India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
యువతిపై అత్యాచార ఘటన MBNRలో చోటుచేసుకుంది. సీఐ ఇజాజుద్దీన్ వివరాల మేరకు.. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31 వేడుకల్లో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు అందులో పేర్కొంది. యువతి ఇరవై రోజుల కిందట విధుల్లో చేరినట్లు తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.
డిస్టిక్ ఎక్స్ పోర్ట్ యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ శైలజ హైద్రాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి ఇతర దేశాలకు వరి, పత్తి, చేనేత వస్త్రాలు ఎక్స్ పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వచ్చేనెల జరిగే ప్రయోగ పరీక్షల నిర్వహణకు ప్రతి కళాశాలకు రూ.25 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో రసాయనాలు, పరికరాలను కొనుగోలు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.12 వేల చొప్పున కళాశాలకు కేటాయించారు. ప్రయోగ పరీక్షలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
నారాయణపేట మండలం పెరపళ్లకి చెందిన <<15077017>>బాలుడు<<>> ఆంజనేయులు(15) ఉరేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బుగ్గమ్మ దంపతుల పెద్దకొడుకు ఆంజనేయులు 7వ తరగతి వరకు చదివి పొలం పనులు చేస్తూ, గొర్రెలు కాస్తున్నాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం శాసన్పల్లి శివారులో చెట్టుకు ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,43,276 మంది మహిళలు, 17,10.989 మంది పురుషులు ఉండగా ఇతరులు 89 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం 13,404 మంది ఓటర్లు పెరగటం గమనార్హం.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ ఈనెల 16 వరకు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ ఫీజు చెల్లించని మొదటి, ద్వితీయ సంవత్సరం, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు.
Sorry, no posts matched your criteria.