Mahbubnagar

News July 28, 2024

MBNR: చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఘటన మహబుబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. డోకూరు గ్రామాని చెందిన రాఘవేందర్ స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఫిట్స్ రావడంతో చెరువులో మునిగి ఊపిరి ఆడక చనిపోయాడు. రాఘవేందర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News July 28, 2024

బాత్రూంలో ఉరేసుకొని బాలిక మృతి

image

బాత్రూంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. గౌరీదేవిపల్లికి చెందిన బాలయ్య పెద్ద కుమార్తె(17) ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ పూర్తిచేసింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా.. బాత్రూంలో ఉరివేసుకొని కనిపించింది. బాలిక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 28, 2024

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జూపల్లి

image

హైదారాబాద్లోని మీరాలం మండి శ్రీ మహాకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు జూపల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి జూపల్లి ఆకాక్షించారు.

News July 28, 2024

జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ.. ప్రస్థానం ఇదే

image

మాడ్గులలో జన్మించిన దివంగత జైపాల్‌రెడ్డి కల్వకుర్తి నుంచి 4సార్లు MLAగా పని చేశారు. 1984లో MBNR ఎంపీ(జనతా పార్టీ)గా లోక్‌సభకు వెళ్లారు. కాంగ్రెస్ నుంచి 1999, 2004, 09లో MPగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. దక్షిణాది నుంచే తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించారు. 2019లో చనిపోగా ఆయన వర్ధంతి రోజు జులై 28న కాంస్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

News July 28, 2024

MBNR: వడ్డీ లేని రుణం పేరుతో రూ.89 వేలు స్వాహా

image

సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ.10 లక్షలు రుణం ఇస్తామని ఆశ చూపి రూ.89వేలు కొట్టేసిన ఘటన అమరచింతలో చోటుచేసుకుంది. SI సురేశ్ వివరాల ప్రకారం.. అమరచింత వాసి వెంకటరమణ ఫేస్‌బుక్‌లో “సున్నా వడ్డీతో వ్యాపారానికి రూ.10 లక్షలు కావాలా?” ప్రకటన చూసి, వివరాలు నమోదు చెయ్యగా.. GST, రుణ ప్రాసెస్, ఇతర ఖర్చుల పేరుతో రూ.89 వేల వరకు కట్టించుకున్నారు. తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

News July 28, 2024

శుభకార్యాలకు RTC బస్సులు.. సద్వినియోగం చేసుకోండి

image

రానున్న శ్రావణమాసంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాలకు దృష్టిలో ఉంచుకొని డిపాజిట్ లేకుండా RTC బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు MBNR ఆర్టీసీ డిపోమేనేజర్ సుజాత తెలిపారు. ప్రైవేట్ వారితో పోలిస్తే అతి తక్కువ ధరతో ఆర్టీసీ హైర్ స్పెషల్ బస్సులను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. గతంలో డిపాజిట్ చేసిన తర్వాతనే బస్సు బుక్ చేసుకుని నిబంధనలను సడలించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు

News July 28, 2024

PU పరిధిలో 31 నుంచి ప్రయోగ పరీక్షలు

image

ఐదేళ్ల కోర్సు అయిన ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ) 4వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వహిస్తున్నట్లు పీయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి రాజ్ కుమార్ తెలిపారు. రెగ్యులర్తో పాటు బ్యాక్ లాక్ విద్యార్ధులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, 2022 బ్యాచ్ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌తో పాటు సెమినార్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News July 28, 2024

నారుమడుల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడండి !

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నారు మాడుల్లో వర్షపు నీరు ఉండకుండా చూడాలని పాలెం కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షపు నీరు అలాగే పొలంలో నిల్వ ఉండటం చేత అనేక సూక్ష్మజీవులు పెరిగి పంటను నాశనం చేస్తాయని, అందుకుగాను కురిసిన వర్షపు నీరు వెంటనే పంట పొలాల నుండి వెలికి తీయాలని రైతులకు తెలిపారు. పత్తి, కంది, పెసరు పంటలు అధిక నీరు వలన చనిపోతాయని నీరు నిలవకుండా చూడాలన్నారు.

News July 28, 2024

శ్రీశైలానికి నీటి మట్టం పెరుగుతుంది

image

శ్రీశైలం జలాశయంలో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతుంది. శనివారం సాయంత్రం వరకు 867.0 అడుగుల వద్ద 130.0724 టీఎంసీల నీరు నిల్వ కొనసాగుతోంది. జూరాల ఆనకట్ట గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ 3,09,885 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. అలాగే సుంకేసుల నుంచి 99,736క్యూసెక్కులు కలిపి మొత్తం 4,09,621క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. దీంతో వివిధ రూపాల్లో 18,480 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.

News July 28, 2024

MBNR: జూరాలకు పోటెత్తిన వరద.. 3.02 లక్షల క్యూసెక్కుల వరద

image

జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది శనివారం సాయంత్రానికి జలాశయంలోకి 3.02 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుంది జలాశయంలోకి ఇప్పటివరకు వచ్చిన వరద 125 టీఎంసీలకు చేరింది జలాశయం నుంచి దిగువకు 44 గేట్లు ఎత్తి 2.92 లక్షల క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 19 వేలు కలిపి 3.11 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. సోమవారం దాకా జూరాలకు వరద నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.