India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొడంగల్ యువకుడు జాక్ పాట్ కొట్టాడు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్లో రూ. 2కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో అప్లయిడ్ సైంటిస్ట్గా బొంరాస్పేట మం. తుంకిమెట్ల యువకుడు సయ్యద్ అర్బజ్ ఖురేషి(26) సెలక్ట్ అయ్యారు. పట్నా ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన ఇతడు USAలోని UMASS యూనివర్సిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్లో MS పట్టా పొందారు.
రాహుల్ గాంధీ జోడోయాత్ర 2022 OCT 23న తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక సరిహద్దు టై రోడ్డులో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాత్ర 3 రోజుల విరామం తర్వాత OCT 27న నారాయణపేట జిల్లాలో పునః ప్రారంభమైంది. ఈ క్రమంలో MBNR జిల్లా సరిహద్దు సీసీకుంట మం. లాల్ కోట ఎక్స్ రోడ్లో మరో విగ్రహం ఆవిష్కరించారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. రూ.50 ఫైన్తో ఈనెల 10లోగా చెల్లించాలని, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
✔మా జీతాలు పెంచండి సీఎం సారు:TUCI✔గట్టు: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి✔మా హయంలో భీమా సౌకర్యం కల్పించాం: శ్రీనివాస్ గౌడ్✔రాజోలి: సుంకేసుల బ్యారేజీ గేట్లు క్లోజ్✔ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు✔PUలో సౌత్ జోన్ ఎంపికలు✔NGKL:రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు✔పలు మండలాలలో సర్వే పూర్తి✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔మహా పడిపూజలో ఎంపీ డీకే అరుణ, ఉమ్మడి జిల్లా నేతలు✔సీఎంను కలిసిన జిల్లా నేతలు
మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం అని ప్రముఖ కవులు జనజ్వాల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త కే లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు ఈనెల 14న MBNRలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం కంటే ముందు మనుషులని, మానవత్వమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు.
హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఉద్ధరిస్తారని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారనుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నిన్న రూ. 79 పెంచి రూ. 1000 జీతం పెంచామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నప్పుడే హోమ్ గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగాNRPT జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో 12డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.0నుంచి 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలో జరిగిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. పెద్దమందడి మం. ముందరితండాకు చెందిన సాయి పునీత్(15) బలిజపల్లి స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ పునీత్ గ్రౌండ్లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతిచెందిటన్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు.
విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వరకు ఫైన్ తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు.
Sorry, no posts matched your criteria.