Mahbubnagar

News December 18, 2024

కోడంగల్‌లో BRS శ్రేణుల సంబరాలు

image

లగచర్ల ఘటనలో అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రైతులకు బుధవారం HYD నాంపల్లి కోర్టు మెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ నాయకుడు నరేందర్ రెడ్డి, రైతులకు అండగా నిలిచిన హరీష్ రావు, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 18, 2024

మిడ్జిల్: పెట్రోల్ పోసుకొని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. ఎస్ఐ శివ నాగేశ్వర్ నాయుడు వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక (17)జడ్చర్లలో ఇంటర్ చదువుతోంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. చికిత్స పొందుతూ మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

News December 18, 2024

MBNR: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

image

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అనసూయ భర్త నుంచి విడిపోయి కొడుకుతో జీవనం సాగిస్తోంది. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందారు. ఆ రోజు నుంచి మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తమ్ముడు వెంకటరమణ ఫిర్యాదు చేశారు.

News December 17, 2024

MBNR: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

image

ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. MBNRలో 20,584 మందికి 54 కేంద్రాలు, NGKLలో 9,731 మందికి 32 , గద్వాలలో 8,722 మందికి 25, WNPలో 8,569 మందికి 31 కేంద్రాల్లో NRPTలో 3,994 మందికి 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలువురు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. పోలీసుసు పటిష్ఠ బందోబస్తు నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికాలులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.

News December 17, 2024

గ్రూప్-2లో మన పాలమూరుపై ప్రశ్నలు

image

TGPSC నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో పాలమూరు జిల్లాపై ప్రశ్నలు వచ్చాయి. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యులు, గంగాపూర్, మన్యంకొండ, పిల్లలమర్రి దేవాలయాలు, సురవరం ప్రతాపరెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, గోరేటి వెంకన్న, కిన్నెర మొగులయ్య, నాగం జనార్దన్ రెడ్డి స్థాపించిన తెలంగాణ నగారా సమితిపై పలు ప్రశ్నలు వచ్చాయి. తమ ప్రాంతం నుంచి ప్రశ్నలు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 17, 2024

MBNR: గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతం: కలెక్టర్

image

జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఇవాళ ఆమె సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలను కల్పించినట్లు ఆమె తెలిపారు.

News December 16, 2024

ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

image

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు అనేది తెలియదని, శ్రీహరికి మంత్రి పదవి రావడం మాత్రం ఖాయమని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News December 16, 2024

NGKL: రైతులకు అందుబాటులో వరి విత్తనాలు

image

నాగర్‌కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో వరి విత్తనాలు ఉన్నాయని విత్తన సరఫరా విభాగం అధికారులు రామకృష్ణ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. RNR 15048 రకం అందుబాటులో ఉన్నాయని, 20 కేజీల ప్యాకెట్ ధర రూ.1060 అందజేస్తున్నట్లు తెలిపారు. కావలసిన రైతులు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు.

News December 16, 2024

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. జూబ్లీహిల్స్‌లో భరణి లేఅవుట్‌లో ఆయన ఇంట్లో రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులకు జైపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 16, 2024

MBNR: నేడే చివరి తేదీ.. APPLY చేసుకోండి

image

విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. నేడు(సోమవారం) ఫైన్‌తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఆయా పాఠశాలల అధికారులు తెలిపారు.

error: Content is protected !!