India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు పోలీసులు, సెక్షన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 15 పెండింగ్ కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందాల్సి ఉందని డిఎస్పీ లింగయ్య తెలిపారు.
✔మన్మోహన్ సింగ్కు ఎమ్మెల్యేల నివాళులు✔రేపు సెమిస్..MBNR❌ సెమిస్..MBNR❌ ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔నల్లమల సఫారీలో పెద్దపులి✔నేటి నుంచి APGVB సేవలు బంద్✔రేపు పలు గ్రామాల్లో కరెంట్ బంద్✔వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా✔కల్వకుర్తి:పచ్చ జొన్నల పేరుతో మోసం✔వనపర్తి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం డిమాండ్✔దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు:NRPT డీఎస్పీ
భారత మాజీప్రధాని మన్మోహన్ సింగ్కు శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. MBNRలోని మూఢ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మూడ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంట్లో రెండో రోజు మహబూబ్నగర్ జిల్లా హాకీ జట్టు సెమీఫైనల్కి చేరింది. రెండవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్లతో క్రీడాకారులు అత్యున్నత మైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించి సెమీ ఫైనల్స్కి అర్హత సాధించారు. రేపు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల జట్లు సెమీఫైనల్లో పోటీ పడతాయని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు. ఈ బ్యాంకుకు ఉమ్మడి పాలమూరులో 85 బ్రాంచ్లు ఉన్నాయి.
‘సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్& సర్వీసింగ్లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. MBNR, NGKL, GDWL, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిక్షణ మహబూబ్ నగర్ లోని బండమీదిపల్లి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో ఉంటుందన్నారు.
ఓ మహిళ ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన ఘటన నవాబుపేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈనెల 25న శబరిమల వెళ్లారు. భార్య అనిత ఈనెల 26న రాత్రి ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో అత్తామామలకు చెప్పకుండా, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. భర్త శబరిమల నుంచి తిరిగి వచ్చి స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాలమూరు జిల్లా కాంగ్రెస్కు 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు 12 చోట్ల గెలవడంతోపాటు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. జిల్లాకు సీఎం, మంత్రి పదవితోపాటు దక్కడంతో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS అల్లంపూర్, గద్వాలలో గెలవగా ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు.
✔మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన సీఎం, ఉమ్మడి జిల్లా నేతలు✔అభివృద్ధికి సహకరించండి: బండి సంజయ్✔ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు✔REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్✔కార్మికుల హామీలు నెరవేర్చాలి:CITU✔జోగులాంబ అమ్మవారి సేవలో హీరో ఆకాశ్✔కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే✔GREAT:రగ్బీ రాష్ట్ర జట్టుకు కోస్గి విద్యార్థి✔GWDL:Way2Newsతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆవేదన
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిలో రాష్ట్రానికి చెందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.