Mahbubnagar

News July 25, 2024

WNP: సిలిండర్ ప్రమాదం.. చికిత్స పొందుతూ దంపతుల మృతి

image

చికిత్స పొందుతూ దంపతులు మృతిచెందిన ఘటన  గోపాల్‌పేట మండలంలో జరిగింది. మున్ననూరుకు చెందిన దంపతులు వెంకటయ్య(55), చిట్టెమ్మ దంపతులు ఈనెల18న జరిగిన వంట గ్యాస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. HYDలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం భర్త చనిపోగా బుధవారం ఉదయం భార్య ప్రాణాలొదిలారు. దంపతులను పక్కపక్కనే ఖననం చేశారు. ఏడడుగులు వేసిన వారు ఖనానికి కలిసి వెళ్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.

News July 25, 2024

NRPT: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ఎస్పీ

image

పోలీస్ అధికారులు నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వారీగా పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. బాధితులు అందించే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని, బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.

News July 24, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి “TOP NEWS”

image

✓జూరాలకు పెరిగిన వరద 41 గేట్లు ఎత్తివేత.
✓ జాతీయ స్థాయి వికసిత్ భారత్ పోటీల్లో పాలమూరు యునివర్సిటీ విద్యార్థిని సత్తా.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.
✓ కొల్లాపూర్:KLI మోటార్లను ప్రారంభించిన మంత్రి జూపల్లి.
✓ నేరాల నియంత్రణపై దృష్టి సాధించాలి నారాయణపేట ఎస్పీ.
✓బొంరాస్ పేటలో పర్యటించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసరు వర్షం.

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

MBNR: ఒక్క మెసేజ్‌.. కొంప ముంచింది..!

image

కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏపీకే పేరుపై లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయడంతో అతడి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు. ఖాతాలో ఉన్న రూ.2.44 లక్షలతో వస్తువులను కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసి ఖంగుతిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెబ్బేరుకు చెందిన ఓ వ్యక్తికి అమ్మాయి పేరుతో మెసేజ్ చేసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి రూ. 4 లక్షలు వసూలు చేశారు.

News July 24, 2024

MBNR: ఒక్క మెసేజ్‌.. కొంప ముంచింది..!

image

కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏపీకే పేరుపై లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేయడంతో అతడి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారు. ఖాతాలో ఉన్న రూ.2.44 లక్షలతో వస్తువులను కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసి ఖంగుతిన్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెబ్బేరుకు చెందిన ఓ వ్యక్తికి అమ్మాయి పేరుతో మెసేజ్ చేసి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి రూ. 4 లక్షలు వసూలు చేశారు.

News July 24, 2024

జాతీయస్థాయి వికసిత్ భారత్ పోటీల్లో PU విద్యార్థిని సత్తా

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని కొండ ప్రణవి ప్రతిభ చూపించారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

News July 24, 2024

ప్రధాని హామీ ఇచ్చినా.. పాలమూరుకు మొండి చెయ్యి

image

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండి చేయి చూపింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించారు. జాతీయ హోదా సంగతి అటుంచితే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు ఇవ్వడం లేదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం పాలమూరుకు మాత్రం ఏమాత్రం కేటాయించలేదు.

News July 24, 2024

కొల్లాపూర్: నీట మునిగిన శ్రీ సంగమేశ్వరం

image

కొల్లాపూర్ తీరానికి సమీపంలోని సోమశిలలో సప్త నదుల ప్రాంతం శ్రీ సంగమేశ్వర క్షేత్రం చుట్టూ కృష్ణా నది వరదతో ఆలయంలోని వేపదారు శివలింగం నీట మునిగింది. జటప్రోల్లో పురాతన దర్గా, సురభి రాజుల భవనం చుట్టూ వరదలాలు ప్రవహించాయి. మత్స్యకారులు తీరం వెంబడి ఏర్పరచుకున్న తాత్కాలిక నివాసాలను ఎగువ ప్రాంతానికి తరలించారు. పుష్కర ఘాట్లకు వరద వచ్చి చేరింది. 842 అడుగులకు పైగా వరద జలాలు శ్రీశైలం వైపు ప్రవహిస్తున్నాయి.