India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా మహబూబ్నగర్ రూరల్ PS పరిధిలో 300, అత్యల్పంగా మిడ్జిల్ PS పరిధిలో 88 రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అన్ని వినాయక మండపాల జియో-ట్యాగింగ్ పూర్తి నిమజ్జన రూట్మ్యాప్తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

వినాయక నిమజ్జనానికి వెళ్లి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం బోడ జానంపేటలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం కావేరమ్మపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు BSCPL క్రషర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కంపెనీలో ఉన్న గణేశుని నిమజ్జనం చేశారు. ప్రమాదవశాత్తు ఆంజనేయులు గుంతలో పడ్డాడు. శుక్రవారం నుంచి గాలించగా శనివారం సాయంత్రం
అతని మృతదేహన్ని బయటికి తీశారు.

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలోని లైబ్రరీ ఆడిటోరియంలో నేడు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్ర కిరణ్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి,PU వైస్ ఛాన్సలర్ జిఎన్. శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎండీ గౌస్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.

పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. బొక్కలోనిపల్లికి చెందిన అజయ్ కుమార్ మహబూబ్నగర్ పట్టణంలోని కొత్త ఆర్టీవో ఆఫీస్ మైసమ్మ దేవాలయం పక్కన బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా EMT లక్ష్మణ్ గౌడ్, పైలెట్ కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఎరువులను విక్రయించే డీలర్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసి, వాటిని పక్కదారి మళ్లించకుండా రైతులందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎరువుల స్టాక్ ఉండి లేదని చెప్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు ఎరువులను అందించకుండా వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఎరువుల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. చిన్న సన్నకారు రైతులకు ఎరువులు లేవని చెబుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.