India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో గండీడ్, కోస్గి, కొత్తకోట, ధన్వాడ, వెల్దండ, కోడేరు, ఖిలా ఘనపూర్, పెబ్బేరు మండలాల్లో ఆదర్శ పాఠశాలలో ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 6వ తరగతికి నేరుగా..7,8,9,10వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా నిధి పథకానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రూ.4,95,211ల చెక్కు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శనివారం సాయంత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ రుణం తీర్చుకునే ఆకాశం వచ్చిందని అన్నారు.
✓ విలువైన వస్తువులు, నగదు, నగలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది.✓ ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టకండి.✓ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైటు వేసి ఉంచండి.✓ నమ్మకమైన వ్యక్తిని వాచ్మెన్గా పెట్టుకోవడం మంచిది.✓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి.✓ ఇంటితాళం బయటకు కనిపించకుండా చూసుకోండి.✓ ఊరికి వెళ్లేముందు పోలీస్ స్టేషన్లో తెలపడం ఉత్తమం.
కురుమూర్తి స్వామి దేవాలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ చరిత్రలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన స్వామి వారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి <<15122838>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు, లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను MBNR, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
❤MBNR-2,62,311
❤కొడంగల్-2,46,526
❤జడ్చర్ల-2,24,477
❤దేవరకద్ర-2,40,980
❤నారాయణపేట-2,38,629
❤గద్వాల-2,58,460
❤వనపర్తి-2,75,059
❤మక్తల్-2,48,105
❤కొల్లాపూర్-2,41,460
❤షాద్ నగర్-2,43,260
❤కల్వకుర్తి-2,46,523
❤అచ్చంపేట-2,49,620
❤నాగర్ కర్నూల్-2,37,422
❤అలంపూర్-2,41,522
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 34,54,354 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 17,10,989, మహిళలు 17,43,276, ఇతరులు 89 మంది ఉన్నారు.
మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. బాలానగర్ మండల పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. పోలీసు సేవలపై అభిప్రాయాన్ని కోరుతూ.. క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్ షిప్ను చెల్లించాలని కోరారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని DSA స్టేడియం గ్రౌండ్లో నేటి నుంచి ఈ నెల 14 వరకు అండర్-17 హ్యాండ్ బాల్ జాతీయస్థాయి బాల, బాలికల ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SGF అధికారులు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 1550 మంది క్రీడాకారులు హాజరవుతుండగా.. బాలికలు-36, బాలురు-35 రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. ఉదయం,రాత్రి సమయాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.