Mahbubnagar

News July 28, 2024

కల్వకుర్తికి సీఎం.. 157మందితో భారీ బందోబస్తు

image

వెల్దండ మండలం కొట్రతండాలో నేడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. CM పర్యటన సందర్భంగా వెల్దండ పోలీస్ సర్కిల్ పరిధిలో 157మందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రత ఏర్పాట్లను HYD రేంజ్ ఐజీ సత్యనారాయణ డివిజన్ అధికారులతో పరిశీలించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి మొదటిసారి కల్వకుర్తికి రానున్నారు. కల్వకుర్తిలో సభ ఏర్పాటు చేశారు. 

News July 28, 2024

NGKL: సంపులో పడి బాలుడి మృతి

image

నీటి సంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఖాజా, ఫాతిమా దంపతులు 2వ కొడుకు అమీర్(3)ను ఇంటి వద్ద ఉంచి శనివారం ఆస్పత్రికని జడ్చర్లకు వెళ్లారు. సాయంత్రం ఆడుకుంటూ బయటకు వచ్చిన ఆమీర్ ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడిపోయాడు. గుర్తించిన కుటుంబీకులు బయటకు తీసి NGKL ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

News July 28, 2024

కల్వకుర్తి: సీఎం రేవంత్ రెడ్డి హామీలపై ఆశలు..!

image

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈరోజు మొదటిసారి కల్వకుర్తికి వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెంచుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశలకు హద్దులు లేకుండా పోయింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భూములు కోల్పోయి నేటికి పైసలు రాని భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పర్యటనలో CM ఎలాంటి హామీలు ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News July 28, 2024

జడ్చర్ల: తమ్ముడు కనిపించడం లేదని అన్న ఫిర్యాదు

image

పెట్రోల్ తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కేసు నమోదైన ఘటన జడ్చర్ల మండలం ఆలూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు.. విజయ్ కుమార్(27) అనే వ్యక్తి ఆటో డ్రైవింగ్ చేస్తూ భార్య లావణ్యతో జడ్చర్లలో జీవనం సాగిస్తూ ఉండేవారని, బైక్‌కు పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తానని తెలిపి రాకపోవడంతో ఆమె బావ నరసింహకు తెలుపగా వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

News July 28, 2024

చాపకింద నీరులా డయాలసిస్: వైద్యులు

image

ఉమ్మడి జిల్లాలో చాలా మంది డయాలసిస్ వ్యాధి బారిన పడుతున్నారని, అందులో కొందరిని మాత్రమే గుర్తిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 327 మంది డయాలసిస్(రక్త శుద్ది) సేవలు పొందుతుంటే అందులో MBNR:09, WNPT:16, GDWL :23, NRPT:8, NGKL:12 మంది చొప్పున మొత్తం 68 మంది హెపటైటిస్ బాధితులే కావటం గమనార్హం. ఈ వ్యాధి ఎయిడ్స్ కంటే డేంజర్ అని వైద్యులు శనివారం తెలిపారు.

News July 28, 2024

విద్యుత్ కనెక్షన్లు.. MBNRలో హై.. NGKLలో LOW

image

గృహ విద్యుత్ కసెక్షన్లలో ఉమ్మడి జిల్లాలోనే మహబూబ్‌నగర్ టాప్‌లో ఉంది. జిల్లాలో అత్యధికంగా 89.2% గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 18% వ్యవసాయ కనేక్షన్లు, 12.8% మేరకు ఇండస్ట్రియల్ కనేక్షన్లు ఉన్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక-2024 వెల్లడించింది. ఇక రాష్ట్రంలోనే అతి తక్కువగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కేవలం 57.7% విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 31.8% వ్యవసాయ, 10.4% ఇండస్ట్రియల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.

News July 27, 2024

MBNR:ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

♥పాలమూరోళ్లం KCRకు ఏం అన్యాయం చేశాం:సీఎం
♥జూరాల జలాశయం 36 గేట్లు ఎత్తివేత
♥తెలకపల్లి: ఒకే ఊరిలో ఇద్దరు ఆత్మహత్య
♥గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది:MLC నవీన్ కుమార్ రెడ్డి
♥నిండుకుండలా శ్రీశైలం జలాశయం
♥GDWL:DMHOగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సిద్దప్ప
♥సుంకేసుల జలాశయం 20 గేట్ల ఎత్తివేత
♥రైతు బీమా దరఖాస్తు చేసుకోండి:AEOలు
♥కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలు
♥వన మహోత్సవం పై ప్రత్యేక ఫోకస్

News July 27, 2024

వనపర్తి: హత్య నేరంలో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష!

image

భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ వనపర్తి ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి సునీత తీర్పు వెలువరించారని ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఎస్పీ వివరాలు.. రేవల్లికి చెందిన వెంకటయ్య, నిర్మలమ్మ భార్యభర్తలు NGKLలో పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అతడు భార్యను డబ్బులు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోవడంతో మద్యం మత్తులో భార్యను గడ్డపారతో పొడిచారని తెలిపారు.

News July 27, 2024

MBNR: గౌరవ వేతనం ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది: ఎమ్మెల్సీ

image

ఎమ్మెల్సీలకు గౌరవ వేతనం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం శాసనమండలిలో ఆయన పలు సమస్యలను ఏకరువు పెట్టారు. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును వచ్చే నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు కూడా అందించాలని సభలో పేర్కొన్నారు.

News July 27, 2024

ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడి.. MBNRకు పదో స్థానం

image

జీడీడీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు జిల్లాలు వెనకంజలో ఉన్నట్టు తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే- 2024 వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లా 28,960 కోట్ల జీడీపీపీ విలువతో పదో స్థానంలో ఉంది. NGKL జిల్లా 19, గద్వాల్ జిల్లా 26, వనపర్తి జిల్లా 27, NRPT జిల్లా 30వ స్థానంలో నిలిచాయి. ‘ఉపాధి హామీ’ తప్ప ఇతర రంగాల్లో తలసరి ఆదాయంలో పాలమూరు జిల్లాలు అట్టడుగున ఉన్నాయి.