India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఫీల్డ్ ఆఫీసరుగా డీడీ. లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని జిల్లా ఇంటర్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్దిష్ట పరిశీలన, సూచనలతో కూడిన నివేదికను రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
జిల్లాలోని యువత నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ సెంటర్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. MBNR లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ సెంటర్ను సోమవారం అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు దిగ్గజ సంస్థలలో ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన నైపుణ్యాలు కల్పించడం, ఆంగ్లంలో మాట్లాడడం, మౌఖిక పరీక్షలు ఎదుర్కొనేల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయాన్నే స్నానాలు చేసి బడికి వెళ్లే విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గత 24 గంటలలో గద్వాల జిల్లా ఇటిక్యాల మం. సాతర్ల గ్రామంలో 18.0, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మం. కేంద్రంలో 15.7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం. తోటపల్లి 16.7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18.1డిగ్రీల కనిష్ఠ నమోదయ్యాయి.
పాలమూరు జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై పాలమూరులోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 16 మండలాలు ఉన్నాయి. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 3,836 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ.. ఓటు వేసేందుకు ఇబ్బందులు లేకుండా గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా
సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్ (APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. MBNR-24,NGKL-26,WNPT-11,GDWL-11,NRPT-13 బ్రాంచ్లు ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని, ఏవైనా సమస్యలు ఉంటే సమీపంలో ఉన్న బ్రాంచ్ను సంప్రదించాలన్నారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.
NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.