Mahbubnagar

News August 2, 2024

MBNR:’స్వచ్ఛదనం.. పచ్చదనం’ షెడ్యూల్ ఇదే!

image

‘స్వచ్ఛదనం.. పచ్చదనం’ పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 5న ప్రతి గ్రామం, ప్రతి వార్డులో అధికారులు కార్యక్రమం చేపట్టాలన్నారు.
✒ఆగస్టు 6న తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం
✒7న మురికి కాల్వలు, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, గుంతలను పూడ్చటం
✒8న సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన, కుక్కల దాడుల నివారణ చర్యలు,
✒9న డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటివి చేపట్టనున్నారు.

News August 2, 2024

జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా అంజనీదేవి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా అంజనీదేవి నియమిస్తూ గురువారం ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు జారీ చేసింది. ఇక్కడి సహాయ కమిషనర్‌గా దిరాజు శ్రీనివాసరాజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి బదిలీ కాగా.. ఆయన స్థానంలో జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారిగా ఉన్న అంజనీదేవి ఇక్కడికి వచ్చారు.

News August 2, 2024

BREAKING.. MBNR: భార్యపై అనుమానంతో హత్య

image

అనుమానం పచ్చని కాపురాన్ని తుంచేసింది. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్‌కు చెందిన రాజు అగ్రికల్చర్ కాలనీలోని ఉషోదయ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ.. పెట్రోల్ బంక్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తలపై ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం పీఎస్‌లో లొంగిపోయాడు.

News August 2, 2024

MBNR: ఉపాధ్యాయులతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2,900 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయంతో పదోన్నతి పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతి పొందిన 30 వేల మందితో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమావేశం కానున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకెళ్లే వారి కోసం మొత్తం 66 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నోడల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News August 2, 2024

MBNR:12 నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు

image

PU పరిధిలోని బీఈడీ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 12 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పీయూ పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజ్ కుమార్ తెలిపారు. 2024 ఎడాదికి చెందిన 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఈనెల 12,14,17 తేదీల్లో, 3వ సెమిస్టర్ బీఈడీ పరీక్షలు 13న, 16న,19 తేదీల్లో, 2వ సెమిస్టర్ బ్యాక్ ల్యాగ్, ఇంప్రూమెంట్ పరీక్షలు 13, 16, 19, 21, 22 తేదీల్లో నిర్వహిస్తామన్నారు.

News August 2, 2024

“స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్ సిక్తా

image

ఈనెల 5 నుంచి 9 వరకు చేపట్టే “స్వచ్చదనం – పచ్చదనం” కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎంపిడిఓ, ఎంపీఓ, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు ఘనంగా ప్రారంభించాలని చెప్పారు. అయిదు రోజుల పాటు చేపట్టే కార్యక్రమాల వివరాలను అధికారులకు వివరించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

News August 2, 2024

ప్రణాళిక బద్ధంగా విద్యా బోధన ఉండాలి: మాయంక్ మిత్తల్

image

ఉపాధ్యాయులు విద్యా బోధన ప్రణాళికలో బద్ధంగా ఉండాలని నారాయణపేట అదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్ అన్నారు. నారాయణపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన న్యాస్- 2024 ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3, 6, 9 తరగతుల ప్రశ్న పత్రాల తయారీ, విద్యాబోధనపై ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

News August 1, 2024

ఉమ్మడి పాలమూరులో నేటి ముఖ్యాంశాలు

image

✔రెండో మ్యాచ్‌లో పాలమూరు టీం సంచలన విజయం
✔శ్రీశైలం డ్యాంలో వ్యక్తి గల్లంతు
✔GDWL: చిన్నారులపై కుక్కల దాడి
✔సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా:RS ప్రవీణ్
✔పెబ్బేరులో హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
✔NGKL: అన్న దారుణ హత్య.. న్యాయం కోసం టవర్ ఎక్కిన తమ్ముడు
✔PU ఎంబీఏ సెమిస్టరీ షెడ్యూల్ విడుదల
✔ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన మంత్రి జూపల్లి,MLAలు
✔రైతు బీమా.. దరఖాస్తులు చేసుకోండి: AOలు

News August 1, 2024

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: RS ప్రవీణ్

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాన‌ని BRS నాయ‌కులు RS ప్ర‌వీణ్ కుమార్ అన్నారు. దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఎన్నో పేద కులాలకు ఈ చరిత్రాత్మక తీర్పుతో ఇప్పుడైనా కొంత న్యాయం జరుగుతుందని ఆశిద్దామని ట్వీట్ చేశారు. ప్రభుత్వ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతున్న ఈ తరుణంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను ప్రవేశపెడితే పేద వర్గాల సంపూర్ణ అభివృద్ది సాధ్యమ‌వుతుంద‌న్నారు.

News August 1, 2024

రెండో మ్యాచ్‌లో పాలమూరు టీం సంచలన విజయం

image

HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ రెండో
మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు బుల్స్ క్లబ్(HYD) జట్టుపై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు, నేతలు అభినందించారు.
✒తొలి ఈనింగ్స్ – HYD-96/10(37.4ov),
MBNR-190/10(76.5ov)
✒సెకండ్ ఈనింగ్స్ – HYD-123/10(29.1ov),
MBNR-30/2(8.6ov)
>>CONGRATULATIONS❤