India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✔క్రికెట్:ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరిన PU జట్టు
✔బిజినేపల్లి:కల్లు సీసాలో పాము కలకలం
✔పంచాయతీ పోరు..బ్యాలెట్ పత్రాలు సిద్ధం
✔ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న చలి
✔వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష.. పాల్గొన్న MLAలు,వైద్యాధికారులు
✔గద్వాల:గొర్రెలను ఢీకొట్టిన లారీ..2 గొర్రెలు మృతి
✔బడి బయటి విద్యార్థులకు గుర్తింపు సర్వే
✔బొంరాస్ పేట:రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
✔రేపు జవహర్ నవోదయ పరీక్ష
✔ఢిల్లీ పీఠం మాదే:DK అరుణ
శ్రీశైలం ఉత్తర ద్వారం, నల్లమల కొండల్లోని శైవ క్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి.
చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో సౌత్ జోన్ టోర్నీలో పాలమూరు యూనివర్సిటీ జట్టు శుక్రవారం నిర్వహించిన రెండు మ్యాచ్లో సంచలన విజయం సాధించింది. 3వ మ్యాచ్ కలసలింగమ్ అకాడమీ ఆఫ్ రిసెర్స్& ఎడ్యుకేషనల్ యూనివర్సిటిపై 15 పరుగులతో, 4వ మ్యాచ్లో డా.MGR ఎడ్యుకేషనల్&రిసెర్చ్ ఇనిస్ట్యూట్(TN) పై 103 పరుగులతో ఘన విజయం సాధించి ఫ్రీ క్వార్టర్స్ ఫైనల్కు చేరింది. దీంతో పలువురు అభినందించారు. >>CONGRATULATIONS❤
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులకు గులాబి.. వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. MBNR-441 GPలో 3,836 వార్డులు, NGKL-464 GPలో-4,140 వార్డులు, NRPT-280 GPలో 2,455 వార్డులు, WNPT-260 GPలో-2,366 వార్డులు, GDWL-255 GPలో 2,390 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది.
జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్, పరిశీలకులకు బిజినేపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 సీట్లకుగాను ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 6,602 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈనెల18న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.
నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ బాదావత్ సంతోష్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాముకాటుతో అత్తాకోడళ్లు మృతిచెందారు. ఈ ఘటన వరపర్తి జిల్లా వీపనగండ్లలోని వల్లభాపురంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. ఈనెల 6న అత్త కిష్టమ్మ(75)ను ఎడమ చేతిపై పాము కాటేయడంతో మరణించింది. కాగా, ఈనెల 12న కోడలు ఎల్లమ్మ(52) ఇంటి అరుగుపై పడుకొని ఉంది. ఈక్రమంలో నాగుపాము ఆమె కాలిపై కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.