India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారంలేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. విపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కిందిస్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.
మహిళా సమాఖ్య, రైతులు, స్థానిక ప్రజల సమస్యలపై మంత్రి జూపల్లి చర్చించారు. వీపనగండ్ల మండలంలోని వివిధ అంశాలపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అవినీతికి తావు లేదనే సందేశం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వెళ్లాలన్నారు.
విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని OSD మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలోని ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మొదటి సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నాలుగవ సెమిస్టర్ లో మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగం చేయాలని, అదే అధ్యాపకులకు ఇచ్చే గురుదక్షిణ అని అన్నారు. ప్రిన్సిపల్ చంద్ర కిరణ్, అధ్యాపకులు పాల్గొన్నారు.
అలంపూర్ ఆలయాలకు పూజ, కిరాణా తదితర సామాగ్రి ఏడాది పాటు సరఫరా చేసేందుకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సీల్డ్ టెండర్లు జరిగాయి. ఇందులో వివిధ ప్రాంతాల ఏజెన్సీలు పాల్గొని టెండర్లు దక్కించుకున్నాయి. కరపత్రాల ప్రింటింగ్, లడ్డు, పులిహోర కవర్లు, క్యారీ బ్యాగులు ప్రైవేట్ సెక్యూరిటీకి టెండర్లు నిర్వహించగా MBNR, HYD ప్రాంతాల ఏజెన్సీలు దక్కించుకున్నాయని మహబూబ్ నగర్ దేవాదాయశాఖ సహాయ కమీషనర్ శ్రీనివాసరాజు తెలిపారు.
ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి అన్నారు. శుక్రవారం మాగనూర్ మండలం మందిపల్లిలో పాఠశాలను అదనపు కలెక్టర్ మయంక్ మిట్టల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. 180 మంది విద్యార్థులకు కేవలం ఒక్కరే టీచర్ ఉన్నారని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బధావత్ సంతోష్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారి డాక్టర్ శివకుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుండటంతో సైబర్ మోసాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డీఎస్పీ లింగయ్య శుక్రవారం అన్నారు. సైబర్ కేటుగాళ్లు బ్యాంకుల ఫోటోతో వాట్సాప్లో APK ఫైల్స్ పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే అనవసర లింకులు ఓపెన్ చేయవద్దని చెప్పారు. సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి నివృత్తి చేసుకోవాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
మహబూబ్నగర్ భూత్పూర్ మండలం ఎల్కిచర్ల శివారులో చిరుతపులి 3 పశువులను బలితీసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పాదముద్రికలను పరిశీలించిన అధికారులు చిరుతపులిగా గుర్తించారు. చిరుత సంచారంతో భుట్టుపల్లి, ఎల్కిచర్ల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూరులో 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 21.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 20.0 మి.మీ, వనపర్తి జిల్లా దగడలో 15.0 మి.మీ, గద్వాల జిల్లా భీమవరంలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
☞కొడంగల్:17,975 <<13659589>>రైతులకు <<>>99.84 కోట్లు☞అచ్చంపేట:15.990 రైతులకు 92.44 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 82.81 కోట్లు☞వనపర్తి:16,071 రైతులకు 83.84 కోట్లు☞దేవరకద్ర:16,621 రైతులకు 87.94 కోట్లు☞కొల్లాపూర్:16,982 రైతులకు 91.58 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యాయి. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి స్థానంలో కల్వకుర్తి, మహబూబ్ నగర్ నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది. – SHARE IT
Sorry, no posts matched your criteria.