India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన హన్వాడ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఇబ్రహీంబాద్కి చెందిన శ్రీనివాస్గౌడ్(47) రోజువారీగా పనికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. కూలీ డబ్బులు తగ్గాయనే విషయమై భార్య లక్ష్మి ఆయనతో గొడవ పడింది. శ్రీనివాస్ పడుకున్నాక కొడుకుతో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఇన్స్రెన్స్ డబ్బుకోసమే ఆమె ఇలా చేసుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 22,483 మంది హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలన్నారు. 144 సెక్షన్ విధించాలన్నారు.

MBNR జిల్లాలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు https://www.swavlambnacard.gov.in UDID వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేంద్రబోయి సూచించారు. కలెక్టరేట్లో మీసేవ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. డేటా ఎంట్రీలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని మీసేవ కేంద్రాల నిర్వాహకులను ఆమె ఆదేశించారు.

✔రెండవ రోజు ముగిసిన రంజాన్ ఉపవాసం
✔సహార్: రేపు(మంగళవారం)-5:12
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల డ్రంక్& డ్రైవ్
✔పెండింగ్ చలాన్లు చెల్లించండి: ఎస్సైలు
✔లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి:SPలు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔రేపు చలోమాల- చలో అలంపూర్
✔ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రత్యేకంగా నిఘా
✔పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
✔వీజీ ట్రోఫీకి ఎంపికైన పీయూ క్రీడాకారుడు

✓భర్త వేధింపులు భరించలేక దుందుభి వాగులో పడి మహిళా మృతి.
✓ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు
✓ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ విజయేంద్ర బోయి
✓మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి వినతి పత్రం
✓జిల్లాలో మండుతున్న ఎండలు.. బయటికి రావాలంటే జంకుతున్న జనం.
✓అడ్డాకుల : కందూరు రామలింగేశ్వర స్వామి ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

ఓ మహిళ వాగులో దూకి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. గుండెడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి (38) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో భార్యను అవమానపరిచి నిందించాడు. అవమానం భరించలేక దుందుభి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం అరుణాచలానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న మహబూబ్ నగర్ డిపో నుంచి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. మార్చి 13 సా.6 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. మార్చి 14న అక్కడి నుంచి బయలుదేరి 15న ఉదయం మహబూబ్ నగర్ చేరుకుంటుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.