India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి <<15122838>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు, లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను MBNR, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
❤MBNR-2,62,311
❤కొడంగల్-2,46,526
❤జడ్చర్ల-2,24,477
❤దేవరకద్ర-2,40,980
❤నారాయణపేట-2,38,629
❤గద్వాల-2,58,460
❤వనపర్తి-2,75,059
❤మక్తల్-2,48,105
❤కొల్లాపూర్-2,41,460
❤షాద్ నగర్-2,43,260
❤కల్వకుర్తి-2,46,523
❤అచ్చంపేట-2,49,620
❤నాగర్ కర్నూల్-2,37,422
❤అలంపూర్-2,41,522
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 34,54,354 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 17,10,989, మహిళలు 17,43,276, ఇతరులు 89 మంది ఉన్నారు.
మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. బాలానగర్ మండల పోలీస్ స్టేషన్ను శుక్రవారం సందర్శించారు. పోలీసు సేవలపై అభిప్రాయాన్ని కోరుతూ.. క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్ షిప్ను చెల్లించాలని కోరారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని DSA స్టేడియం గ్రౌండ్లో నేటి నుంచి ఈ నెల 14 వరకు అండర్-17 హ్యాండ్ బాల్ జాతీయస్థాయి బాల, బాలికల ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SGF అధికారులు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 1550 మంది క్రీడాకారులు హాజరవుతుండగా.. బాలికలు-36, బాలురు-35 రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. ఉదయం,రాత్రి సమయాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్కు 320 బస్సులు అదనంగా నడపనున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడుపుతున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
ఈ నెల 16న జైపాల్ రెడ్డి 83వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ వద్ద జయంతిని నిర్వహించేందుకు నిర్ణయించారు. జైపాల్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.1998లో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు.
చట్టాలపై అవగాహన పెంచుకుని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మనోన్యాయ్ కమిటీ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పిల్లల చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై పలు సూచనలు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి రూ.14 కోట్లకు ఆస్తిపరుడు. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.14 కోట్లు దేవుడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు ఈవో రంగాచారి వెల్లడించారు. ఆ మొత్తానికి వచ్చిన వడ్డీని సైతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.