India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✔గద్వాల: యువతి అనుమానాస్పద మృతి
✔ఫీజు రియంబర్మెట్స్ విడుదల చేయాలి:BC సంఘం
✔MBNR: హౌస్ వైరింగ్..ఉచిత శిక్షణ,భోజనం
✔ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిల జననాలు
✔గండీడ్,గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం
✔15,16 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు: కలెక్టర్లు
✔కాంగ్రెస్ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం:BRS
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లాలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి విచారించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా యువకులకు ఎలక్ట్రిషన్(హౌస్ వైరింగ్)లో ఉచిత శిక్షణ,భోజనం,వసతి కల్పిస్తున్నట్లు ఎస్బwఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(SBRSETI) డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని,19-45 సం|| వయస్సు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాలకు 95424 30607, 99633 69361కు సంప్రదించాలని, ఆసక్తి గల యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO అధికారులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి.అత్యధికంగా గద్వాల జిల్లా సాటేర్లలో 33.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా మాగనూరులో 32.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లిలో 30.2 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 29.3 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో 28.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గుండుమాల్ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. కోస్గి మండలం గుండుమాల్కు చెందిన ఫయాజ్ అలీ మేకల మందపై ఆదివారం రాత్రి గుండుమాల్-పగిడిమాల్ ప్రాంతంలో చిరుత దాడి చేసి, ఓమేకను ఎత్తుకెళ్లి సమీపంలోనే చంపేసింది. గ్రామస్థులు FSO, FRO లక్ష్మణ్ నాయక్కు సమాచారం ఇవ్వంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దాడి చేసింది చిరుతే అని నిర్ధారించారు. దానిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా 15 మంది పట్టుబడగా.. 22 మందిని కోర్టులో హాజరు పరిచారు. రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి కేసులు ఉమ్మడి పాలమూరులోనే నమోదయ్యాయి. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే, లంచాన్ని ఉపేక్షించకండి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుదాం. లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం
హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతికగా చిత్రకారులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, తదితరులు ఉన్నారు.
✔ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ✔పాలమూరులో పెరిగిన కోడి గుడ్ల ధరలు ✔తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే ✔సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి:STU ✔గద్వాల: 13న ఐటీఐ అప్రెంటిస్ జాబ్ మేళా ✔Way2Newsతో JL సాధించిన అనిల్ కుమార్ ✔గ్రూప్-2 పరీక్ష.. ఏర్పాట్ల పై ఫోకస్ ✔NGKL: స్కూల్ అమ్మాయిలపై వేధింపులు.. ఇద్దరికి జైలు శిక్ష ✔విలేఖరులకు అండ TUWJ: మధు ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నేడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.1,06,04,436 సమకూరింది. ఈ ఆదాయం ఐదు నెలలు తర్వాత లెక్కింపులో ఇంత భారీ ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.