తీసుకోవాలని, ప్రవేట్ సంస్థల్లో తీసుకొని అధిక వడ్డీ బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2025

ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News February 24, 2025

BREAKING: మహబూబ్‌నగర్: ప్రైవేట్ బస్సు దగ్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు వెనుక టైరు పగిలి మంటలు అంటున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. కాగా, బస్సులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు దగ్ధం అయింది.