Mahbubnagar

News August 3, 2024

MBNR: ITIలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ITI కోర్సుల్లో మిగులు సీట్ల కొరకు మూడోవ విడత దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు MBNR జిల్లా ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ బి. శాంతయ్య శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు https://iti.telangana.gov.in వెబ్ సైట్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, 1-8-2024 నాటికి 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అర్హులని చెప్పారు. నేటి నుంచి ఈనెల 12 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

News August 2, 2024

పాలమూరులో నేటి ముఖ్యాంశాలు

image

✔CM రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే
✔MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
✔GDWL, NRPTలో కొత్త వైద్య కళాశాలలు
✔జూరాల 41 గేట్లు ఎత్తి నీటి విడుదల
✔ఈనెల 6 వరకు డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
✔CM సభకు వెళ్లిన ఉమ్మడి జిల్లా టీచర్లు
✔కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: మర్రి జనార్దన్ రెడ్డి
✔WNPT:దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్
✔నేటి నుంచి ITIలో దరఖాస్తుల ఆహ్వానం

News August 2, 2024

సైబర్ క్రైం.. MBNR కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్.. కేసు నమోదు

image

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఏకంగా మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర పేరు, ఆమె ఫొటోతో ఫేక్ అకౌంట్ సృష్టించి సోషల్ మీడియాలోకి వదిలారు సైబర్ నేరగాళ్ళు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. +94784605962 నంబర్‌తో ఓ నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించారని ఆమె తెలిపారు.

News August 2, 2024

MBNR: ఈనెల 6 వరకు డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

DEECET-2024లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 2024-2026 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అడ్మిషన్ కొరకు ధ్రువ పత్రాలను ఆగస్టు 6 వరకు పరిశీలిస్తామని DIET ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ మేరజులఖాన్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వారికి కేటాయించిన తేదీల్లో ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

News August 2, 2024

గండీడ్: ‘రూ.40 వేలకు.. రూ. 440 రుణమాఫీ అయ్యింది’

image

గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నదోమ మొగులయ్య తన భూమిపై 2023 జూలై 4న వెన్నాచెడ్ బ్యాంకులో రూ. 40 వేల అప్పు తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రుణమాఫీలో తనకు మొదటి విడతలో కేవలం రూ. 440 మాత్రమే మాఫీ రైతు తెలిపారు. దీనిపై బ్యాంక్ మేనేజర్, వ్యవసాయ అధికారులను కలవగా తమకేం తెలియదని చేతులెత్తేశారని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతు కోరుతున్నారు.

News August 2, 2024

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి గద్వాల ఎమ్మెల్యే

image

హైదరాబాద్‌‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం వెళ్ళారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి, తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ ముమ్మరంగా ప్రచారం జరిగింది. నిన్న గద్వాల్ ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి వచ్చి ఎమ్మెల్యేతో చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం నేడు సీఎంను బండ్ల కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

News August 2, 2024

దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్

image

ఖిల్లా ఘనాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్ కుమార్ రెడ్డి మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడడంతో అతనిని సస్పెండ్ చేసినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గత నెల 24న పదర మండలంలోని వంకేశ్వరం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపడంతో వారిపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడని పేర్కొన్నారు.

News August 2, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన షాద్‌నగర్ పట్టణ సమీపంలోని బాలానగర్ రహదారిలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాలు.. మండలంలోని మోతి ఘనపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్(30) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా, లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 2, 2024

B.Ed థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించబోయే B.Ed థియరీ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రాజకుమార్ గురువారం విడుదల చేశారు. 4వ సెమిస్టర్ ఈ నెల 12-17, 3వ సెమిస్టర్ 13-19, 2వ సెమిస్టర్ 13-22 తేదీల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.

News August 2, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో తగ్గిన వ్యవ’సాయం’!

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా జులై వరకు కేవలం 8,56,770(45.93%) ఎకరాల్లోనే రైతులు పంటలు సాగు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. అత్యధికంగా పత్తి, తర్వాత వరి సాగు చేస్తున్నారని, ఆగస్టు నెల ప్రారంభమైన పంటల సాగు విస్తీర్ణం 50% కూడా దాటలేదని, ఏడాది ఇప్పటికి 5.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారని,
వానాకాలం సీజన్‌లో మొత్తం 18,65,269 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది.