India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసలే గ్రామీణ ప్రాంతాలు.. అంతంతే వైద్య సేవలు. దీనినే పెట్టుబడిగా పెట్టుకుని పాలమూరులో కొందరు నకిలీ RMPలు చెలరేగిపోతున్నారు. చదివింది చారెడు.. చికిత్సలు బారెడు అనేలా.. వచ్చీరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై DMHO కృష్ణ వివరణ కోరగా.. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి భరత్ గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. భరత్ ప్రస్తుతం అచ్చంపేట రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు కృష్ణ మనోహర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కృష్ణ మనోహర్ గౌడ్ చేసిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించినట్లు నరేందర్ గౌడ్ వెల్లడించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందు గురువారం ఇన్ఫ్లోనిలిచిపోయింది. దీనితో వచ్చే జూన్ వరకు వర్షాలు లేకపోవడంతో తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నిల్వ 4.091 టీఎంసీలు, ఆవిరి ద్వారా 29 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500, మొత్తం అవుట్ స్లో 342 క్యూసెక్కులు వెళ్తున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ వెంకటేశ్వరరావు వివరించారు.
మహబూబ్ నగర్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలకు వ్యాప్తంగా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 441 గ్రామ పంచాయతీల్లో 3,836 వార్డులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఓటర్లు మొత్తం 5,27,302 మంది ఉన్నారు.
నారాయణపేటలో దారుణం జరిగింది. తన ఇంటిపై అద్దెకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న చిన్నారికి మాయమాటలు చెప్పి యజమాని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక బిగ్గరగా కేకలు వేయండంతో కుటుంబ సభ్యులు గమనించి, చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి 31వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్ లిక్కర్ విక్రయాలున్నాయి. దీంతో అబ్కారీశాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఈ న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో Dec 31న MBNRలో 93, WNPలో 55, GWLలో 31, NRPTలో 22, NGKLలో 6 కేసులు నమోదు చేశారు.
✔సీఎంను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు,నేతలు✔న్యూ ఇయర్.. దైవ దర్శనం కోసం క్యూ✔గద్వాల: ‘సమగ్ర శిక్షా ‘సమగ్ర రెగ్యులరైజ్ చేయాలి’:BRS✔హమాలీల సమస్యలను చేయాలి’:BRS జల విద్యుత్ కేంద్రం జనరేటర్లో నీరు లీక్✔ఎస్ఎస్ఎ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: ఎంపీ డీకే అరుణ✔ఇటిక్యాల: వేప చెట్టు నుంచి కల్లు✔NRPT:రెండు బైకులు ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి నీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు గాను ప్రస్తుతం 4.207 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ఫ్లో 28 క్యూసెక్కులు రాగా.. ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బుధవారం HYD ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ప్రతినిధి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.