India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MBNR:ZP మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రథమంగా పాలమూరు ఎంపీ డికె.అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.PMFME, విశ్వకర్మ పథకం, NREGS కింద గొర్రెలు, కోళ్ల పెంపకం, డైరీ ఫామ్స్(ఫిషరీస్) మత్స్య శాఖలో ప్రోత్సాహకాలు, టెక్స్టైల్స్, ట్రైబల్ వెల్ఫేర్, PMFME పథకాల అమలు తీరు వాటి మార్గదర్శకాలను సంబంధిత అధికారులు వివరించారు. ఎమ్మేల్యే యెన్నం, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MBNR జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ సురేంద్ర మెహన్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి, ఎస్పీ జానకిలతో కలసి కలేక్టరేట్లోని సమావేశమయ్యారు. పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య, అర్అండ్బి శాఖలతో ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

“లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం” సమాచారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ కేటాయించినట్టు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బుధవారం వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపు కోసం ఈనెల 31 వరకు 25% రాయితీకి అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542- 241165, మున్సిపాలిటీ హెల్ప్ లైన్ నంబర్ 7093911352కు సంప్రదించాలన్నారు.

బుధవారం పాలమూరు వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్. శ్రీనివాస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప చేతుల మీదుగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 పోస్టర్ అవిస్కరించారు. ఈనెల నెల 9లోగా 18 నుండి 25ఏళ్లులోపు విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మై భారత్ పోర్టల్ పోర్టల్లో నమోదు చేసుకొని ఒక్క నిమిషం వీడియోను పంపాలన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం పీజీ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్పతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, జవాబు పత్రంలో బార్ కోడ్పై వివరాలను స్పష్టంగా రాయాలన్నారు.

శిశు గృహ చిన్నారులను ఆహ్లాదకర వాతావరణంలో పెంచాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. బుధవారం స్టేట్ హోమ్ ఆవరణలోని శిశు గృహాన్ని ఆమె సందర్శించి, చిన్నారుల కోసం వేస్తున్న పెయింటింగ్ నూతనంగా నిర్మిస్తున్న పార్కు ఆట వస్తువులను పరిశీలించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసేది వారికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. అదేవిధంగా పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలన్నారు.

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్పీ విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

దుందుభీనదిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. బాలానగర్ మం. గుండేడ్కి చెందిన లక్ష్మి(38)కి 17ఏళ్లక్రితం గంట్లవెల్లికి చెందిన లింగమయ్యతో వివాహమయ్యింది. పెళ్లప్పుడు రూ.1.50లక్షలు,4తులాల బంగారం,బైక్ కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత భర్త అదనపుకట్నానికి వేధించసాగాడు. దీంతో లక్ష్మి పుట్టింటికి రాగా.. భర్త ఇక్కడికొచ్చి గొడవచేయటంతో మనస్తాపానికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.