India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే అన్ని జిల్లాల్లో దాదాపుగా పూర్తయినట్లేనని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో MBNR-2,09,514, NGKL-2,33,124, GWL-1,46,832, NRPT-1,48,780, WNP-1,42,075 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కార్యదర్శి ఇంటింటికీ సర్వే చేసి వివరాలను యాప్లో నమోదు చేశారు. కొందరి వివరాలు నమోదు కాకపోవడంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
✔పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం✔GDWL:పట్టుచీర ఆకారంలో సంక్రాంతి ముగ్గు✔Way2Newsతో ముచ్చటైన ముగ్గురు✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔NGKL:ఘనంగా బండలాగుడు పోటీలు✔ప్రారంభమైన ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు✔వీపనగండ్ల:పాము కాటుతో అత్త,కోడలు మృతి✔MBNR:’CRICKET జట్టు తమిళనాడు ప్రయాణం’✔26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ✔సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యేలు
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.❤️ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్.❤️ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ.❤️మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్.❤️మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్.❤️జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్.❤️జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.
నాగర్కర్నూల్ జిల్లా రంగాపూర్ సమీపంలోని ఉమామహేశ్వరుడి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఇలా..
✦ 15న నుంచి ప్రభోత్సవం, పల్లకీ సేవ
✦ 16న పార్వతీ పరమేశ్వరుల కల్యాణం,
✦ 18న కుంకుమార్చన, రుద్రాభిషేకం, హోమం
✦ 19న ధ్వజారోహణం, త్రిశూల స్నానం తదితర పూజలు
✦ 16 నుంచి 22 వరకు పాపనాశనం వద్ద ఉత్తరాయణ పుణ్యకాల స్నానాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి.
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వట్టెం నవోదయ ప్రిన్సిపల్ పి.భాస్కర్ తెలిపారు. వెబ్సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
హైదరాబాద్లో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దాహోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి రావాలి కోరుకున్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు, పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా బంధువులు, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలను వేసి, ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఓ వైపు ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేశారు. మరోవైపు చిన్నారులు గాలిపటాలు ఎగుర వేశారు. కొందరు స్నేహితులతో కలిసి కొత్త సినిమాలను వీక్షించారు.
Sorry, no posts matched your criteria.