Mahbubnagar

News January 20, 2025

అచ్చంపేట: ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణం: మాజీ మంత్రి

image

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణమని ఇది ప్రజాపాలన కాదు ప్రజలను పీడించే పాలన అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు.

News January 20, 2025

NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్

image

బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.

News January 20, 2025

MBNR: ప్రజలు QR కోడ్ స్కాన్లను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

పోలీస్ సేవల పై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఏర్పాటు చేసినా QR కోడ్ స్కాన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ప్రజలకు సూచించారు. పోలీస్ సేవలగురించి తమ అభిప్రాయం తెలిపేందుకు QR కోడ్ స్టికర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, డీఎస్పీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయాలో అతికించామని తెలిపారు.

News January 20, 2025

MBNR: రైతు భరోసా వారికే: మంత్రి జూపల్లి

image

వ్యవసాయ యోగ్యమైన భూముల రైతులకే రైతు భరోసా లబ్ధి చేకూరుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం HYDలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకంలో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం అని చెప్పారు. గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

News January 19, 2025

మహబూబ్‌నగర్‌లో అసాంఘిక కార్యకలాపాలు?

image

మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో పట్టపగలే చీకటి పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాలో చుట్టూ బ్యానర్లు ఉండటంతో, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడుతున్నట్లు సోషల్‌మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఇలా బరితెగించారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని మహబూబ్‌నగర్ ప్రజలు కోరారు.

News January 19, 2025

MBNR: ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News January 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి సాగు
✔అయిజ:BRS కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక
✔అచ్చంపేట:మూడు కార్లు ఢీ.. ఒకరు మృతి
✔ఘనంగా Sr. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
✔ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
✔అచ్చంపేట:కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
✔NGKL: ఉమామహేశ్వర స్వామికి నంది వాహన సేవ
✔డ్రంక్ అండ్ డ్రైవ్..పోలీసుల తనిఖీలు
✔రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్ విడుదల
✔క్రీడా బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యేలు

News January 18, 2025

MBNR: ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

image

మహ్మదాబాద్ మండలం ధర్మాపూర్‌కు చెందిన పెద్దలు యువతి ప్రేమను కాదన్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. MBNRలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న గ్రామానికి చెందిన నవనీత(19) ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసి యువతి ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News January 18, 2025

MBNR: ఇంటర్ బోర్డు నిఘాలో ప్రయోగ పరీక్షలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే నెల 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తామని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.

News January 18, 2025

MBNR: ఇబ్బందులకు గురి చేసే అధికారులను ఉపేక్షించం: మంత్రి జూపల్లి

image

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఉపేక్షించబోమని మంత్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పెంట్లవెల్లికి వచ్చిన మంత్రికి రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.

error: Content is protected !!