India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ పేర్కొన్నారు. స్పీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జపానీ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించి పత్తి పంటను పరిశీలించారు. సేంద్రియ సాగు ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. గతంలో ఆవు పేడ మూత్రంతో పైర్లలో స్ప్రే చేసి అధిక దిగుబడితోపాటు రసాయనాలు లేని పంటలు పండించారని ఆయన చెప్పారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేక పోతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు సర్వీస్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడించారు.
నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన రైతు సింగారపు స్వామి(33) ట్రాక్టర్తో తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరువుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మొగల్ మట్కాలో 3.0 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 1.8 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 0.8 మి.మీ, గద్వాల జిల్లా అలవలపాడులో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వివరాలు ఇలా(కోట్లలో).. ✒పాలమూరు-రంగారెడ్డి:రూ.1,285 ✒కల్వకుర్తి: రూ.715 ✒జూరాల-పాకాల కాలువ: రూ.0.15 ✒భీమా జూరాల-పాకాల: రూ.32 ✒జూరాల రాజీవ్:రూ.8 ✒నెట్టెంపాడు: రూ.105 ✒ఆర్డీఎస్: రూ.29.50 ✒సంగంబండ: రూ.188.07 ✒కోయిలసాగర్: రూ.429.86 కోట్లు కేటాయించారు.
పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన కౌశిక్(21) బీఎస్సీ చదువుతున్నాడు. మొదటి సం.లో ఫెయిల్ కావడంతో మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మహబూబ్ నగర్లో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ రాత పరీక్షకు 665 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష లకు 728 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 63 మంది హాజరుకాలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఏర్పాటు చేసిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొడంగల్లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలకు రూ.6.50 కోట్లను కేటాయించారు. పరిశోధన- అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల చొప్పున్న రూ. 603.76 కోట్లు ప్రతిపాదించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో.. రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం అధికారులు గురువారం ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కానప్పటికీ, రెండు గేట్ల ద్వారా దిగువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లుగా జేఈ రాజు తెలిపారు. డ్యాం మొత్తం నీటిమట్టం 292.00 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 290.90 మీటర్లుగా నమోదైనట్లుగా ఆయన పేర్కొన్నారు.
మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పని చేస్తున్న బాలరాజు ఏసీబీకి చిక్కాడు. గురువారం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మక్తల్కు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం అడిగాడు. దీంతో శ్రవణ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నేడు సర్వేయర్ రూ.9వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.