Mahbubnagar

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి 

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్రూంలో మొబైల్ ఫోన్ ఘటనపై మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థినులను కలిసి వారితో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్‌కు  సూచించారు.

News January 5, 2025

వడ్డేమాన్‌లో విషాదం.. సంపులో పడి యువరైతు మృతి

image

బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రైతు గుంటి బంగారయ్య (38) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. రోజువారీగా పొలం దగ్గర ఉన్న సంపులో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లగా మోటారు నడవలేదు. దీంతో ఆ మోటారును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి సంపులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2025

NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ

image

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా HYD ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆసుపత్రికి చేరుకొని మంద జగన్నాథంను పరామర్శించారు. అనంతరం ఆయన కుమారుడు మంద శ్రీనాథ్‌ను మంత్రి పలకరించి మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్‌ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News January 5, 2025

షాద్‌నగర్: మద్యం అమ్మితే.. రూ.50 వేల జరిమానా

image

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం చించోడ్ గ్రామస్థులు శనివారం ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, మద్యం కొంటే రూ.25 వేలు, పేకాట ఆడితే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

News January 5, 2025

MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్‌ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News January 5, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
✔MBNR: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు..నిందితుడి పై కేసు నమోదు
✔కార్మికులపై అణచివేత విధానాలు మానుకోవాలి:CITU
✔జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి సామర్థ్యం
✔’Way2News’తో శ్రీరంగాపూర్ గ్రామ సెక్రెటరీ
✔PU క్రీడాకారులు ప్రతిభ కనబరచాలి: వీసీ
✔కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
✔CMRF చెక్కుల పంపిణీ
✔పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యేలు

News January 5, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో వార్తలు ఇవే.. డోంట్ మిస్

image

❤️పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీ భవనాల నిర్మాణం చేపట్టండి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి.❤️తెలంగాణ హైకోర్టు విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ నోటిఫికేషన్‌లో తీవ్ర అన్యాయం: మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సహదేవుడు.❤️డిండి లిఫ్ట్ నుంచి రోజుకు నుంచి టీఎంసీలు నీటిని తరలించడం తగదు: మాజీ మంత్రి నాగం ❤️పెద్దమందడి చెందిన పెంటయ్య(52) ఏపీలో అనంతపురంలో రైలు ఢీ, మృతి

News January 5, 2025

MBNR: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో మందకృష్ణ భేటీ

image

BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో MRPS అధినేత మందకృష్ణ మాదిగ HYDలోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న వేల గొంతులు.. లక్షల డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు పాత్ర పోషించాలని ఆర్ఎస్పీని మందకృష్ణ కోరారు. అందుకు ఆర్ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మార్పీఎస్ వర్గాలు తెలిపారు.

News January 4, 2025

గద్వాల: తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న డిస్కో శాంతి 

image

గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దివంగత నటుడు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు దేవాలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు స్వామివారి శేష వస్త్రం, చరిత్ర పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా దేవాలయ అన్నదానానికి రూ.5,016 అందించారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖరరావు, కేశవర్ధన్ రెడ్డి ఉన్నారు.

error: Content is protected !!