Mahbubnagar

News December 12, 2024

MBNR: ‘ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రైతులకు రుణాలు’

image

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు అందజేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ప్రియబ్రతమిశ్రా చెప్పారు. MBNR SBI రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ..రైతుల కోసం రైతులే నిర్వహించుకునే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తమ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News December 12, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు✔ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి✔నీటిపారుదల సమీక్ష..పాల్గొన్న ఎమ్మెల్యేలు✔పెబ్బేరు:కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు✔GDWL:TS- MESA జిల్లా సర్వసభ సమావేశం✔రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రుణాలు:DGM✔బాలానగర్:రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి✔గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్లు✔మోహన్ బాబు SORRY చెప్పాలి:ప్రెస్ క్లబ్✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News December 11, 2024

మరికల్: అంగన్వాడీ కేంద్రాలపై సైబర్ కేటుగాళ్ల.. జాగ్రత్త

image

అంగన్వాడి కేంద్రాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. బుధవారం మరికల్, నారాయణపేటలో డబ్బులు కాజేశారు. అంగన్వాడీ టీచర్లతో ఫోన్లో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడుగుతామని, మరికల్‌లో రూ.3వేలు, నారాయణపేటలో రూ.25వేలు దోచేశారని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితా సైబర్ నేలగాలకు చిక్కడంతో ఫోన్స్ వస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్పారు.

News December 11, 2024

తెలంగాణ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి ఎన్నిక

image

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి 53 ఓట్ల మెజార్టీతో  రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం కల్పించిన ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రం నలుమూలల క్రీడల పట్ల విద్యార్థులు, యువత ఆసక్తి పెంచుకునే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

News December 11, 2024

MBNR: నీటిపారుదల సమీక్షలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

హైదరాబాద్ జలసౌధలో బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని తమ తమ నియోజకవర్గాలకు పెండింగ్ పనులను, కొత్తగా చేపట్టబోయే పనులను గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తామని తెలిపారన్నారు.

News December 11, 2024

PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్.. ఈనెల 21 నుంచి పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.

News December 11, 2024

గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News December 11, 2024

మహబూబ్‌నగర్‌లో మృతదేహం కలకలం

image

గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెయిన్ గేట్ పక్కన రూం సమీపంలో ఓ వ్యక్తి చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుంది. అతడి రెండు చేతులు కొట్టేసి ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే 8712659312, 8712659334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని 2-టౌన్ ఎస్ఐ తెలిపారు. ఇది హత్యనా.. ప్రమాదమా తెలియాల్సి ఉంది.

News December 11, 2024

గద్వాల: ప్రేమ పెళ్లి.. అనుమానాస్పదంగా సూసైడ్

image

గద్వాల పట్టణంలోని భీమ్‌నగర్ కాలనీకి చెందిన <<14843542>>అనుమానాస్పదంగా <<>>పవిత్ర నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. బంధువుల, పోలీసుల వివరాల ప్రకారం.. మల్దకల్ మండలం మద్దెలబండకి చెందిన కుమ్మరి వినయ్- పవిత్ర రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వరకట్నం కోసం భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతోనే తన కుమార్తె సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు.

error: Content is protected !!