India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా గురుకుల సెంటర్లల్లో ఈనెల 26న బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024 మార్చిలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
SHARE IT..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు వర్షపాతం తగ్గుతూ వస్తోంది. గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మొహ్మదాబాద్ లో 5.0 మి.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 2.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండలో 2.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 317 జీవోపై అప్పీల్ చేసుకున్న ఉపాధ్యాయులు నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. NGKL566 మంది, నారాయణపేటలో 319, వనపర్తిలో 220, గద్వాలలో 179, మహబూబ్ నగర్ జిల్లాలో అతి తక్కువగా 118 మంది ఉపాధ్యాయులు అప్పీల్ చేసుకున్నారు. ప్రభుత్వం వారి అభ్యర్ధనను ఆమోదిస్తే సొంత జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశముంది. ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,215 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుద్ధముక్క, విద్యార్థుల హాజరు పుస్తకాలు, రిజిస్టర్లు, చీపుర్లు, మరుగుదొడ్ల క్లీనింగ్ రసాయనాలు, ప్రయోగశాల సామాగ్రి వంటి తదితర సామాగ్రి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో HM ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ఖర్చులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేట DEO అబ్దుల్ ఘని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెడుతోంది. ఈ పద్దుపై ఉమ్మడి పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు, విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని టాక్. సీఎం సొంత జిల్లా కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలున్నాయి.
జీఓ 317లో ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత, మెడికల్, స్పౌజ్ అంశాలలో అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1402 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా, అత్యధికంగా NGKL జిల్లాలో 566 టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అప్పిలేట్ చేసుకున్న దరఖాస్తులను విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు డిఇఓ రవీందర్ వెల్లడించారు.
జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో బుధవారం 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు జెన్కో ఎస్ఈలు రామసుబ్బారెడ్డి, సురేష్ అన్నారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగా వాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 43.852 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు పాఠశాల, కళాశాల యాజమాన్యాలు బస్సుల ఫీట్ నెస్ నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 173 విద్యాసంస్థల బస్సులకు ఫీట్ నెస్ పరీక్షలు చేయించలేదు. 1,339 బస్సులు ఉండగా వీటిలో 1,166 బస్సులకు యాజమాన్యాలు ఫీట్ నెస్ చేయించారు. మిగతా 173 సామర్థ్యం లేని బస్సులు తిరుగుతున్నాయి. ఫిట్ నెస్ లేని బస్సులను సీజ్ చేస్తున్నామని, ఇప్పటికే నోటీసులు ఇచ్చామని రవాణా అధికారి రవి అన్నారు.
చికిత్స పొందుతూ దంపతులు మృతిచెందిన ఘటన గోపాల్పేట మండలంలో జరిగింది. మున్ననూరుకు చెందిన దంపతులు వెంకటయ్య(55), చిట్టెమ్మ దంపతులు ఈనెల18న జరిగిన వంట గ్యాస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. HYDలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం భర్త చనిపోగా బుధవారం ఉదయం భార్య ప్రాణాలొదిలారు. దంపతులను పక్కపక్కనే ఖననం చేశారు. ఏడడుగులు వేసిన వారు ఖనానికి కలిసి వెళ్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.
Sorry, no posts matched your criteria.